నిజం..నిర్భయం

Saturday 29 January 2011

బ్రాహ్మణులు ఎందుకు ద్వేషింపబడుతున్నారు?

గమనిక: ఈ టపా మురుగు లేదా మురికి మురుగంటే సహజంగానే ఇష్టపడే మహిషిల పిచ్చిమాటలకి ఎదురుసమాధానం కాదు!

చరిత్రపుటలలో ఎవరైతే అమానుష౦గా చంపుట, దోచుకునడం, మానభ౦గ౦ గావి౦చడ౦ మరియు నీచాతినీచకృత్యాలు చేసారో వారు ఈ నవీన భారతదేశంలో క్షమించబడ్డారు, గతాన్ని తవ్వుకోగుడదు అనే పేరుతో. ఇంకా చెప్పాలంటే వారు ఏంతో వైభవముతో లక్ష్మీసరస్వతుల నిలయంగా విలసిల్లిన మన సాంస్కృతిక వారసత్వాన్ని మట్టుపెట్టారు. అయినా వారిని క్షమించేశా౦. అయితే చరిత్రలో ఈ దేశధర్మాన్ని రక్షించడంకోసం మరియు సంఘ౦ యొక్క మంచి కోసం తమ జీవితాలని మనఃపూర్వక౦గా తృణప్రాయంగా త్యజించిన బ్రాహ్మణులుని మాత్ర౦ ఈ నవీన భారతదేశ౦ అసత్యారోపణలతో అడుగడుగునా అవమానాలాకు గురిచేస్తుంది.


గత కొన్ని దశాబ్ధాలుగా ఈ నవీన చరిత్రకారులచే చెప్పబడింది ఏమనగా భారతీయ బ్రాహ్మణులు భారతదేశంలోని తక్కువ కులాలని అణచివేస్తూ ఉన్నారు. ఇంకా బ్రాహ్మణులు అంటే మోసపూరితమైన వాళ్ళు, పరుల మీద ఆధారపడి జీవించేవాళ్ళు మరియు సామాజిక సమతుల్యత లేని కులవ్యవస్థని తయారు చేసిన వాళ్లుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. బ్రాహ్మలు ఇతరులని చదవడం మరియు రాయనిచ్చేవారు కాదనీ చెప్పారు. అలాగే మిగలిన ప్రతి కులాన్ని కట్టుదిట్టమైన reservation కోసం వెనుకబడిన కులాల్లో ఉంచడం కోసం "బ్రాహ్మణులు గావించిన 5000 సంవత్సరాల అణచివేత" అనే అసంబద్దపు వాదాన్ని తమకనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ అసంబద్ధపు వాదాలన్నీటినీ తిరిగితిరిగి తోడుతూ వాటిని నిజం అని అంగీకరింపజేసే స్థితికి తీసుకువచ్చారు.


ఈ విధంగా అబద్దాన్ని నిజం చేసే కుటిలప్రయత్న౦లో ఎందరో మేథావులు, చరిత్రాగ్రగణ్యులు తమ వంతు పాలు పంచుకున్నారు విషం చల్లడానికి. గత రెండు దశాబ్దాలుగా వీరు తమనితాము కాపాడుకునే ప్రయత్నమంటూ కట్టుకున్న అద్దాలమేడ "బ్రాహ్మణ విద్వేషం". ఇలా ఇన్ని అంటున్నా ఏమీ అనలేని బ్రాహ్మని బేలస్థితిని, కర్మ సిద్దాంతాన్ని పావుగా చేసుకుని మరింత బెంబేలెత్తించడానికి అసలు "బ్రాహ్మణుడు" అన్న పద౦ వింటేనే గర్వపరుడు, అగౌరుడు మరియు తక్కువ కులాల్ని లేదా దళితుల్ని చచ్చేవరకు కొట్టేవాడు అన్న ఆర్తనాదకపూర్వకమైన అర్థాన్ని ఇచ్చారు. ఈ మాత్రంచాలదూ!, ఆ పదం వింటే చాలు విన్న వారి మనసులో బ్రాహ్మల గురించి విషభావాలు నాటుకు పోవడానికి.

అదే కుహనా మేథావులు పదేపదే వల్లే వేసి మరీ చెబుతున్నారు, బ్రాహ్మలు మిగిలిన కులాలని తమకోసం ఉపయోగించుకున్నారు మరియు ఇంకా జరుగుతుంది కూడా అదే అని. అంతే కాదు, హిందూ ధర్మ గ్రంధాలు కేవలం వారిని ఈ సామాజిక కులవ్యవస్థలో అగ్రభాగాన నిలపడానికి వారికై వారు రచించుకున్నవి మాత్రమే అని మరియు భారతదేశంలో ఉన్న అన్ని సమస్యలకి వారే బాధ్యత వహించాలని.

కానీ ఈ వాదాలు పూర్తిగా అవగాహనారహిత్య౦తో కూడి అసంబద్దమైనవి మరియు చారిత్రకపూర్వకమైన ఆధారలేమితో కొట్టుమిట్టాడుతున్నవి. సునిశితంగా చెప్పాలంటే ఇది "చెప్పిన అబద్దమే వందసార్లు చెబితే అది నిజం" అయి కూర్చుంటుంది అన్నరీతిలో!

సరే మరి, మన౦ ఇప్పడు ఎలాంటి ఆందోళనలతో కూడిన అభ్యంతరాలు లేకుండా ప్రశాంతచిత్త౦తో కాసేపు నిజాలతో కూడిన వాస్తవాల గురించి చర్చించుకుందా౦. మన ఆలోచనావిధానాన్ని పక్కవాడికి అప్పిద్దామా?

ఒక్కసారి నిస్వార్థ౦గా, స్వచ్చముగా, సతర్కముగా ఆలోచించగలిగితే, బ్రాహ్మ్మల్లో 95% మంది అమాయకులు మరియు సహృదయులు అని తెలుస్తుంది. కానీ కొ౦దరు స్వార్తపూరితముగా అల్లిన కట్టుకథలు కాలానుక్రమంలో వాస్తవాలుగా మారడం ఒక విచిత్రమైన వింత!. ఇక ఈ బ్రాహ్మణ విద్వేషం వెనుకవున్ననిజానిజాలు అర్థం చేసుకోవడానికి పెద్ద పండితుడై ఉండనవసరం లేదు. ఒకసారి చరిత్రపుటల్లోకి తొంగి చూస్తే పరమత విద్వేషం కలిగి దండయాత్రలు చేసినవారు, బలహీనుల మీద పడి దోచుకు తినేవారు మరియు సేవల ముసుగున మతమార్పిడులు చేసేవారు తమ అవసరాలకోసం కనిపెట్టినదే ఈ బ్రాహ్మణ విద్వేషం! నేడు కొందరు "మురికి" పట్టిన రాజకీయనాయకులు, అవకాశవాదులు తమతమ స్వార్థావసారాలకనుగుణంగా బ్రాహ్మణ విద్వేషం అని "మొరుగు"తూ ఆ విద్వేషాన్నిమరింత పెంచి పోషిస్తున్నాయి! ఈ "పెంపు" ప్రజలని అచైతన్యులుగా కట్టిపడేసేందుకు, దేశాన్ని దోచుకునేందుకు మాత్రమే ఉపయోగం!

నిజానికి చరిత్రలో బ్రాహ్మలు ఎప్పుడూ ధనవంతులు లేక అధిపతులుగా కానీ లేరు. అడవిలో ఉన్న జింకని మిగిలిన హానికర జీవులు వెంటాడి వేటాడి తినాలని చూస్తాయి. ప్రస్తుత భారతీయ బ్రాహ్మణుడు ఆ అడవిలోని జింకకు నమూనా. నేటి భారతీయ బ్రాహ్మణ వర్గ౦ పరిస్థితి ఒకప్పుడు నాజీల ఏలుబడిలో ఉన్న జూ'స్(Jews) పరిస్థితికి ఏమాత్రం తీసిపోదు.

- గడచిన అనేక దశాబ్దాల్లో, ఎక్కువగా కిరస్తానీలు(Christians) మరియు ముసల్మాన్లు భారతదేశాన్ని పాలించారు. బ్రాహ్మలు ఎప్పుడూ పాలించలేదు. మరి అలాంటప్పుడు భారతదేశంలో జరిగిన అకృత్యాలకు బ్రాహ్మలు కారణమెలా అవుతారు?

- బ్రాహ్మలు ఈ దేశాన్ని పరిపాలించారని ఒక్క చారిత్రక ఆధార౦ ఎవరైనా చూపించగలరా? చాణక్యుడు అఖండభారతావనిని ఏకం చేయడానికి, దానికోసం చంద్రగుప్తుడిని కార్యోన్ముఖున్ని చేయడానికి ఏంతో కష్టపడ్డాడు. తర్వాత చంద్రగుప్తుడు భారతదేశానికి చక్రవర్తి అయ్యినప్పుడు చాణక్యుడిని తన రాజగురువుగా ఉండి అష్టైశ్వర్యాలు అనుభవించాలని కోరగా, అప్పుడు చాణక్యుడు ఇలా చెప్తాడు "నేను బ్రాహ్మణుడిని. నా కర్మ ప్రకారం నేను నా కడకు విద్యార్దియై వచ్చిన వారికి విద్య బోధించుట మరియు వారు బిచ్చమెత్తి తెచ్చినదాంట్లో పంచుకొని జీవించాలి. కావున, నేను నా స్వగ్రామానికి వెళ్ళాలి" అని.

- పురాణాల ప్రాతిపదికన తీసుకుంటే కూడా శ్రీమంతుడైన బ్రాహ్మణుడు అని ఒక్కడైనా ఉన్నాడా? ఏ పురాణం చెప్పింది ఆగర్భ శ్రీమంత బ్రాహ్మల గురించి? ఆగర్భ దరిద్రుడైన సుధాముడనే(కుచేలుడు) బ్రాహ్మణుడి కథ కృష్ణ పరమాత్ముడి జీవిత౦తో ముడివేసుకున్న వైనం అందరికీ తెలిసినదే. అసంగతమైనదైనా చెప్పవలిసినది, ఇక్కడ శ్రీకృష్ణుడు యాదవ ఉపకులానికి చెందినవాడు. నేటి భారతంలో యాదవులు ఇతర వెనుకబడ్డ తరగతుల్లో(OBCs) ఒకరు.

- ఒకవేళ నవీన చరిత్రకారులు చెప్పినట్లు నిజంగానే బ్రాహ్మలు దురహంకారం, కులజాడ్యం కలవారైతే అదే న.చ.కా లు చెప్పబడే తక్కువ కులాల నుంచి వచ్చిన వారిని దేవుళ్ళుగా ఎందుకు పూజిస్తున్నారు? కొని సోదహారణలుగా యాదవ కుల శ్రీకృష్ణుడు, కొన్ని పురాణాల్లో చెప్పబడినట్లు పరమేశ్వరుడిది కిరాత కులం. కిరాతలు(ఎరుకలు) నేటి నవీన భారతదేశంలో వెనుకబడిన గిరిజిన జాతికి చెందిన వారిగా చెలామణి అవుతున్నారు.

- ఇతరుల అణచివేతకి ఉన్నత పదవి దానికి తగిన అధికారం కావాలి, ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. బ్రాహ్మణులు పర౦పరాగతమైన దేవాలయ అర్చకవృత్తి లేదా దైవీసంబందమైన కర్మలను జరిపించే పురోహితులుగా ఉన్నారు. బ్రాహ్మణేతర ఇంటి యాజమానుల నుంచి వచ్చే భిక్ష మాత్రమే వారి జీవనాధారం. అలాగే వారిలో కొంతమంది జీతం లేకుండా గురువులుగా జీవనాన్ని గడిపేవారు. మరి ఇప్పుడు చెప్పిన బ్రాహ్మణ వృత్తులు ఇతరులని అణచివేసే౦త శక్తివంతమైనవా? దీనికి సమాధానంగా "రాజులచే చెప్పి చేయించారు" అని చెప్పే కొంతమంది మురుగు మూర్ఖ శిఖామణులు ఉండనే ఉన్నారు. ఈ మూర్ఖులు చెప్పింది నిజమే అయితే మహామంత్రి తిమ్మరుసు గుడ్డివాడయ్యేవాడు కాదు, కవి సార్వభౌముడు శ్రీనాధుడు చివరి రోజుల్లో అంతులేని ఆవేదనకు గురయ్యేవాడు కాదు!

- ఇంకా వాస్తవాలని మరింత లోతుగా పరిశీలిస్తే, చాలామంది దళితులని(హిందూ) అణచివేసింది భూస్వాములు అనబడే జమిందారులు, బ్రాహ్మణులు కాదు అన్న కఠినమైన నిజం పైకి వస్తుంది. అలాగే ఇతర వెనుకబడ్డ వర్గాలు కూడా దళితులని అణచివేసారు. కానీ బ్రాహ్మలు మాత్రం బలిపశువలయ్యారు.

- బ్రాహ్మణ వర్గంలో పురోహిత బ్రాహ్మణులు 20%. మిగిలిన అన్ని వర్గాల్లోని/మతాలలోని పూజారుల్లాగా, వారిలో కొందరు కోరిక, కాంక్ష గలవారయి ఉండి ఉండవచ్చు

- బ్రాహ్మణేతరులని చదవవద్దు అని ఎవరూ చెప్పలేదు. బ్రాహ్మణులు చాలావరకు విద్యాభిలాషియై ఉన్నారు. ఈ విద్య వారిని ఆధ్యాత్మికంగా శక్తివంతులుగా ఉంచుటకు తోడ్పడింది. కానీ ఇది కొందరిలో ద్వేషాన్ని రగిల్చింది. ఇది ఎవరి తప్పు? ఒకవేళ కొంతమంది న.చ.కా లు చెప్పినట్లు చదవడం/రాయడం లేదా విద్యనభ్యసిచడం కేవలం బ్రాహ్మలకు మాత్రమే అయితే, వాల్మీకి మహర్షి రామాయణంని, వ్యాసుడు భారతాన్ని, మొల్ల రామాయణాన్ని, తిరువళ్లూర్ తిరుక్కురాల్, అలాగే ఎంతోమంది బ్రాహ్మణేతర మహర్షులు భక్తీ భావాలు ఎలా పలికారు/రాయగలిగారు? దీనికి కప్పదాటు సమాధానం తప్ప అర్థవంతమైన స.ధా ఏవైనా ఉందా? బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఇతరుల విద్యాభిలాషను ఎన్నడూ అడ్డుకో ప్రయత్నించలేదు.

- ఈ న.చ.కా లు పదేపదే వల్లె వేసే మనుస్మృతి ధర్మశాస్త్రాన్ని రాసి౦ది మనువు. ఈ ఒక్క ధర్మ శాస్త్రంలోనే బ్రాహ్మణులుకి ఉన్నతస్థానం కల్పించబడింది. కానీ మనువు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు. చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన ఉన్న గీతాశాస్త్రంని రాసిన వ్యాసమహర్షి పుట్టినది వెనుకబడిన కులానికి చెంది చేపలు పట్టుకుని జీవించే ఆడకూతురుకు. అన్ని ధర్మశాస్త్రాల్లో గుణ గణాలు బట్టి బ్రాహ్మణుడి గొప్పతనం చెప్పాయి కానీ పుట్టిన కులాన్ని బట్టి కాదు. ఏ కులంలో పుట్టినా మంచి గుణగణాలు కర్మ రూపేణా కలిగి ఉంటే వారు బ్రాహ్మలు అని కూడా గీత చెప్పింది. వీటికి దృష్టాంతాలే ధర్మవ్యాధుడు, విశ్వామిత్రుడు.. మొ.గు. కానీ రంద్రాన్వేషకులకి ఇది తలకెక్కదు.

- అసహాయులైన పేద బ్రాహ్మలు అరబ్బీ దండయాత్రీకులచే వధి౦పబడ్డారు, పోర్చుగీసువారు క్రూరమైన విచారణల పేరుతొ చేసిన అమానుష చర్యలతో హత్యగావి౦ప బడ్డారు, ఆంగ్లేయ కిరస్తానీ మిషనరీలు స్వార్థపూరిత అసత్యారోపణలతో బాధించారు మరియు ఇప్పుడు వారి సోదర సోదరీమణులచే మానసికంగా హత్య చేయబడుతున్నారు.మరి వీరిలో ఎవరైనా ఎదురుతిరిగి పోరాటం చేశారా?

-నవీన భారతదేశంలో కాశ్మీరీ ఆదివాస్తవ్యులైన పండిట్లు ఇస్లామిక్ తీవ్రవాదుల అమానుష హింసకు బలయ్యి తోబుట్టువుల్ని పోగొట్టుకుని, స్వస్థలాల్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళవలిసిన అగత్యం ఏర్పడింది. ఒక పథకం ప్రకారం కాశ్మీరి పండిట్ల మీద చేసిన ఈ దారుణ మారణ కాండలో చివరకు తీవ్రవాదం ఒక పురాతన భారతీయ వర్గానికి చెందిన ప్రాంతాన్ని ఆక్రమించుకోవటంలోనూ, మట్టుపెట్టటంలోనూ సఫలీకృతం అయింది. ఈ మతవిద్వేషాన్నుంచి తప్పించుకోవడం కోసం సుమారు అయిదు లక్షలకు(500000) పైగా కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు. సుమారు యాభైవేల(50,000) మంది కాశ్మీరీ పండిట్లు పుట్టిన గడ్డ మీద మమకారం చావక ఇప్పటికీ జమ్ము మరియు డిల్హీలలో వలసదారులుగా దైన్యమైన బ్రతుకులో జీవనం గడుపుతున్నారు. ఇది ఏమి ప్రజాస్వామ్యం? మతం పేరుతొ మారణహోమ౦ సృష్టించిన ఈ తీవ్రవాదులు చేతిలో పండిట్లు మన,ధన, ప్రాణాలు కోల్పోయారు.మరి ఎదురుతిరిగి మారణహొమ౦ సృష్టించిన ఒక్క పండిట్ ని చూపించగలరా?

- భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు ముస్లి౦ చరిత్రకారులని ఉదహరిస్తూ ఈ విధంగా చెప్పారు " మొదటి అరబ్బు దండయాత్రీకుడు మొహమ్మద్ బిన్ ఖాసిం మతవిద్వేషంతో రగిలిపోతూ చేసిన మొదటిపని భారతీయ బ్రాహ్మణులకి సున్తీ(circumcision) చేయించడం, అందుకు ఒప్పుకోని వాళ్ళలో పదిహేడేళ్ళ పైబడిన వారిని చంపడం". ఈ మొగలుల దండయాత్రల సమయంలో సాగిన బలవంతపు మతమార్పిడులు, అమానుష దాడులలో వేలమంది బ్రాహ్మల తలలు నరికి వేయబడినవి. బ్రాహ్మణుడు పరమత మనిషిని చంపిన వైనాన్ని ఒక్కటి ఉదహరించగలరా?


- పోర్చుగీసులు భారతదేశానికి వచ్చినపుడు St. Xavier పోర్చుగల్ మహారాజుకి ఈ విధంగా ఉత్తరం రాశాడు "భారతదేశంలో బ్రాహ్మలు లేకపోతే మిగిలిన హిందువులని(pagans) మనం మతానికి తార్పిడి చేయవచ్చు, తద్వారా ఊడిగం చేయించుకోవచ్చు. ఈ ఊడిగానికి మొదలు బ్రాహ్మ్మల్ని ద్వేషించడమే, ఇది మతప్రచాకులు మొదలుపెట్టాలి" అని. ఈ విధమైన దురుద్దేశంతో అడుగుపెట్టిన వారు బ్రాహ్మణుల్ని నరకయాతనలకి గురిచేశారు. గోవాలో వేలమంది కొంకణి బ్రాహ్మణులని చావువరకు తీసుకెళ్ళి వదిలారు. కొంకణి బ్రాహ్మణులు తమ సర్వస్వం కోల్పోయారు. మరి వారిలో ఏ ఒకరైనా తమ కులం కోసం ఎదురుతిరిగి పోరాటం చేశారా?

- నేడు బనారస్ లో చాలామంది రిక్షాకార్మికులు బ్రాహ్మలు. అలాగే డిల్హీ రైల్వేస్టేషన్లో యాబైశాతం పైగా బ్రాహ్మలు కూలీలుగా, రిక్షాకార్మికులుగా జీవనాధారం సాగిస్తున్నారు. ఇంకా అదే డిల్హిలో చాలామంది పారిశుధ్యకార్మికులుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 75 శాతం పైగా బ్రాహ్మలు వంటపని చేస్తూ బతుకు తున్నారు. దారిద్రరేఖ దిగువన బతుకుతున్న బ్రాహ్మలు అరవై శాతం పైనే. ఇవన్నీ వాస్తవ గణా౦కాలు, ఎవరో సృష్టించినవి కావు. వీటిని ఇక్కడ ప్రస్తావించడానికి కారణం అరకొర మేతావుల కోసం. బ్రాహ్మలు ఈ పనులు చేస్తేనే "ఏదో" సామాజిక న్యాయం ఒనగూరుతు౦దని చెప్పే అపరమేతావులూ, మరి సామాజికన్యాయం వచ్చిందా?

- కొంతకాలం కిందట కర్నాటక ప్రభుత్వం వర్గాల వారిగా ఒకరి తలసరి ఆదాయాన్ని(per capita income) లెక్కకట్టి, ఆ రాష్ర ఆర్థికమంత్రి ఇలా చెప్పారు: కిరస్తానీయులు (Rs) 1,562, వోక్కలిగాస్ Rs 914, ముస్లిమ్స్ Rs 794, SC Rs 680, ST Rs 577 మరియు బ్రాహ్మణులు Rs 537.

- తమిళనాట జనాభా లెక్కల ప్రకారం రఘునాథస్వామి గుడిలో పనిచేసే అర్చకుని నెలసరి ఆదాయం Rs 300. అదే దేవళంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చే నెలసరి ఆదాయం Rs 2,500 పైన. ఇంతటి పచ్చినిజాలు ఎగదోసుకువస్తున్నా అవి పురోహిత వర్గం పైన ఉన్న ధనవంతుడు మరియు స్వార్థపరుడు అన్న మాటలని తుడిచిపెట్టలేక పోయాయి. అవహేళనలు/అవమానాలు మాత్రం ఎక్కువ అయ్యాయి!

- పెరియార్ హాయంలో సాగిన హేయమైన భౌతిక దాడులకి తమిళ బ్రాహ్మణులు చాలా వరకు ప్రాణాలు అరచేత బట్టుకొని, ఒంటిబట్టలతో పక్కరాష్ట్రాలకి పారిపోయారు. తమిళనాట ఘోరంగా, అమానుషంగా అణచివేయబడిన బ్రాహ్మణ కులం ఇంకా అగ్రకులమే! మరి వీటికి ఏ కుల౦ బాధ్యత వహించాలి, ఎవరిని శిక్షించాలి?


పోనీ నాడు తమ స్వార్థం కోసం బ్రాహ్మణ విద్వేషం అనే పునాది తవ్విన మిషనరీలు "బ్రాహ్మణుల యొక్క అణచివేత" అని చెప్పింది సందేహాస్పదంగా ఉన్నాకూడా కాసేపు వాస్తవమే అనుకుంటే మరి దాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకు౦టున్న నేటి రాజకీయనాయకులు, స్వయంప్రకటిత మేతావుల మాటేమటి? అట్లే ముందుతరాలు చేసిన తప్పులకి తర్వాతితరాలు శిక్షింపబడాలని అని చెప్పే ఆటవిక న్యాయాన్ని నవనాగారిక సమాజం ఒప్పుకుంటుందా? పైన చెప్పి౦ది నిజమనుకున్నప్పుడు, కొంతమంది బ్రాహ్మణులు కులవ్యవస్థని తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అనుకుందాం. అందులో కొంతమంది బయటివారిని తమతో కలవనివ్వలేదని అనుకుందాం. కానీ కొంతమంది చేసిన పనికి మొత్తం బ్రాహ్మణ వర్గాన్ని తూలనాడడం ఎంతవరకు సబబు, అదీ తరతరాలుగా? మరి మనదేశ పురాతన వారసత్వ సంపదని, భారతీయ మాన,ధన ప్రాణాలని హరించిన అరబ్బీ దండయాత్రీకులని క్షమించిన మనం ఆ కొద్దిమంది బ్రాహ్మణులని ఎందుకు క్షమించలేకపోయా౦? తమ స్వలాభాలా కోసమే గదా!

ఈ మూర్ఖత్వం ఎన్నాళ్ళు? పోనీ వారేదో ఘోరాలు చేసారనే నువ్వు ఇప్పుడు ఎం చేస్తున్నావు?

వర్తమానంలో బ్రాహ్మణుడి పరిస్థితి రెండువైపులా పదునున్న కత్తిలా ఉంది. బ్రాహ్మణుడు విజయం సాధిస్తే "ఆ కుల౦ ధనవంతమైనది ఎలాంటి సహాయం అవసరంలేదు" అని అతని కులానికి ఆపాదిస్తారు. అదే విధంగా ఓకే బ్రాహ్మడు తప్పు చేస్తే ఆ తప్పుని మొత్తం కులానికి ఆపాదించి అందరినీ నలుగురిలో అవమానిస్తున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మడు ఎదుగుతున్నాడు అని అనిపిస్తుందో అప్పుడు ఈ విద్వేష వర్గం కట్టుగట్టి "గత౦లొ బ్రాహ్మలు మమ్మల్ని అణగదోక్కారు" అని ఒకేఒక్క కుంటిసాకు చెప్పి మరీ వారికి న్యాయంగా అ౦దవలిసినఫలాలని అందనీయకుండా చేస్తున్నారు. ఇదెక్కడి కబోది న్యాయం?

కాలంతో పరిగెడుతున్న ప్రపంచ౦(మన౦) గతాన్ని త్వరగా మరిచిపోతుంది. ప్రపంచం బ్రాహ్మణులు ఈ సమాజానికి చేసిన మేలుని మరిచారు. ఒక్క వేదాలు, లెక్కలు, గ్రహాధ్యయన౦ మరియు రాజనీతి శాస్త్రాలు నేర్పించటమే కాదు, ఆయుర్వేద, ప్రాణాయామ, శ్రుంగార, నాట్య శాస్త్రాలను మరియు యోగాలను తమ జీవితాన్ని ధారపోసి మానవాళి అభ్యున్నతి కోసం అందించారు. ఒకవేళ బ్రాహ్మణులు స్వార్థపరులై ఉండి ఉంటే వారు వీటన్నిటిమీద సర్వహక్కులు తీసుకునేవాళ్ళు. బ్రాహ్మణులు స్వార్థపరులే అయితే వారు రాసిన వేల కొలది పుస్తకాలకి తమ పేరు పెట్టుకునేవారు. బ్రాహ్మలు తమ జీవితాన్ని ఒకే మంత్రం గా "లోకా సమస్తా సుఖినో భవంతు" అని చెప్పి సమస్త మానవాళికి విజ్ఞాన అమృతాన్ని ధారపోసారు.

దీనికి ప్రతిగా, నేటి ప్రపంచం వారిని వెతలకి గురిచేస్తుంది అదీ అకారణంగా!


ఆధునిక బ్రాహ్మణులు వారి సంప్రదాయబద్దమైన జీవితాన్ని కొద్దికొద్దిగా వదిలేస్తున్నారు ఈ వెతలని భరించలేక! దానికి తోడు ఎ౦త మంచి చేసినా వచ్చే "అణచివేసారు" అన్న అసత్యఅపవాదుని అశాస్త్రీయంగా దిగమింగుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. నవీన భారతదేశంలో వారు నేటి స్వార్థపు సమాజ "ఇజాలు",వెన్నెముక లేని రాజకీయన్యాయం మరియు నీచపు కుతంత్రాల మద్య చిక్కుకుని అన్యాయంగా, క్రూరంగా శిక్షింపబడుతున్నారు.

ఎం? బ్రాహ్మణులు మనుషులు కారా? వారు తనవాళ్ళకి, తర్వాతి తరానికి సుఖమైన జీవితాన్ని, భాగ్యాన్ని అందరిలా కోరుకోకుడదా?

[ఆంగ్ల మూలం: Please stop Brahmin bashing]

164 comments:

Anonymous said...

ప్చ్. చాలా పేలవంగా ఉంది ఈ టపా. రాజేష్ అన్న,ఏందీ ఈ స్వకుచ మర్దనం?
/*ఒక్కసారి నిస్వార్థ౦గా, స్వచ్చముగా, సతర్కముగా ఆలోచించగలిగితే, బ్రాహ్మ్మల్లో 95% మంది అమాయకులు మరియు సహృదయులు అని తెలుస్తుంది.*/
ఇది ఎలా ?బ్రాహ్మణులు ఎమన్నా సపరేట్ గా పుట్టారా? మానవులంతా సమానమే అన్న. మిగతా ప్రజల్లో ఎంత మంది మంచి వాళ్ళు ఉన్నారో,బ్రాహ్మణులలో కూడా అంట మందే మంచి వాళ్ళు ఉన్నారు.ఇదే సూత్రం చెడుకి కూడా వర్తిస్తుంది.
/*నేటి భారతీయ బ్రాహ్మణ వర్గ౦ పరిస్థితి ఒకప్పుడు నాజీల ఏలుబడిలో ఉన్న జూ'స్(Jews) పరిస్థితికి ఏమాత్రం తీసిపోదు.*/
దీన్ని బట్టి మీకు రెండు విషయాలు తెలియవు.నాజీల ఏలుబడిలో యూదుల పరిస్థితి.నేటి బ్రాహ్మణ వర్గ పరిస్థితి.
/*బ్రాహ్మలు ఈ దేశాన్ని పరిపాలించారని ఒక్క చారిత్రక ఆధార౦ ఎవరైనా చూపించగలరా?*/
వెనకటి వరకు ఎందుకు.స్వాతంత్ర్యము తరువాత లెక్క చెప్తాను వినండి.
1 ) నెహ్రు
౨)లాల్ బహుదూర్ శాస్త్రి(పెట్టుడు శాస్త్రి అంటారు) అది ఎంత వరకు నిజమో తెలియదు
౩)ఇందిరా గాంధీ
౪)రాజీవ్ గాంధీ (ముస్లిం + బ్రహ్మిన్)
౫)pv నరసింహా రావు
౭)వాజ్పాయీ
గుల్జారీ లాల్ నందా,చంద్ర శేఖర్ ,మొరార్జీ దేశాయ్,ik గుజ్రాల్ ల గురించి తెలియదు.

/*కిరస్తానీలు(Christians) మరియు ముసల్మాన్లు భారతదేశాన్ని పాలించారు*/
కిరస్తానీలు ఏందీ,ముస్లిమ్స్ ఏందీ ఏ రాజు దగ్గర అయిన పనిచేసింది,వాళ్లకి సలహాలు ఇచ్చింది బ్రాహ్మణా వర్గమే అన్న. లెక్క చెప్ప మంటావా.ఆకాశం లో చుక్కలు సరిపోవు.
యీ కులాల కంపు వదిలేసి మానవులంతా సమానమే అని ఎవరన్న చాటి చెప్పండి అన్న.

Anonymous said...

నాకు తెలిసి బ్రహ్మినిజం(అన్ని కుల దురహంకారులకి వర్తిస్తుంది) వేరు,బ్రాహ్మణ కులం వేరు. నేను ఎమన్నా పొరబాటుగా అర్ధం చేసుకుంటే ఎవరన్నా కర్రెక్ట్ చెయ్యగలరు.
మానవ జాతిలో ఒక్క భారతీయులకి తప్ప వేరెక్కడ యీ కులాలు అని లేదు.దాన్నివెనుకటి బ్రాహ్మణులు డిజైన్ చేసారు. అందువలనే యీ కుల వ్యవస్థని బ్రాహ్మినిజం అంటున్నారేమే?
నాకు అర్ధం అయ్యింది ఇదే.

సాపాటు సమగతులు said...

@అప్పి-బొప్పి గారు

ఆహ్వానం! మంచి పెసినలు లేవనెత్తారు, ధన్యవాదాలు. ముందుగా మీ పెసినలకి నా జవాబులు చదివేముందు మరొకసారి ఈ టపా చదవమని మనవి. ఈ టపాలో ఏమాత్రం స్వకుచాలు లేవు, వాటికి మర్దనలు అసలే లేవు, ఉటంకించినవన్నీ వెతలు, పడ్డ బాధలు!

#ప్చ్. చాలా పేలవంగా ఉంది ఈ టపా
అయిఉండవచ్చు, నిజాలు కొద్దిగా బాధగానే ఉంటాయి. వెంటనే పేలకపోవచ్చు, స్వానుభవం అయ్యేవరకు!

#..స్వకుచ మర్దనం.. బ్రాహ్మ్మల్లో 95% మంది..
మీకు ఇక్కడి సందర్భం అర్థమయినట్లు లేదు. ఇక్కడ ఏ కులం మంచిది అన్న భేరీజు జరగలేదు. కేవలం తరతరాలుగు ద్వేషజాలానికి గురయిన ఒక కులం గురించి మాట్లాడుతున్నాం.
"కుల జాడ్యం - అణచివేత" అన్న పేరుతో గత దశాబ్దాలుగా బ్రాహ్మణులని ద్వేషిస్తున్నారు. మరి నిజంగానే వీరందరూ చెడ్డవాళ్ళా? ఇక్కడే మనం సహృదయంతో ఆలోచిస్తే బ్రాహ్మణులలో 95% మంది మంచివారు ఉన్నారు, వీటికి పెక్కు ఉదాహరణలు కనిపిస్తాయి . ఆ మిగిలిన 5% శాతం ఒకవేళ చెడుచేసి ఉంటే మొత్తం బ్రాహ్మణుల్ని తూలనాడాల్సిన అవసరం ఏమిటి? ఏ సమాజం ఈ సిద్దాంతం నేర్పించింది అని? మీరు కాదు, 100% శాతం తప్పు చేసారు అంటే అది మీ విజ్ఞత! కాకపొతే ఒక విన్నపం. అసలే కులగజ్జితో కొట్టుకుంటున్న వారికి మీరు "...సపరేట్ గా పుట్టారా" అన్న లేని భావనల్ని కలుగజేయకండి లేదా ఉన్నవాటిని ఎక్కువ చేయకండి.. ప్లీచ్.

#దీన్ని బట్టి మీకు రెండు విషయాలు తెలియవు.నాజీల ఏలుబడిలో యూదుల పరిస్థితి.నేటి బ్రాహ్మణ వర్గ పరిస్థితి.
మీకు తమిళనాట ఒకనాడు బ్రాహ్మణులు పడిన, ఇప్పుడు పడుతున్న వెతలు తెలీవు అనుకుంటా! ఒక సారి చదవండి. మొన్నటికి మొన్న అకారణంగా బ్రాహ్మణయువకుల శిఖలు కోసిన ఆటవిక పరిస్థితి ఏమిటి? ఇక యూదుల గురించి చెప్పింది, ఏదో టపాలో గొప్పగా ఉంటుందని కాదు. తమిళనాడులో అప్పుడు బాధలు పాడిన వారు తమ పరిస్థితులని యూదులతో పోల్చుకున్నారు? తప్పా? ప్రతీది స్వానుభవం అయితే కానీ నే నమ్మ అంటే అది మూర్ఖత్వ్వమే అవుతుంది!

#ఒక్క చారిత్రక ఆధార౦.... వెనకటి వరకు ఎందుకు.
మీరు మరలా ఇక్కడి సందర్భం మరిచారు. బ్రాహ్మలు ఈ దేశాన్ని దోచుకుతిన్నారు. ఈరోజుల్లో బాధలకి వారే కారణమని చెప్పేవారికి ఇక్కడ ఇచ్చిన సమాధానం. అరబ్బులు,పోర్చుగీసులు, ఆంగ్లేయులు మొ|| వారు ఈ దేశంలోకి అడుగుపెట్టాక ముందు భారతదేశం రత్నగర్భఅని అప్పుడు వచ్చిన ఎందరో చైనా, జర్మనీ, పర్షియా చరిత్రకారులు తమదేశ చరిత్రలో రాసుకున్నారు. కొద్దిగా వీటిని చదవండి. అలాగే మాక్స్ ముల్లర్ ఏ దేశాన్ని తొలిసారిగా చూసినపుడు ఏమన్నాడో ఒకసారి చదవండి! మరి అలాంటిది వారు పాలించి దోచుకున్న తర్వాత పరిస్తితులకి బ్రాహ్మలు కారణం ఎలా అయ్యారు అన్నది?

#కిరస్తానీలు ఏందీ,ముస్లిమ్స్ ఏందీ ఏ రాజు దగ్గర అయిన పనిచేసింది,వాళ్లకి సలహాలు ఇచ్చింది బ్రాహ్మణా వర్గమే అన్న. లెక్క చెప్ప మంటావా.ఆకాశం లో చుక్కలు సరిపోవు.

పర్లేదు చెప్పు, నే లెక్క పెట్టుకుంటా! ఏ ముస్లిం రాజు దగ్గిర వారికి సహాయంగా ఉంటూ హిందువులని మట్టుపెట్టిన బ్రాహ్మణులు ఎవరో చెప్పు?

#యీ కులాల కంపు వదిలేసి మానవులంతా సమానమే అని ఎవరన్న చాటి చెప్పండి అన్న.
నిజానికి ఇది చెప్పుకోవడానికి మాత్రమె బహు శ్రేష్టమైన మాట. మీకు నిజ్జంగా ఏదో ఒక రత్న ఇవాల్శిందే! కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు చేతులు కలిస్తీ కానీ చప్పట్లు రావు. నిజానికి ఈ టపాలో కుల కంపు లేదు, కేవల౦ ముందు చెప్పినట్లుగా ఒక అకారణ ద్వేషానికి గురై ఒక కుల౦ పడిన, పడుతున్న వెతలు గురించి వివరించడమే! ఇవి చరిత్రలో కనుమరుగవుతున్న నిజాలు!

Anonymous said...

మంచి టపా. బాగా రాశారు. అప్పి బొప్పి వ్యాఖ్యలు వారి మానసిక పరిస్థి సరిగా లేదని తెలియ జేస్తున్నాయి. ఆయన రాయొచ్చు గదా పేలిపోయే ఒక టపాని.

సాపాటు సమగతులు said...
This comment has been removed by the author.
సాపాటు సమగతులు said...

#నాకు తెలిసి బ్రహ్మినిజం(అన్ని కుల దురహంకారులకి వర్తిస్తుంది) వేరు,బ్రాహ్మణ కులం వేరు.
అవును నిజమే, రెండూ వేరు. బ్రాహ్మినిసం అంటే సృష్టికి ఆధారభూతుడైన ఆ పరబ్రహ్మని చేరుకునే ఒక మార్గం లేదా తెలుసుకునే పద్దతి. అలాగే బ్రాహ్మణ అంటే అదో కులం, పుట్టుకతో వచ్చేది కాదు. స్వగుణాలతో రాజిల్లితే ఎవరైనా బ్రాహ్మలు అవ్వచ్చు అని. దానికి ఉదాహరణలుగా రాజైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవ్వడం.

ఇది గతకాలపు మాట. నేడు బ్రాహ్మణుడు అంటే అది ఒక కులంగా అందరూ భావిస్తున్నారు. అలాంటప్పుడు "బ్రాహ్మణ భావజాలం అని దీనిపేరు బ్రాహ్మనిసం" అని పేరు పెట్టారు న.ఛ.కా లు. ఇక ఇప్పుడు వచ్చి వాస్తవాలు వెల్లడి అవ్వగానే ప్లేటు ఫిరాయించి బ్రాహ్మణులకి, బ్రాహ్మనిసంకి సంబధం లేదు అని పై పూట పూస్తున్నారు. కానీ జరగాల్సింది జరిగిపోయింది. ఎక్కడైనా బ్రాహ్మనిసం మరియు దుర.. భావాలు అంటే అది కచ్చ్చితంగా బ్రాహ్మలకి సంబందిన్చినదే, బ్రాహ్మడు ఏదో చెడు చేసాడు అనే భావన కలగజేస్తుంది అంతే గానీ అది కులజాడ్యం పాటించే కులాలకి సంబందించింది అనే భావన రాదు. పోన్లే అనుకున్నా, ముందు చెప్పినట్లు బ్రాహ్మనిసం అనే పదానికి పవిత్రమైన భావన ఉంది.

కనుక ఈ న.ఛ.కా. లు, స్వ.ప్ర.మేధావులు కలిసి ఈ కుల జాడ్యానికి ఎవరికీ అవ్హమానకరంగా ఉండకుండా ఒక కొత్తపదం కనిపెట్టమని మనవి.


#మానవ జాతిలో ఒక్క భారతీయులకి తప్ప వేరెక్కడ యీ కులాలు అని లేదు.
"కులం" అన్న పేరు కాకపొతే కొట్టుకు చచ్చేదానికి, పక్కవారిని అణగాదోక్కేదానికి పలు పేర్లు విశ్వమంతటా ఉన్నాయి.

#దాన్నివెనుకటి బ్రాహ్మణులు డిజైన్ చేసారు. అందువలనే యీ కుల వ్యవస్థని బ్రాహ్మినిజం అంటున్నారేమే?

ఈ డిజైన్లు, డెవలప్మెంట్లు పక్కన బెడితే, మీరు చెప్పిన వ్యవస్థకి "బ్రాహ్మినిజం" అనడం తప్పు పైన చెప్పిన కారణాల వల్ల.

Anonymous said...

@అప్పి బొప్పి,
ఎంతో బాలెన్సెడ్ గా ఇక్కడ రాసిన వ్యాసాన్ని పేలవం గా ఉంది అని నోరు పారేస్కోవడం గాదు. నీ పేరు మొదలుకొని అన్నిటిని దాచి పెట్టుకొని ఇతరులను పెద్ద ప్రశ్నించావ్ లే. నువ్వు ఇతరులను పిచ్చి పువ్వు ప్రశ్నలతో మళ్ళి గోకుదువు గాని ముందర నీ బ్లాగును తెరచి నీ వర్గం మీద నువ్వు కూడా స్వకుచ మర్ధన మొదలు పెట్టుకో ఎవ్వరు వద్దన లేదు.

V R RAO

Anonymous said...

బ్లాగు వేశ్య అప్పి-బొప్పి జిందాబాద్

రాజేష్ జి said...

$V R RAO గారు,
ధన్యవాదాలు.
# నీ బ్లాగును తెరచి నీ వర్గం మీద నువ్వు కూడా స్వకుచ మర్ధన మొదలు పెట్టుకో
:) నిజానికి బొప్పాయ గారు ఇక్కడ అదే చేసారు .. కాకపొతే స్వకుచ కాదు "స్వ మర్దన" అన్నమాట :) . అర్థమయింది అనుకుంటా!

రాజేష్ జి said...

నిజమే! కులజాడ్యం నశించాలి. మరి ఈ కులజాడ్యానికి "బ్రాహ్మనిసం" లేదా "బ్రాహ్మణభావజాలం" అనే generalization (పై పూత) ఉపయోగిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఎవరు ఎంత గింజుకున్నా పై రెండు పదాలు ప్రస్తుతం ఒక కులాన్ని ఎత్తి చూపుతాయి, ఇది నిర్విదాంశం.

ఇక్కడ నా స్వానుభవం ఒకటి గుర్తుకువస్తుంది.

మా పాత ప్రాజెక్ట్ లో ఆరుగురు టీం మెంబర్స్ నాతో కలిపి. సాధారణంగా చాలావరకు ఒక టీం లో జనాభాని బట్టి 5-10% పని చేయరు. ఏదో పైపైన షో ఇచ్చుకుంటూ ఉంటారు. మిగిలినవారు వీరి పని కూడా చేస్తూ ఓ తెగ కష్టపడుతూ ఉంటారు. సో ఈ కొద్ది % టీం లో ఉన్నా లేనట్లే. అంతా బానే ఉంటుంది, కానీ సమస్య వచ్చేదల్ల్లా డెడ్లైన్లు ఎదురయినప్పుడు, రిలీజ్ టైంలో ఏదైనా తప్పు జరిగి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి వచ్చినపుడు. అలాగే ఈ పనిచేయని కొద్ది % చేసిన కోడింగ్/పని వల్ల కొన్ని ఇబ్బందులు, అదీ రిలీస్ టైం లో ఇంకా ఎక్కువ.

సరే , ఇక ప్రాజెక్ట్ మానేజర్ ఉంటాడు గదా . మాకు ఈ కొద్ది % వల్ల కస్టమర్ కి ఎప్పుడైనా సమస్య వచ్చి ఎస్కలేట్ చేస్తే మా ప్రో.మా షరా మామాలుగా మీటి౦గ్ పెట్టేవాడు. ఇక్కడే అసలు విషయం. ఈ ప్రో.మా ఎంతసేపూ టీంలో ఎవరూ బాగా చెయ్యట్లేదు. పని తీరు బాలేదు. ఇలాంటి ఎస్కలేషన్ ఇక ముందు జరగకూడదు అని చెప్పేవాడు. అంతేకానీ ఎవరు పనిచేయట్లోదో లేదా ఎవరివల్ల సమస్య వచ్చిందో వారిని గుర్తించి వారికి తెలిసేట్టు చెప్పడం కానీ లేదా కౌన్సిలింగ్ తీసుకోవడం కానీ చేయడు. పైన చెప్పినట్లు "టీం" అనే పూత పూసి ఇటు పనిచేసే వాళ్ళకి కూడా బాధ తెప్పించేవాడు.
ఇక అతను అసలు సమస్య కి పూత పూసినంతకాలం అది సమస్యగానే ఉండింది. ఇక చేసేదిలేక అందరు(పని చేసే) కలిసి కొత్త ప్రో.మా ని అడిగాం. తర్వాత ఆ కొత్త ప్రో.మో మా ద్వారా అసలు సమస్యని తెలుసుకుని వారి మీద దందోపాయం ప్రకటించి దారిలోకి తెచ్చాడు. కొద్ది కాలం తర్వాత పాత ప్రో.మో "టీం" పూత వెనకవున్న అతని స్వార్థ౦, చేతకానితనం చిన్నగా బయటపడ్డాయి! అది వేరే సంగతి!

అది సంగతి! అర్థం అయితే పదివేలు :)

Anonymous said...

మీ వ్యాసం ఆలోచింప చేసేదిగా వుంది. అంతటి బలహీనమైన సామాజిక వర్గం(<5%?) అంటే కొందరికి అపోహలు, ఫోబియాలు ఎందుకనో అర్థం కాని విషయం. పూర్వం రాక్షసులు కూడా బ్రాహ్మణుల యజ్ఞయాగాదులను అడ్డుకుని, హింసించి, ధ్వంసం చేసేవారని పాత పురాణ సినిమాల్లో చూస్తాము.
పోతే యుపిలో బ్రాహ్మణుల్లో మొన్న రేప్ చేసిన MLA ద్వివేది లాంటి కొందరు క్రిమినల్స్ కూడా వున్నారు లేండి.

/గుల్జారీ లాల్ నందా,చంద్ర శేఖర్ ,మొరార్జీ దేశాయ్,ik గుజ్రాల్ ల గురించి తెలియదు./
తెలియకపోతే తెలుసుకుని రాయి, లేకుంటే రాయొద్దు. తెలిసీతెలియని రాతలవల్ల ఎవరికీ వుపయోగం లేదు.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

కప్పిగా నీకు ప్రధాన మంత్రుల గురించే తెలియదు గాని పెద్ద పుడింగిలాగా ప్రశ్నలు వేశావు. లాల్ బహదుర్ శాస్రి, కాయస్థ. రాజకీయ నాయకుల లో పి.వి. నరసిహ్మ రావు ఎమీ తన కొరకు దాచుకున్నాడొ తన వర్గం కొరకు చేసుకొన్నాడో చెప్పండి. పి.వి. గురించి ఒకసారి కె. విజయ రామారావు, మాజి సి.బి.ఐ. డైరెక్టర్, మాజీ మంత్రి (తెలుగుదేశం ) మాట్లాడుతు ఆయన పివి మీద వచ్చిన ఆరోపణలు అన్ని అబద్దలు. ఆయన పైసా సంపాదిచుకోలేదు. ఆయన మీద పెట్టిన తప్పుడు, కక్ష సాదింపుల కేసులు.వాటిని వాదించే న్యావాదులకు ఫీజు గా డబ్బులు ఇవ్వడం కొరకు బంజారా హిల్స్ లో తన ఇల్లు ఎవరికైనా అమ్మి పెట్టమని నన్నడిగాడు. నేను ఒక మాజీ ప్రధాని డబ్బులు లేక ఇల్లు అమ్మమనడం అనే మాట విని నేను ఆశ్చర్య పోయాను. ఎమట్లాడాలో అర్థం కాలేదు అని చెప్పాడు. ఇక వాజ్ పాయ్ ,మోరర్జీ దేశాయ్ గారు ఈ దేశాన్ని దోచుకుతిన్నారని ఎవరైనా ఆరోపణలు చేశారా? అదే దేవె గౌడా, వి.పి. సింగ్ వున్నది ఎన్ని రోజులు సంపాదించింది ఎంత? ఇక రాష్ట్రానికి వస్తే మన 1980 తరువాత ఒక్కోక్కరు ఎవిధంగా కొత్త కొత్త మార్గాలలో సంపాదించారు. ఆ సిరీస్ లో చంద్ర బాబు గారి దగ్గర అంత ఉంటె నేనేంత సంపాదించాలని తరువాత వచ్చిన ముఖ్య మంత్రి ,వారి అబ్బాయి యువ నేత, కె.కె. వెంకట స్వామి, కె.సి.యార్. మొద|| సంపాదించారు. బ్రహ్మణుల ప్రధానమంత్రుల లిస్ట్ రాసిన కప్పి టొప్పి అనే బుర్ర తక్కువ వెధవ, వీరిలా మంత్రి పదవి ని అడ్డుపెట్టుకొని తిన్న బ్రహ్మణుల పేర్లు చెప్పాలి.

Rao S Lakkaraju said...

చక్కగా పరిశోధన చేసి వ్రాసిన వ్యాసం. ధన్యవాదములు. ప్రతిఫలాపేక్ష లేకుండా మనం పనులు చెయ్యల్సోస్తుంది. చదువులు చెప్పటం. చెప్పించటం. పనులు చేయటం. చేయటం నేర్పించటం లాంటివి. మా గ్రూపు లో పనిచెయ్యటానికి ఇండియా నుంచి వచ్చిన ఆయన మొదటే చెప్పాడు తనకి ఎమీతేలియదని. పని నేర్పించాము చేయించాము చేసాము.ఎందుకు? పనిపూర్తవటానికి, జీవితం ప్రశాంతంగా ఉండటానికి (అర్దరాత్రి ప్రొడక్షన్ ప్రొబ్లెంస్ తో నిద్రలేవ కుండా).

Anonymous said...

లాల్ బహదూర్ శాస్త్రి పేరులో శాస్త్రి అన్నది కాశీ విద్యా పీఠంలో ఆయన చదివిన ఒక డిగ్రీ లాంటిది.
ఆయన కాయస్థుడు. ఆయన అసలు టైటిల్ శ్రీవాస్తవ.
అమితాబ్ బచ్చన్ కూడా కాయస్థుడే. "అదుర్స్" సినిమాలో బ్రాహ్మణుడని చెప్పారు.

వి పి సింగ్ మీద కూడా ఆరోపణలు వచ్చినా ఆయన చాలా నిజాయితీపరుడు. L&T ని అంబానీలు టేక్ ఓవర్ చేయకుండా ఆపాడు.

krishna said...

బాగుంది మాష్టారు. కొన్ని నిజాలు ( మాత్రమే ) .. బాగున్నాయి. కాకపోతే కొన్ని సూటి ప్రశ్నలు.
స్వకుచ మర్ధనం తప్పు లేదు.. పక్క వారిని తిట్టేటప్పుడు వారి పేరు డైరెక్టుగా చెప్పడం బాగోదు.. లీగల్ ప్రాబ్లంస్ రాకూడదు ఎగ్సెట్రా..
కాకపోతే ఇదే పని ఒక దళితుడు చేసినప్పుడు పోనిలే స్వకుచ మర్ధనం చేసుకుంటున్నాడ్లే అని ఎందరు ఊరుకున్నారు ? అదే తప్పు మీరు చేస్తునారు..
ఇక 5% చెడ్డవారు ప్రతి వర్గంలో వుంటారు. కొత్త ప్రాజెక్టు మానేజరులా అందరూ అసలు దోషులని శిక్షిస్తే ఇలా ప్రాబ్లంస్ వుండవు.
తెలంగాణాలో గొడవ చేసే వారన్నా, దోపిడీ సమైక్యవాదులన్నా కొందరే.. టెర్రరిస్టులు కూడా ఆ 5% మాత్రమే! కానీ మనం పాత ప్రాజెక్ట్ మానేజర్లానే పని చెయ్యడం లేదు ?
పిచ్చి కవితలలో హిందు అన్న పదాన ముస్లిము అని ముస్లిము అన్న పదాన హిందు అన్నంత మాత్రాన "నాన్న గారు " చెప్పిన కవిత గొప్పది అయ్యిపోదు.. ఆకాశ బాబాది మాత్రమే పిచ్చి కవిత అవ్వదు. రెండు తప్పులే!
మొత్తానికి " కత్తి " లాంటి టపా !

Anonymous said...

బొప్పన్న

నీకున్న కులపిచ్చి ఎవరికి తెలియదన్నా? ముందు నీలాంటి, నీ ఆరాధ్య దైవం కత్తి లాంటి కులపిచ్చి గాళ్ళ సంగతి తేల్చు ముందు

Anonymous said...

వారి ఊరిలో (TamilaNadu) నీళ్ళు లేకపోయినా భారత దేశంలో గుజరాత్ తరువాత అభివృద్దిచెందిన రాష్ట్రం అని ఒక చోట చదివాను. వారికి ఉన్న వైగై,తామ్రపన్ని నదుల లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అందరికి తెలిసిందే. కావేరీ నది నీటి కొరకు కర్ణాటక తో అనునిత్యం గొడవ పడేవీరు ఒకప్పుడు తన్నీర్ తన్నీర్ అనే సినేమా తీసి వాళ్ళు నీళ్ళ కొరకు పడె కష్టాలను తెరకెక్కించు కొని పదిల పరచుకొన్నారు. ఇటువంటి వారు ఇప్పుడు ఎలా ఇంతాల అభివృద్ది సాదించారు. నీరు ఉన్న చోటే అభివ్రుద్ది, నాగరికతా ఉంట్టుందని చదువుతామే! నీరు పుష్కలం గా లేక పోయినా, వీరు చరిత్రను తిరగ రాస్తూ ఇంతలా అభివృద్ది ఎలా సాధించగలిగారు. వారిది నిజమైన అభివృదేనా? ఇతర రాష్ట్రాలు వారి అభివృద్ది మార్గం లో ప్రయాణినించవచ్చా? లేక ఈ అభివృద్ది వారికి, వారి సంస్కృతికి మాత్రమే స్వంతమా? వారి కోర్ కాంపిటెన్సిలేవి? ఈ కోణాం లో మనం ఒకసారి వారి అభివృద్ది నమూనా పరిశిలించ వలసిన అవసరం ఉంది. తమీళులలో ఉన్నది మిగతావారిలో లేని ప్రత్యేకత ఎమీటి? అనే అంశం మీద మీకు తెలిసిన మీ అనుభావలు పంచు కొంటే బాగుట్టుంది.

Anonymous said...

*కొన్ని నిజాలు ( మాత్రమే ) .. బాగున్నాయి.*

పిల్ల కాకి గారు,
నేను కప్పి టొప్పి గారు ఇన్ని రోజులు చాలా నాలేడ్జ్ ఉన్న అతను అని అనుకున్నాను. ఉదయం ప్రధాన మంత్రుల గురించి అతనికి ఉన్న జ్ణానాన్ని చూసి, ఇంతకాలం ఇటటువంటి వాడి తో నాచర్ర్చించింది అని అనుకొన్నాను. పదవ తరగతి చదివేవారికి ఉన్న సోషల్ నాలేడ్జ్ కూడా లేని అతనిని చూసి చీకాకు కలిగింది. ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది తము రాసేదాని మీద పూర్తి అవగాహన తో రాసేవారు, ఎదో ఒక పేరుతో టైంపాస్ కి ఎదో ఒక ప్రశ్న వేసే వారు, ఇంకొకడు వీడు ఎమంటాడొ చూద్దామనే వారు ఒకరు, ఎమీ తేలికూండా నోటి కొచ్చినట్ట్లు రాసే సోంబేరిగాడు, వాడికి స్మైలీ లు పెట్టె తుప్పు కత్తులు, బ్లాగులు చదవి, చర్చల ద్వారా సమాచారం తెలుసు కోవాలనుకొనే వారాంతం రాజకీయనాయకుడు లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. తమరు ఎకేటగిరి కింద కొస్తారో తెలిదు గాని నువ్వు వాడిన కొన్ని నిజాలు అనే పదం ను బట్టి చూస్తే తమరి నాలేడ్జ్ ఎంత ఉందో తెలుస్తునే ఉన్నాది. "ఇక్కడ ఎవ్వరికి కొన్ని నిజాలు చెప్పి, మిగతావి అబద్దాలతో రాయవలసిన అవసరం లేదు." మీ సలహాకి ధన్యవాదాలు. ఇక దళితుల మీద మీకైమైనా సమాచారం కావాలంటె ఆచార్య కంచా అయ్యలయ్య గారిని కలిసేది. ఉండేది ఉస్మానియా విస్వ విద్యాలయం, తెలంగాణ కొరకు ఆచర్య కోదండ రాం గారిని కలసి మీ లాజిక్ ప్రశ్నలను అడిగి సందేహాలకు తగిన సమాధానం పొందగలరు.

రాజేష్ జి said...

$SNKR గోరు

ఆహ్వానం! ఈ వ్యాసం ఆలోచింపజేసినందుకు ఆనందం.

#తెలియకపోతే తెలుసుకుని రాయి, లేకుంటే రాయొద్దు. తెలిసీతెలియని రాతలవల్ల ఎవరికీ వుపయోగం లేదు.
:)) నేనసలు ఊహించలేదు బొప్పాయ గారు అలాంటి వాఖ్య చేస్తారని! ఇక నేను "ఎవరూ పరిపాలించలేదు" అని అంది ఈ "అణచి వేసారు" అన్న కాలానికి సంబందిన్చ్చింది. ఆ కాలం అరబ్బుల దండయాత్రకు ముందుకాలం.
బొప్పయగారు, దయచేసి పైన SNKR గోరు చెప్పిన సలహాను పాటించండి.

రాజేష్ జి said...

$Rama గారు
మంచి విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

$Rao S Lakkaraju గారు
కృతజ్ఞతలు. తప్పదు మరి :)

$bonagiri గారు
మీరు చెప్పినది నిజం. ధన్యవాదాలు

రాజేష్ జి said...

$krishna
అసలు మీ వాఖ్య తప్పు. మొత్తానికి మీదీ కత్తి లాంటి కామెంటు. కత్తి కింద underline చేసుకో!

మిగిలిన చదువరులకి ఒక విన్నపం. ఈ పిల్లకాకి మాటల్లే మరెవరికైనా అభిప్రాయం ఉంటే వాటిని అడిగితే దానికి స.ధా ఇవ్వడానికి నేను సదా రెడీ!

రాజేష్ జి said...

$ అజాత అజ్నాతలు గార్లు
ఈ వ్యాసాన్నిబలపరిచి మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలియపరిచినందుకు సదా కృతజ్ఞతలు.

sooraj said...

I agree with Krishna's comment.
Its not good to brand a particular caste,religion as good or bad based on 5% people's acts. It applies to all religions,caste and creeds.

krishna said...

@ అజ్ఞాత గారు,
మన మన దృష్టిని బట్టి అర్ధ సత్యాలు అసత్యాలు కావచ్చు , సత్యాలు కావచ్చు. ఈ వ్యాసంలో ఎలా అయితే ఫలానా వర్గం లో 95 % వారంతా మంచివారే అని సర్టిఫై చేసారో అలాగే అదే ఆధారాల తో మిగిలిన వర్గాల గురించి కూడా అనుకోవచ్చు కదా! జనరలైజు ఎందుకు చెయ్యడం ?
రాజేష గారి కొత్త ప్రాజెక్టు మానేజరులా పెద్ద సముదాయాలలో దోషులని ఏరి పారెయ్యగలమా ? కష్టం , ఒక్కింత అసాధ్యం కూడా...
మరి అప్పుడు ఒక 5% ధూర్తులని బట్టీ మొత్తం వర్గాన్ని దూషిస్తున్నారే అని వాపోయేవారు అదే పని మిగిలిన వారి పై చెయ్యడం ఏ విధంగా సమర్ధనీయం ?
ఈ వర్గ ద్వేషాన్ని మొత్తం వ్యవస్థకి అపాదించడం సరి అయిన విషయమేనా ?
@ sooraj
thanks.

Kathi Mahesh Kumar said...

Please go n talk to all the people in the following link.

http://www.google.co.in/#hl=en&&sa=X&ei=nexETeKYDdHNrQff7uxO&ved=0CBsQvwUoAQ&q=brahmanism&spell=1&fp=d012d25a9ae817ba

Unknown said...

బ్రాహ్మనిజాన్ని తప్పు పట్టడం వేరు, బ్రాహ్మల్ని తప్పు పట్టడం వేరు.. ఈ తేడా చాలామందికి తెలియకపోవటం దురదృష్టకరం..!!

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

అన్న,
నన్ను ఈ బ్లాగులో ఏదో కామెంటు పెట్టినందుకు వేశ్య అన్నారు,నాకు కుల పిచ్చి అన్నారు,అసలు నాకు ఏమి తెలియదు అని తేల్చేశారు.అసలు టెన్త్ క్లాసు సోషల్ బుక్ నాలెడ్జి కూడా లేదు అని తేల్చేశారు.
సరే,నా గురించి,నా నాలెడ్జి గురించి మీ సర్టిఫికేట్ నాకు ఏమి అక్కర లేదు.నేను పెట్టిన/అడిగిన ప్రశ్నలకు ఎవరు సూటిగా సమాధానం చెప్పలేదు.

1 )బ్రాహ్మణులలో 95 % మంచి వాళ్ళు అని ఒక బ్లాంకెట్ statement ఇచ్చారు.
మరి మిగిలిన వాళ్ళు మంచి వాళ్ళు కాదా? మిగిలిన వాళ్ళు కూడా 95 % మంచి వాళ్ళు అయితే ఆ పై statement ఎందుకు?
2 ) బ్రాహ్మలు అసలు దేశాన్ని ఏల లేదు అన్నారు.నేను example names ఇచ్చాను. వాళ్ళు బ్రాహ్మణులు కాదా?
లాల్ బహుదూర్ శాస్త్రి గారు పెట్ట్తుడు శాస్త్రి అని నేనే అనుమానం వ్యక్తం చేసాను.ఇంక నాకు తెలియనిది ఏందీ.అయినా ప్రధానుల కులాల గురించి ఎ సోషల్ బుక్ లో రాస్తారు?
కొంత మంది pv గారి నిజాయితీ పరుడు,blah ,blah అన్నారు.నేనే మన్న వారి అవినీతి గురించి మాట్లాడానా?మరి ఎందుకు నాకు అవన్నీ అంట గడతారు?
3 ) నేటి బ్రాహ్మణుల పరిస్థతి,నాజీల పరిపాలనలో యూదుల వలె ఉన్నదా?అరవయ్యి లక్షల మంది యూదులు ,తిండిలేక మల మల మాడి,విషపు గదుల్లో మాడి సచ్చి పొయ్యారు.అసలు ఆ బాధలతో నేటి బ్రాహ్మణుల పరిస్థితి పోల్చవచ్చా?
4 ) యూరప్ వాళ్ళు కానీ,తురకలు కానీ,మిగతా రాజుల పరిపాలనలో కానీ రాజ దర్బారులో నౌకరీ చేసింది ఎవరు?నేటికి భారత దేశ పరిపాలన ఆంతా ఎ వర్గ బ్యూరోక్రాసి చేతిలో ఉంది?
ఆ పై నాలుగు ప్రశ్నలకి సమాధానము చెప్పి నన్ను వేశ్య,కుల పిచ్చి,నాలెడ్జి లేని వాడి గా తేల్చండి.
నేను ఏమి పై విషయాలు నా అంత నేను చెప్పానా?అది రాజేష్ గారి టపాకి reaction మాత్రమె.అయ్యా డొంక తిరుగుడు సమాధానాలు కాకుండా,yes / no లాంటివి ఎవరన్న చెప్తే మిక్కిలి ఆనంద పడతాను.

Anonymous said...

రాజేష్ అన్న,అణిచివేత కాలం లో బ్రాహ్మణా కింగ్స్ లిస్టు ఇదిగో.
http://wiki.answers.com/Q/Who_are_brahmin_kings

Kathi Mahesh Kumar said...

ఆధిపత్యవర్గానికి అలోచననూ అండనూ వారి దమనకాండలకు ఊతమిచ్చే థియరీలనూ ఇచ్చింది బ్రాహ్మణకులమే. దానికి చరిత్ర సాక్ష్యం. ఆ స్థానం మీద పట్టును ప్రస్తుతం చాలావరకూ కోల్పోయినా, వీరు కల్పించిన మూసలు మాత్రం స్థిరమై Indian management practices లాగా మిగిలున్నాయి. వాటినే అటూఇటూగా బ్రాహ్మనిజం అంటున్నాం.

రాచరికాలు పోయి ఫ్యూడలిజం వచ్చినా, అదే మోడల్లో ప్రజాస్వామ్యం మనదేశంలో అమలవుతుండటంతో కులమూస reflections ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కులాలు భావజాలాలుగా మారాయి. ఆ భావజాలాలు నమ్మేవారు మాత్రం అన్ని కులాలకూ,వ్యక్తులకూ విస్తరించాయి. I know many Dalits who are strong advocates of Brahmanism. I know many Brahmins who are dead against Brahmanism.

కాబట్టి ఇది కుల సమస్య కాదు. కులం ఆధారంగా ఏర్పడిన భావజాలం సమస్య. ఐది రాజకీయ-ఆర్థిక-సామాజిక సమస్య.

Anonymous said...

కింగ్స్ ఏందీ అన్న,కింగ్ మేకర్స్ ఆంతా బ్రాహ్మణులే. ఇప్పటికీ సమాజంలో అత్యధిక గౌరవం పొందేది బ్రాహ్మణులే,రాజుల కన్నా వారే భారతీయ సమాజంలో గౌరవించ బడతారు. ఇంక అణచివేత ఏందీ అన్న?
సరేలే, కుల వ్యవస్థని నిరసించారు కానీ,కులం లో ఉండే మనుషులని కాదు అన్న.మీకు అర్ధం చేసుకునే శక్తి ఉన్నదని నాకు తెలుసు.

Anonymous said...

http://www.google.com/images?hl=en&q=holocaust&rlz=1R2SKPB_enUS383&wrapid=tlif129636894253410&um=1&ie=UTF-8&source=og&sa=N&tab=wi&biw=1596&bih=723

ఆ పై లింక్ ఒకసారి చూడండి.దాన్ని,నేటి బ్రాహ్మణుల పరిస్థితి కంపర్ చెయ్యవచ్చ?

Anonymous said...

*యూరప్ వాళ్ళు కానీ,తురకలు కానీ,మిగతా రాజుల పరిపాలనలో కానీ రాజ దర్బారులో నౌకరీ చేసింది ఎవరు?నేటికి భారత దేశ పరిపాలన ఆంతా ఎ వర్గ బ్యూరోక్రాసి చేతిలో ఉంది?
ఆ పై నాలుగు ప్రశ్నలకి సమాధానము చెప్పి నన్ను వేశ్య,కుల పిచ్చి,నాలెడ్జి లేని వాడి గా తేల్చండి*

ఎవరినైనా ప్రశ్నలడిగే ముందు వారి గురించి చెప్పు కొని, పరిచయం చేసుకొని అడుగుతారు. అది సభల లో నైనా లేక కంపేనిలో జరిగే టౌన్ హాల్ మీటింగ్ లో నైనా అందరు ఆ పద్దతి పాటిస్తారు. తమరి గురించి పైన అడిగితే ఇప్పటివరకు దాని మీద సమాధానం లేదు. ఇదే విషయం ఈ కెండ్ పోలిటిషియన్ కూడా అడగటం జరిగింది. దానికి ఆయన సమాధానాలు ఈ బ్లాగులో ఉన్నాయి. ఆయన తరువాత అందరికి చెప్తాడంట. కొంతకాలం క్రితం మీరు అడిగిన పై ప్రశ్నమీద ఒక బ్లాగులో చర్చించారు. కనుక మా మీద దయ ఉంచి మీరే ఆ నాలుగు ప్రశ్నల మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియ జేసేది. మీరొక టపా రాయ్యొచ్చుగా.
------------------------------------------------
ఇంకొక విషయం గమనించాలి కొంతమంది పిత్తురు సోంబేరి గారిలాంటి వారికి ఇటువంటి విషయాలపై తెలుసు కోవటం, రాయటం వలన వారి వర్గం లో మేధవులు గా గుర్తింపు వస్తుంది. అటువంటి పేరు తెచ్చుకొని ఒక్కోకరు ఒక్కొక్క విధంగా లాభపడతారు. అది వారి వ్యాపారం. ఎంత చెత్త రాస్తే అంత గొప్ప హీరొ. కాని ఇక్కడ రాసే వారికి హీరోలు గా అవతరిద్దమని ఉద్దేసం లేదు. వ్యాపారం కాదు, దీనిని దృష్టిలో ఉంచుకొని మీరు భాద్యత గా ప్రశ్నలడగాలి. ముందర మీ గురించి చెప్పుకొని, మీరడిగిన ప్రశ్నలకు మీరే ఒక టపా రాయండి. అది వీలుకాక పోతే ఎలాగూ మీకు గూగుల్ ఉంది. దానిలోనే వెతుకొంటె మీరడిగిన ప్రశ్నలకు, మీకు సమాధానాలు దొరుకుతాయి.

Anonymous said...

>>> కింగ్ మేకర్స్ ఆంతా బ్రాహ్మణులే. ఇప్పటికీ సమాజంలో అత్యధిక గౌరవం పొందేది బ్రాహ్మణులే,రాజుల కన్నా వారే భారతీయ సమాజంలో గౌరవించ బడతారు. >>>
ఆ పైన దళిత కులగజ్జి నాస్థిక యదవ ఏడుపులు చూశావా? అవేంటంటావ్? బుద్ధున్నోడు భూమేలుతాడు, కాకుంటే పెంట ఎత్తుకుని పందులుతింటాడు. మాయావతి, లల్లూ, ములాయం, జగ్జీవన్ రాం, అంజయ్య, దేవగౌడ అందలాలు ఎక్కలేదా? వాళ్ళెనక ఏ బ్రాహ్మణ కింగు మేకర్లున్నారు? పూర్వం వుండేవారేమో. పూర్వం అనాగరికంగా అణిచివేతలు అన్ని దేశాల్లో వుండేవి, కొన్ని ఆఫ్రికా, కమ్యూనిస్ట్ దేశాల్లో ఇప్పటికీ వున్నాయి. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అని నీతులు వల్లించే వలసవాదులైన బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్, డచ్ వాళ్ళూ అణిచివేతలకు పాల్పడ్డారు. మరి వారి వెనక ఎవరుండేవారు? మీ కులగజ్జి కుతి తీర్చుకోవడం కోసం ఏదో కత్తి గాడిలా వాగుతుంటారు. కులం అడ్డుపెట్టుకుని, తరాలుగా ఫ్రీ గడ్డి కి అలవాటు పడిన వాళ్ళకు ఇలాంటి విషయాలు మాట్లాడే నైతిక హక్కులేదు.

Anonymous said...

orey agnataa,
sare srinivasarao.manchi@gmail.com ku oka mail raayi naa anni vishayaalu cheptaanu. nuvve agnaata,mallee nannu inspect chestunnavuraa sannasi..thhoo..nee bathuku seda...

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు
#..తమరు ఎకేటగిరి కింద కొస్తారో తెలిదు గాని..
He will come under the category "ఎదో ఒక పేరుతో టైంపాస్ కి ఎదో ఒక ప్రశ్న వేసే వారు" and should be more. Nothing more than derivation of popularity and vicious exploitation. We dont need to care him unless we want to have some fun :)

Anonymous said...

raajesh anna,
nanne tittaavaa?

రాజేష్ జి said...

$సత్యప్రసాద్ అరిపిరాల గారు
#..ఈ తేడా చాలామందికి తెలియకపోవటం దురదృష్టకరం..!
ఆ తేడా ఏమిటో, దాని వల్ల ఉపయోగం ఏమిటో నేను చెప్పా! మీరు టపా పూర్తిగా చదవకుండా కామేన్టడం నా దురదృష్టకరం.

Anonymous said...

ఇదేంది అప్పిగాడు నా మైల్ నాకే ఇచ్చి నన్ను మైల్ చేయమంటాడు. రొంబా మోసమప్పా!
అప్పిగా నిన్ను ఒక టపా రాయమంటే దానికి గతి లేదు. నీ దగ్గర సరకు లేదు. పోని నీ వర్గం మీద నువ్వు రాసుకొ ఎవరు వచ్చి నిన్ను ఆపుతారు. ఊరికినే అరేయ్ ఒరేయ్ అని వాగ కుండా వాయ్ ముడు. NTR,Candra baabu, Y. S., Rosayya, MGR, Karuna Nidhi, Jayalaita వీళ్లందరిని మేమా సి.యం. లు గా చేసింది. చరిత్ర జ్ణానం లేని బుర్ర తక్కువ వెధవ.

రాజేష్ జి said...

$అప్పి బొప్పి గారు

#మరి మిగిలిన వాళ్ళు మంచి వాళ్ళు కాదా? మిగిలిన వాళ్ళు కూడా 95 % మంచి వాళ్ళు అయితే ఆ పై statement ఎందుకు?

మళ్ళీ చెబుతున్నాను ఇక్కడి సందర్బం చూసి మాట్లాడమని! ఈ వ్యాసం చర్చించింది అకారణ/లేదా స్వార్థ ద్వేష భావజాలానికి గురవుతున్న బ్రాహ్మణ వర్గం గురించి. మిగిలిన కులాల మంచి చెడ్డల భేరీజు ప్రసక్తి లేదు ఇక్కడ. ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు అందులో మంచి చెడ్డలు చూస్తారు. ఈ టపాలో జరిగింది అదే!
అంతేకానీ, ఇదేమీ రాజుగారి పేద్ద భార్య.. అన్న సామెత మీద రంద్రాన్వేషణ కాదు.
ఇంతవరకూ పుంఖాలు పుంఖాలుగా బ్రాహ్మలు ఆ చెడు చేసారు.. నీచాలకు పాల్పడ్డారు అన్నదాంట్లో నిజమెంత అన్నది ఈ టపా చర్చించింది.
ఇక ఇచ్చిన 95% మంది మంచి అనేది బ్లాంకెట్ statement అనే ముందు టపాలో ఇచ్చిన లేదా చర్చించిన కారణాలు చదవమని మనవి.

#..బ్రాహ్మలు అసలు దేశాన్ని ఏల లేదు అన్నారు..
మల్లీ చెబుతున్నా, ఏలలేదు అన్నది "అణచి వేత" కాలానికి సంబంధించి. ఇక ఈ టపాలో దీన్ని ఉదహరించినది నాటి ప్రతి అకృత్యం వెనుక బ్రాహ్మణులు ఉన్నారని చెబుతూ తమ తప్పులకి మసి పూసి మారేడు కాయ చేసే వైనాన్ని! ఏ సమాజం నేర్పించింది ఈ దుర్నీతి సిద్దాంతం? నా తరానికి ఈ తలంటు వద్దు.

#..నేటి బ్రాహ్మణుల పరిస్థతి,నాజీల పరిపాలనలో యూదుల వలె ఉన్నదా..
ఉందా లేదా అన్నది బాధలు పడ్డవారు చెప్పాలి. ఆ చెప్పిన వైనం ఏమిటో మరో టపాలో వివరిస్తా! ఇక మీరన్నట్టు అలానే చస్తేనే యూదులతో పోలిక అంటే ఎట్లా? పైన టపాలో బ్రాహ్మణుల పై జరిగిన అమానుష చర్యలకి, హత్యలు గురించి యూదులు రాసుకున్నట్లు బ్రాహ్మలు రాసుకోలేకపోయారు, అంతే తేడా!.

ఇక మీరిచ్చిన గొలుసులో చిత్రాలు కొన్ని సిన్మాటిక్వి కూడా.

# యూరప్ వాళ్ళు కానీ,తురకలు కానీ,మిగతా రాజుల పరిపాలనలో కానీ రాజ దర్బారులో నౌకరీ చేసింది ఎవరు?నేటికి భారత దేశ పరిపాలన ఆంతా ఎ వర్గ బ్యూరోక్రాసి చేతిలో ఉంది?

మీరు ఉన్నారు, చేసారు అనే బ్లాంకెట్ statement ఇచ్చారు. నేను వారు ఎవరో, ఎంత మంది తోటి హిందువులని చంపారో చెప్పమని అడిగా? దానికి మీ దగ్గరి స.ధా తిరిగి పై బ్లాంకెట్ statement. నేటి "బ్యూరోక్రాసి" అన్నది డబ్బున్నవారి చేతిలో ఉంది, దానికి కులానికి సంబంధం లేదు. ఇక ఇప్పుడు మీరు డబ్బున్నవాల్లన్దారూ బ్రాహ్మలే అంటారా?

Kathi Mahesh Kumar said...
This comment has been removed by the author.
Anonymous said...

*ఇస్లాం,కైస్తవ ధండ యాత్ర వీరి పాత్రకు పాతర వేసింది. స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా కాక పోయినా సెక్రెట్సీల రూపంలో వీరు అధికారం చలాయిస్తూనే ఉన్నారు.*
సిత్తుర్రు సిరుత వాగుడు మరియ వారి జ్ణానం పైన రాసినది చదివితే అర్థముతుంది. ఓరేయ్ నెల తక్కువ వెధవా ఎక్కడైనా ఆఫీసులో కాని, ఉద్యోగం లో కాని సెక్రెట్సీల, రిసెప్షనీస్ట్ లు ప్రముఖ పాత్ర పోషించరురా ముఠాల్ మురుగా. అధికారం లో ఉన్న వారు చెప్పినది చేస్తారని తెలియని కుంకా! నువ్వు రాసే ఇస్లాం,కైస్తవ ధండ యాత్ర వీరి పాత్రకు పాతర వేసింది ఇంక మేము నిన్ను తొక్కింది ఎందిర ఎర్రి వోడా.

*కాని వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వారి మాటలు చేతలు వాటి వెనుక ఉన్న కుట్రలను పసి కట్టే మెళకువను పెంపొందించుకోవాలి.*
మీ నాయకులు మీకు నేర్పించిన వొంట బట్టించిన సూత్రం బాగా చెప్పావు. నీ బోటి పి పి గాళ్ళను మా మిద ఎగదోసి మీ తలైవర్ గారు మూడు పెళ్ళిళు అనధికార ఉంపుడు గత్తెలతో కులుకుతు కావలసినపుడల్లా దేశ ఖజానాకి కన్నం వేసి 1,70,000 కోట్లు ఎత్తెకొని పోతుంటె వారిని వదిలేసి నువ్వు తమీళనాట రూ 500 జీతం గల వారిని కంట కనిపెడుతూ ఉండాలి,వారి మాటలు చేతలు వాటి వెనుక ఉన్న కుట్రలను పసి కట్టే మెళకువను పెంపొందించుకోవాలి అని రాస్తున్నవు. ఎవరు బాబయ్యా నీ దగ్గర జాతకం చూపించుకోవటానికి వచ్చేవారు. వాళ్ళ తో కూడా ఇలాగె చెపితె పక్క రోజునుండి నీ దగ్గర కి రావటం మానుకొంటారు. జాగ్రత్త సుమి!

రాజేష్ జి said...

@Ajnaata
:)). That was stinky sambaar ganished with self-pity, unability(to revive) and somesort of shit from bull.

Anonymous said...

కత్తి గారు, ఇక్కడ నేను అజ్ఞాతగా రాసిన నిన్ను గాని, అప్పి ని గాని వ్యక్తిగతం గా దూషించలేదు. ఆ మిగిలిన అజ్ఞాతలకు అప్పి ని వేశ్య తో పోల్చటం బాగలేదు. తరాలుగా ఫ్రీ గడ్డి కి అలవాటు పడిన వాళ్ళకు ఇలాంటి విషయాలు మాట్లాడే నైతిక హక్కులేదు, ఇలా రాయటం కూడా నేను ఖండిస్తున్నాను. అసలికి భరత దేశం వరకు చూస్తే డబ్బులు ఒక విషయమే కాదు మన దగ్గర ఎంతో డబ్బులు పడి ఉన్నాయి. దానిని అర్హులైన అందరు ఊరకనే తిన్నా తప్పు లేదు. నా ఆందోళన అంతా పై వాళ్ళు కోట్లు భోజనం చేస్తూ ఉంటె కింద ప్రజలకి కులం పేరు తో తగవులు పెట్టి మెల్లగా అన్ని పార్టిల ఎకమై వారు డబ్బులతో డాయిస్తున్నారు. ఐన దానికి కాని దానికి గత టపాలను మనసులో ఉంచుకొని కత్తి ని పదే పదే విమర్శించటం బాగా లేదు. అది మంచి పద్దతి కాదు. ప్రతి మనిషి లోను అవగాహన అనేది రోజు రోజుకు పెరుగుతుంది. మార్పులు వస్తూంటాయి కాని మన దోచుకునే వారిని వదిలేసి చట్టబద్దంగా వారు పొందుతున్న వాటి పై నోరుపారేసుకోవటం బాగా లేదు. మనం 1965-1985 మధ్య జీవించటం లేదు. ఆరోజులలో చదువు కోవటానికి కుటుంబ లో అధిక జనాభావలన చాలా ఇబ్బందులు పడవలసివచ్చేది. పరిస్థితులు మారాయి. ఈ రోజూలో అందరికి ఒకరిద్దరు పిల్ల లు. ఈ రోజులలో ఎవరైనా ఇతరులకు సహాయం చేయాలి అనుకొంటె సహాయం చేయగలరు. కాని మన మనసులు విశాలం కావలసిన రోజూలో ఇరుకు అవుతున్నాయి. దానికి ప్రధాణ కారణం అవినీతి. కొంతమంది సంపాదన గురించి వింటె మనదగ్గర ఎమీ లేదనే భావన వస్తున్నాది. కాని అది పోలిక తో వచ్చినది. ప్రయత్నం తో ఆ భావన నుంచి బయట పడాలి. రేండు పోటి ఇది మనుషులను, ప్రపంచాన్ని అర్థం చేసుకోకుండా చేసుతున్నాది. ఇంత సేపటికి మనం చదివేది కొత్త టెక్నాలజి పుస్తకాలు. కనుక మనమింకా పాత రోజుల లో జీవిస్తూ ఉంటాం. రిసర్వేషన్ వలన మనకేదో నష్టం జరుగుతున్నాది అని. రిసర్వేషన్ వలన ఇన్ని అవకాశాలు ఉన్న ఈ రోజులలో ఆందోళణ చెందవలసిన అవసరమే లేదు. ఎవరి అవకాశలు వారికి ఉన్నాయి. ఒక్కటె మన దేశం అవినితిని కట్టడిచేయగలిగితే ఈ శతాబ్దం మనదే.

Anonymous said...

1947 ముందు తమ కష్టానికి తగిన ప్రతిఫలం పొందేవారు, ఎంగిలికూటికి ఆశించేవారు కాదు.

Anonymous said...

I am Anonymous, non-SC non-మాదిగ, soldier living in North India. I don't give my info to every bugger on net. I am Indian but not taken citizenship of the globe. I don't challenge filthy animals and their associates. I offer what you relish, the shit.

రాజేష్ జి said...

@Anonymous gaaru

Agreed what you said with no hesitation.

# I don't challenge filthy animals and their associates. I offer what you relish, the shit.

Yep, I too have zero-tolerance towards such pricks :)

రాజేష్ జి said...

సాధారణంగా ఏదైనా చర్చ జర్గుతున్నప్పుడు అసలు విషయాన్ని పాతరేయడానికి సదా ఉండే కేతిగాళ్ళు ఎక్కడ మసాలా విషయం దొరుకుద్దా అని గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కుత్సితమైన వాటిలి ఒకటి ఒక అజ్ఞాత గారు పెట్టిన కింద కామెంటుని అదేదో అనరాని మాట అన్నట్లుగా చిత్రీకరించడం.

"
మీ కులగజ్జి కుతి తీర్చుకోవడం కోసం ఏదో కత్తి గాడిలా వాగుతుంటారు.కులం అడ్డుపెట్టుకుని, తరాలుగా ఫ్రీ గడ్డి కి అలవాటు పడిన వాళ్ళకు ఇలాంటి విషయాలు మాట్లాడే నైతిక హక్కులేదు.
"
కానీ ఇందులో వాస్తవ౦ లేదా?

నిజానికి అజ్ఞాత గారు పై వాఖ్య అప్పిబొప్పి అనబడే శ్రీనివాస శాస్త్రి గారు చేసిన కొన్ని అసందర్బ వ్యాఖ్యలకి సంబందించినది. ప్రస్తుత సామాజిక పరిస్థితుల మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఆయన చేసిన కొన్ని వ్యాఖలకి సహజం గానే కోపం వస్తుంది. ఈ టపా బ్రాహ్మణుల వెతల గురించి కాబట్టి వాటికి వ్యతిరకంగా చేసిన
అప్పి బొప్పిగారి వ్యాఖ్యలు అంతే సహజంగా ఈయన కులమేదో? ఇక్కడ మాట్లాడుతున్న కులానికి వ్యతిరేకి అన్న భావన వస్తుంది. నాకు తెలిసి అజ్ఞాత గారు ఇదే భావనతో వాఖ్య పెట్టారు, ఎందుకంటే అజ్ఞాత గారికి తెలీదు "కూర్చున్న కొమ్మని నరుక్కునే వారు " ఇక్కడ ఎక్కువమంది అని .

అది పక్కన బెడితే,

మధు కోడా, శిబుసోరెన్ నుంచి లేటెస్ట్ రాజా వరకు తామ చేసిన అక్రమాలను౦డి తప్పించుకునేందుకు స్వార్థ౦తో కులం కార్డు ఉపయోగిన్సుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. తప్పు చేసినప్పుడల్లా నాది తక్కువ కులం అని అందుకే నామీద కేసులు బనాయించారు అని. ఏ రాజ్యాంగం ఇచ్చింది ఈ "ప్రత్యెక" హక్కుని. దళిత-బ్రాహ్మణ కార్డు మీద పాలన సాగిస్తున్న మాయవతి ప్రభుత్వం పైన SNKR గారు చెప్పిన ద్వివేదిని కలుపుకుని మొత్తం ముగ్గురు బ్రాహ్మణ MLA లని అరెస్టు చేయించింది. అవి ఇంకా నేరారోపణలు మాత్రమె! మరిక్కడ వారు కూడా కులం కార్డు తీసారా? పోనీ వారు తప్పించుకోవడం అటుంచి, మాది అగ్రకులం అందుకే ఈ ప్రభుత్వం కావాలని చేస్తుంది అంటే ఎవరైనా వారు అంటే అందులో వాస్తవమెంత అని ఆలోచిస్తారా ? ఈ విధంగా కులం కార్డు ఉపయోన్గ్చే రా.కీ లు మన ఆంధ్రాల్లో కూడా ఎక్కువే!

ఇక చివరగా వ్యాఖ్యలో ఉద్దేశించిన

ఫలానా కత్తి గారు హిందూ ధర్మలోని కొన్ని అణగారిన వర్గాలని పైకి తేవడానికి ప్రవేశపెట్టిన ఉచిత ఫలాలని చక్కగా భోంచేసి తీరిగ్గా అదే మతాన్ని కుత్సిత భావతో నీచ పదజలంతో దూషిస్తూ ఉంటారు. అసలా మతమే వద్దు అనుకున్నప్పుడు ఇక ఆ మత౦లో మాత్రమె ఉందనుకునే కులం మటుకు ఎందుకు? ఆ కులం మాటున వచ్చ్చే ఉచితఫలాలు ఎందుకు? ఇది కులాన్ని వాడుకోవడం కాదా?
నేటి దళితనేతలు మందకృష మాదిగ గారు, జూపూడి గారు గానీ ఏ రోజైనా హిందూ ధర్మం మీద అవాకులు చవాకులు పేలిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? మందకృష గారు ఎప్పుడు వివేకానందుల వారు చేసిన కృషి గురించి మాట్లాడుతూ ఉంటారు.
వారు తమ వర్గాల అభ్యున్నతి కోసం ఆహార్హాలు కష్టపడుతుంటే పైన ఉండి ఫలాలు భోన్చేసిన సదరు కత్తి (గారు?) వారు సాధించిన దాన్ని వాడుకుంటున్నాడు. ఇక ఇతన్ని ఏదో అంటే అతన్ని వర్గాన్ని అన్నట్టు ఏమాత్రం కాదు. నిజానికి ఇలాంటివారి స్వార్థపు చేష్టల వల్లే కష్టపడే దళిత నేతలుకు చెడ్డపేరు తీసుకువస్తాయి. అసలు అణగారిన వాళ్లు అలానే ఉండి పోతున్నారు.

Kathi Mahesh Kumar said...

@రాజేష్ జి: Thank you for proving my point. నీలాంటోళ్ళు ఉన్నంతవరకూ ఇది కొనసాగుతూనే ఉంటుంది. Be ready for it.

Kathi Mahesh Kumar said...
This comment has been removed by the author.
రాజేష్ జి said...

$Kathi Mahesh Kumar
# ..I will take your pants down in front..
Stop that insane and illicit threats! Everybody here knows what your capability is!. Actullay, know I am getting lots of laugh while reading such kinky comments. Get a life sir. GO HELL!

రాజేష్ జి said...

$Kathi Mahesh Kumar
# ..Thank you for proving my point..
O Yeah, sure. I am always here to prove your insane bashing is wrong and with that you are not going to achieve any GOOD rather bunch of page hits or mob of like-minded people.

BTW, Dont push all thanks. Keep a few, as you may need those to greet me in furtherly!

ఇందాకటి నా పైవాఖ్య అనగా కులాన్ని కుత్సిత మైన వాటికోసం ఉపయోగించుకోడం అన్న దాని మీద మరి కొంత!

అణగారినవర్గాలకి అండగా ఉండడం కోసం ఏర్పాటైనది SC/ST atrocity act. ఇది వారికి రామబాణంలాంటిది, అంత శక్తివంతమైనది అన్నమాట!. అయితే కొందరివల్ల ఇలాంటి చట్టాలు దుర్వినియోగం కావటం మనం సదా చూస్తుంటాము. ఇలా జరిగినప్పుడు అలా దుర్వినియోగ పరిచినవారు దాని విలువ తెలియనివారు అయితే సరే, అది సహజం అనుకోవచ్చు! వారిని సరిదిద్దడానికి ప్రయత్నించవచ్చు!

మరి అలాంటిది అన్నీ తెలిసిన స్వ.ప్ర. మేథావులు ఈ చట్టాన్ని తమ స్వార్థానికి ఉపయిగించుకుని దాన్ని హాస్యాస్పదం చేస్తే?

బ్లాగుల్లో జరిగే చిన్న చిన్న గొడవలకి మేధతో గెలవవలేక, వాస్తవాలని తట్టుకోలేక లేకిగా మాట్లాడి మాటకిమాట అనిపించుకుని దానికి ప్రతిగా చట్టాన్ని ఉపయోగిస్తా అనే బెదిరింపులు, ఏదో ఆ చట్టం తన చుట్టం అయినట్టు! దీని వల్ల ఆ చట్టం నలుగురిలో అవహేలన కావడం, అది నిజంగా అవసరమైనవారికి అందకుండా పోయే స్థితి ఏర్పడుతుంది.



$..నీలాంటోళ్ళు ఉన్నంతవరకూ ఇది కొనసాగుతూనే ఉంటుంది ..
Same statement verbatim from my side. But "ఇది " would be different. cheer up!

Kathi Mahesh Kumar said...
This comment has been removed by the author.
Anonymous said...

రాజేష్, నేను ఇప్పుడే కొత్త వ్యఖ్యలు చూసాను. ఇక్కడ రాసిన కొన్ని వ్యఖ్యలు ఏవిధం గా చూసినా అవి నువ్వు రాసిన దానికి విలువను చేకూర్చటం లేదు. కనుక తోలగిస్తె బాగుట్టుంది. ఇంతకు ముందు చెప్పినట్టుగా మహేష్ ని ఐన దానికి కాని దానికి వ్యతిరేకించటం బాగా లేదు. అసలికి ఆయన వలన ఎవరికి జరిగిన నష్టం ఎమీ లేదు. ఆయాన భావాలు ఆయన చెప్పాడు. అది నిన్ను బాధించి ఉండవచ్చు. అలాగే నువ్వు రాసిన కొన్ని భావాలు అతనిని కూడా బాధకు గురిచేసి ఉండవచ్చు. కాని ఈ టపా ఉద్దేశం గొడవ పడటం కాదని గుర్తుంచుకోవాలి. అందువలన నే నేను ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు రాశాను. దయచేసి ఇక్కడ ఉన్న వ్యక్తిగత వ్యాఖ్యలు తొలగించు. అలా తొలగించడం వలన ఇక్కడ రాసిన వ్యాసానికి మంచి గుర్తింపు వస్తుంది. ఈ విధంగా వ్యక్తిగత దూషణ చేసుకోవటానికి నువ్వు టపా రాయవలసిన అవసరం లేదు.

Anonymous said...

Why there are no reservations in military? though food is free, we have to fight for country. No one asked for reservations there.

Anonymous said...

అసలైన పేద,వెనకబడిన వర్గాలకు చెందాల్సిన రాయితీలను తింటూ ఒళ్ళు అడ్డంగా పెంచి, తిన్నది అరక్క అంతర్జాలంలో అడ్డమైన చెత్త రాసేటోళ్ళకి రిజర్వేషన్లు తొలగించి, నిజమైన కష్టపడే అర్హులకు మాత్రమే ఇవ్వాల.

Anonymous said...

@Anon you mean creamy layer should kept away from such benefits meant for the poor backward communities? Good point. Yes, it is necessary to remove the creamy(fatty)weed to save the weaker plants.

రాజేష్ జి said...

$Anon ji
#అసలైన పేద,వెనకబడిన వర్గాలకు చెందాల్సిన రాయితీలను ..నిజమైన కష్టపడే అర్హులకు మాత్రమే ఇవ్వాల..

Well said.

That's a perfect and worthy statement! Uneligible/(Self)Exploit one's should never been considered as representatives of whole community they belongs to.

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

మీరు ఎవరు, ఎంత కాలంగా బ్లాగుల్లో ఉన్నారు అనేది నాకు తెలీదు. నేను "ఎంతకాలం" అన్నది కేవలం మీకు ఇక్కడ ఎవరెలాటివారు, వారి మాటల వెనక పరమార్దం(మంచి/చెడు) తెలియడానికి. అయినా మీ ప్రశ్న చదివే అందరి ప్రశ్న అనుకుని స.ధా ఇస్తున్నా!

మీకు జవాబిచ్చే ముందుగా ఒకటి: అతి మంచితనం చేతకానితనానికి వేసే అందమైన ముసుగు. అది తర్వాత్వర్వాత మూర్ఖత్వానికి దారి తీసి పతనానికి శ్రీకారం చుడుతుంది. ఇప్పుడు జరుగుతుంది, నే టపాలో చర్చించింది, ఇక వద్దు ఇది అన్నది ఆ "అతి మంచితనం" నే!

#ఇక్కడ రాసిన కొన్ని వ్యఖ్యలు ఏవిధం గా చూసినా అవి నువ్వు రాసిన దానికి విలువను చేకూర్చటం లేదు. కనుక తోలగిస్తె బాగుట్టుంది.

మీరన్న ప్రాతిపదికన తొలగిస్తే ఈ టపాలో రెండు, మూడు వాఖ్యలే మిగులుతాయి. ఒకప్పుడు విమర్శ అంటే వ్యక్తిగత కక్ష్యలు, వ్యక్తిగత "అతి" భావజాలం పక్కనబెట్టి రాసిన దాంట్లో వాస్తవమెంత ఉంది. అసలు టపా ఏమి చెబుతుంది అనే దానిమీద మాత్రమే ఫోకస్ ఉండేది. దానికి తగ్గట్టుగానే ప్రతివిమర్శ ఉండేది. మరి ఈ లెక్కన చూస్తే మొదటి వ్యాఖ్య అసలు విమర్శ అవుతుందా? సందర్బంలేదు, పోనీ విషయం ఉందా అంటే అదీ నాస్తి! కేవలం అతని భావన, మంకుపట్టు "బ్రాహ్మలదే తప్పు" అని. టపాలో ఆ అపవాదుల్లో ఎంత నిజం ఉన్నది అనడం కంటే, బ్రాహ్మలు పడ్డ కష్టాలు, ఇప్పుడు పడుతున్న వెతలు గురించి చెప్పింది. ఇది మారాలి, మా తరానికి ఒద్దీ తలంటు అని, అంతే!. ఏ వర్గాన్ని కించపరచలేదు, వెతలకి బాధ్యులుగా చిత్రీకరించలేదు. అలాగే చేసిన తప్పు ఏవైనా ఉంటే తప్పించుకునే ప్రయత్నమూ చేయలేదు.
మరి గాల్లో ఉమ్మిఊస్తే ఏమవుతుందో అలాంటి వ్యాఖ్యలు రాస్తే కూడా అదే అవుతుంది. అదే జరిగింది, కానీ లిమిట్ దాటలేదు. అది దాటినప్పుడు మీరన్నది పాటిస్తా!

#ఇంతకు ముందు చెప్పినట్టుగా మహేష్ ని ఐన దానికి కాని దానికి వ్యతిరేకించటం బాగా లేదు.
ఐన దానికి కాని దానికి వ్యతిరేకించటం చేసెది సదరు మహేష్ గారే! అందుకు ఒక చిన్న ఉదాహరణ , ఒక బ్లాగర్ ఇస్లాం/క్రిస్టియానిటీ మంచి చెడ్డలు చెబుతుంటే హిందూ ధర్మ౦లో ఉన్న చెడుచెప్పండి, అది ఎంత హీనమైనదో చెప్పండి అని అడగడం. ఇదేమి కుత్సుకత?

ఒక చిన్న ఈక్వషన్:

వ్యక్తి<కుటుంబం<సమాజం< జాతి ధర్మ౦ < దేశ ధర్మం ( అనగా ఒక వ్యక్తి మిగిలిన వాటిముందు ఎప్పడూ చిన్నవాడు)

అకారణ౦గా/స్వార్థం కోసం సమాజ౦ లేదా దేశ/జాతి ధర్మాన్ని తూలనాడేవారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే వచ్చే ముప్పేమీ లేదు. నిజానికి నేడు వ్యక్తి అందలం ఎక్కాడు, మిగిలినవి చిన్నవి అయ్యాయి. నన్ను/నా వాళ్ళను అంటే వచ్చే బాధ నా ధర్మాన్ని/దేశాన్ని అంటే రావట్లేదు, హతవిధి!

#అసలికి ఆయన వలన ఎవరికి జరిగిన నష్టం ఎమీ లేదు.
పైన చెప్పిన మాటలు చదవండి. ఎక్కడ నష్టం జరిగిందో తెలుస్తుంది.

#ఆయాన భావాలు ఆయన చెప్పాడు. అది నిన్ను బాధించి ఉండవచ్చు. అలాగే నువ్వు రాసిన కొన్ని భావాలు అతనిని కూడా బాధకు గురిచేసి ఉండవచ్చు.
నిజానికి ఆయన ఇక్కడ రాసిన వ్యాఖ్యలు ఒక్క బ్రాహ్మనిసం తప్ప మిగిలినవి నేను కోరుకునేవే! ఈ వాఖ్యాల పట్ల నాకు కించిత్ బాధ లేదు. అలాగే నే రాసిన భావాలు ఆయన్ని ఎక్కడ బాధ గురిచేసాయో ఆయన వివరిస్తే బావుటుంది.

#కాని ఈ టపా ఉద్దేశం గొడవ పడటం కాదని గుర్తుంచుకోవాలి.
అలానే ఇదేమీ ఒంటె, గాడిద అభినందనల సభ కాదని మీరూ గుర్తుంచుకోమని మనవి. పైన చెప్పినట్లు చర్చ అన్న తర్వాత మాటల బాణాలు కూడా ఉంటాయి. వ్యాఖ్యలు రాసేవారు పొగడబల్లేదు, కానీ తాము రాసే వ్యాఖ్యలనిబట్టే ఇతరుల నుంచి అదే స.ధా వస్తుంది.

#దయచేసి ఇక్కడ ఉన్న వ్యక్తిగత వ్యాఖ్యలు తొలగించు.
పైన దీనికి స.ధా చెప్పా! అది మీకు సంతృప్తికరంగా ఉంటు౦దని భావిస్తా!

#అలా తొలగించడం వలన ఇక్కడ రాసిన వ్యాసానికి మంచి గుర్తింపు వస్తుంది.
నాకా "అతి" లు వద్దండీ బాబు.

#ఈ విధంగా వ్యక్తిగత దూషణ చేసుకోవటానికి నువ్వు టపా రాయవలసిన అవసరం లేదు.
మీరు అన్న "వ్యక్తిగత దూషణ" కి నే మరో వ్యాఖ్యలో దాని బలపరుస్తూ స.ధా ఇచ్చా! ఇందాక చెప్పినట్లు ఈక్వషన్ చూడండి! అప్పుడు నిర్ణయిద్దాం మీరు అన్నది :)

Bhãskar Rãmarãju said...

కుమ్మావుగా...

నాయాల్ది, నోళ్ళు మూయించావ్. అభినందనలు అందుకో

Anonymous said...

బాగా చెప్పారు, నాకు నచ్చింది. లోపాలులేని వ్యవస్థ ఏది? ఎక్కడుంది? అర్థం చేసుకునే బుర్ర వుంటే, కాలానుగుణంగా కొద్ది లోపాలు వున్నట్టు అనిపించినా మన వ్యవస్థ, వర్ణాశ్రమ ధర్మాలతో సహా, లేటుగా వచ్చిన ఎన్నో ధర్మాలకన్నా మెరుగైనది, ఆ లోపాలు కూడా కాలక్రమాన కొంత మంది ప్రాంతీయంగా, వ్యక్తిగతంగా అనుసరించిన పద్ధతులే తప్ప, ధర్మానిది కాదు అనుకుంటా. మీ పోస్ట్ టైటిల్ నాకు నచ్చలేదు, మీరు అలా అనుకోవడమే సరి కాదు. మూర్ఖులు మాత్రమే ఏదైనా సామాజిక వర్గాన్ని ద్వేషిస్తారు, జ్ఞానులు అజ్ఞానాన్ని మాత్రం నిరసిస్తారు, అది తేడా. :)

Rao S Lakkaraju said...

@snkr
మూర్ఖులు మాత్రమే ఏదైనా సామాజిక వర్గాన్ని ద్వేషిస్తారు, జ్ఞానులు అజ్ఞానాన్ని మాత్రం నిరసిస్తారు, అది తేడా.
----------
That is just great. You just made my day.

Krishna K said...

మూర్ఖులు మాత్రమే ఏదైనా సామాజిక వర్గాన్ని ద్వేషిస్తారు, జ్ఞానులు అజ్ఞానాన్ని మాత్రం నిరసిస్తారు, అది తేడా. :)
------
Very well said. This summarizes all.

ద్వేషించబడని కులమూ అంటూ ఏమీ లేదు, problem అలా కులాన్ని అంతా (అది ఏ కులమయినా) ఓ గాటన (తాము వినిన, కలిగిన కొద్ది అనుభవాలతో) కట్టేసే అజ్ఞానులుతోనే :)

రాజేష్ జి said...

$భాస్కర్ రామరాజు గారు
ఆహ్వానం! ధన్య"వాదాలు" :))

$Snkr గారు
యధాప్రకారం సమయోచిత౦, సందర్భోచితమైన మాట మూట! ముఖ్యంగా చివరిది నూరు వరహాల మూట. ఇంటికెళ్ళగానే దిష్టి తీయి౦చుకోండి. ప్లీచ్.. బారక్కని పిలవోద్దు :)).

ఇక టపా టైటిల్ కి వస్తే, టపా/రచయిత ముఖ్యఉద్దేశ్యం "బ్రాహ్మణ విద్వేషానికి నిజమైన కారణాలు ఏవి, ఆ విద్వేషం ఎలా మొదలయింది, ఇప్పుడు దాన్ని ఏ విధంగా స్వార్థపరులు ఉపయోగించుకుంటున్నారు, అది తర్వాతి తరానికి ఎంతవరకు మంచింది!" అని తెలియనితరానికి తెలియచెప్పడం, ఆ విద్వేషాగ్నిని మరింత రగిలించకుండా చూడడం లేదా తగ్గించడం. అందుకే ఆ టైటిల్ అని నా సమర్ధన. మీరు ద్వేషించరు కాబట్టి మీకు నచ్చలేదేమో!

$Rao S Lakkaraju గారు
Truely, My day too!

$krishna గారు
మీరూ మీ generalization! నూటికో కోటికో ఒక్కరు.. ఆ ఒక్కరు..ఒక్కరు.. విదేశాల్లో లో ఉంటే ఎలా ! :)) Cant say more!

Krishna K said...

:) తమలపాక్కులతో కొట్టటం బానె ప్రాక్టీసు చేస్తున్నారు :)

"నూటికో కోటికో ఒక్కరు.. ఆ ఒక్కరు..ఒక్కరు.. విదేశాల్లో లో ఉంటే ఎలా !" అన్నట్లే ....ఆ ఒక్కరు.. ఇద్దరో అని అందరనీ అనవచ్చు అనేదే నేను చెప్పేది :)

Anonymous said...

@రాజేష్ జి
ఇటు మీరేమో బ్రాహ్మలు ఎలా ద్వేశింపబడుతున్నారో పలు ఉదాహరణలు చెప్పారు. మొట్టమొదటిసారిగా బ్రాహ్మణుల బాధలేంటో, వెతలే౦టో బ్రాహ్మణేతరుడిగా తెలుసుకున్నా. బాధపడ్డా! ఇలాంటి నిజాన్ని వెలికితీసే వ్యాసాలూ ఇంకా రావాలి అనుకునేలోపే అక్కడ దుర్గేశ్వరగారు ద్వేషం బ్రాహ్మణుల మీద కాదు, ధర్మం మీద అంటున్నారు. ఆ తమిళ మురుగు మొత్తం బ్రాహ్మణ ద్వేషమే కదా, మళ్ళీ ఇదేంటో? ప్చ్.. తల తిరుగుతోంది. ముందు మీరూ మీరూ మాట్లాడుకొని ఈ బ్రాహ్మణ ద్వేషం ఉందా లేదా అన్నది చెప్పండి బాబు :(

Anonymous said...

/You just made my day./ Rao jee, Krishna, Rajesh
:) అందులో నాగొప్ప ఏమీ లేదు. కులవ్యవస్థ వద్దు వద్దు అంటూనే, నిర్లజ్జగా తమ కులాన్ని బాహాటంగా చెప్పుకుని గర్విస్తున్నాను అని చెప్పుకునేవారు తమ మూర్ఖవాదాలకు అనుకూలంగా, 'బ్రాహ్మినిజం' అనే పేరుతో పిలవబడే హైందవధర్మాలను తెలిపే పురాతన గ్రంధాలలో ( ఉదా: భగవద్గీత, రామాయణభారతాలు, వేమన శతకం, ...) నాకర్థమైన కొంతలో కొంత చెప్పాను. మీకు నచ్చినందుకు సంతోషం.
14:36అజ్ఞాత, మీకు అడిగిందానికి జవాబు పైన సత్యప్రసాద్ అరిపిరాల గారి కామెంట్లో వుంది. అగ్రకులాలకు రిజర్వేషన్ ఇవ్వాలనడం కూడా తప్పు. ఆర్థికంగా తాహతులేని అందరికీ, ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం మాత్రమే చేయాలి, దాన్ని సద్వినీయోగం చేసుకుని వుద్యోగాలకు అర్హతను సంపాదించే బాధ్యత ఆ వ్యక్తులదే. కేవలం కులం ఆధారంగా అనర్హులను అందలాలు ఎక్కించడం, అదీ ఇప్పటి తీవ్ర పోటీ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి తీవ్రమైన అవరోధం. ప్రైవేట్ రంగంలో కూడా కులచీడ రిజర్వేషన్లు అమలుపరచాలన్నది అవివేకం. ఈవిధంగా తప్పు వద్దు వద్దు అంటూనే కులాధారిత రిజర్వేషన్ల ద్వారా కులవివక్షను బ్రతికించుకుంటున్నాం అన్నది నా అభిప్రాయం. అవ్వ కావాల- బువ్వా కావాల, కేకు వుండాల-నా కడుపూ నిండాల, ఫెయిల్ అయినా నాకు కలెక్టర్/డాక్టర్/ఇంజనీర్ వుద్యోగం ఇవ్వాల( మా ముత్తాతలను మీ ముత్తాతలను అవమానించారు గాబట్టి!! :) ) దేశం ప్రపంచదేశాల్లో టాప్10లో వుండాల అన్నది జరగని పని. ఏది కావాలో తెల్చుకోలేని అజ్ఞానంలో 6దశకాలు 50% కోటాతో గడిపేశాం, ఇకనైనా... ప్చ్..

Anonymous said...

Brahminism = Hindu Dharma ( belongs to all who practice such Dharma). This is based on 'Para brahma' as Hinduism calls the Supreme God, nothing to do with the caste Brhmana.

The word 'Brahmism' is cleverly being used by Hindu-haters to create confusion among various Hindu subdivisions making it to appear as if they are targetting particular caste - a divide and attack policy.

In summary... attack on 'Brahminism' is attack on Hindus/castes.

Krishna K said...

పైన అజ్ఞాతా,
"ముందు మీరూ మీరూ మాట్లాడుకొని ఈ బ్రాహ్మణ ద్వేషం ఉందా లేదా అన్నది చెప్పండి బాబు :( "

అంటున్నారు, తప్పకుండా బ్రాహ్మణ ద్వేషం ఉంది, అలాగే మిగతా కులాల మీద కూడా ద్వేషం వేరే కులాల వారికి ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు.

కాకపోతే, బ్రాహ్మణ ద్వేషానికి ఎక్కువగా కారణం, ఆ కులం వారు, ప్రస్తుతానికి ఆయా ప్రాంతాలలో, రంగాలలో domination చేస్తున్నారు అనేకంటే, indirect గా హిందూ ద్వేషాన్ని తెలివిగా బ్రాహ్మణ ద్వేషం గా మలిచే (అతి)తెలివితేటలు ఎక్కువ. ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఇంకా హిందూ ధర్మాన్ని (జీవన్ విధానం అందామా?) నిలబెట్టటం లో ఇప్పటికీ బ్రాహ్మల పాత్ర పెద్దదే!!

ఇక పైన snkr చెప్పినట్ట్లు "attack on 'Brahminism' is attack on Hindus/castes" అనేది నిజమే, ఎన్ని సచ్చు పుచ్చు కబుర్లు సారీ కత్తి లాంటి కబుర్లు చెప్పినా :)

p.s. హిందూ ధర్మం అంటే ఏమిటి? జీవన విధానమా అంటే ఏమిటి అనే పృశ్నలు దీనికి అడుగుతారు కాబట్టి, ఇప్పటికే దాని మీద చాలా చాలా చర్చలు జరిగాయి, తెలుస్కోగోరితే వెతుక్కోవచ్చు.

@Rajesh, నా రెప్లైలు టపా స్పూర్తిని ప్రక్కదోవ పట్టించేటట్లు ఉందని మీరు భావిస్తే ముందస్తుగా క్షమాపణలు.

Anonymous said...

లేఖరి: అవినీతిలో సోనియా భాగస్వామ్యం ఉందా?
కాకా: చెట్టు పాడయ్యిందంటే, పండు కాకుండా ఉంటుందా?
విలేఖరి: ఏఐసిసిలో ఉన్న ఇద్దరు, ముగ్గురు క్రిస్టియన్లు ఎవరు?
కాకా: వాళ్ళు ఎవరో మీకు తెలుసు.
http://www.andhrabhoomi.net/state/venkat-swamy-607

Anonymous said...

నాకు ఒక విషయం అర్థం కాదు, బ్లాగులో ఎంతో మంది పదవి విరమణ చేసిన వారు బాతాకాని కబుర్లు అని కొందరు, ఆ వంట ఈ వంటా అని రాసుకొనే జ్యోతి లాంటి వారు , బ్లాగు కనిపిస్తే కామెంట్ రసె సుజాత గారు, ఆ శ్రీనివాస రావు, ఈ రావు అని చాలా రకాల వారు ఉన్నారు. ఇటువంటి చర్చలు జరిగినపుడు ఎక్కడా వీరు కనబడరు. అంటె వీరేవరు ఇతరుల తో వివాదాలకు పోకుండా తమ ఇమేజ్ఞి కాపడుకొంట్టు గొప్ప వారిగా (సెక్యులర్)చలామణి అయిపోదామని అనుకొంట్టున్నారా? వీళ్ళంతా హిందువులు కారా? అన్ని తెలిసి మొద్దు నిద్ర పోతున్నట్లు నటిస్తారా? ఇంత మేధా పరమైన చర్చ జరుగుతుంటె వీరికి వాటి మీద అవగాహన లేక చర్చాలో పాల్గొనారా ? లేక చాచా నేహ్రూ లాగా గొప్ప వారనిపించుకోవాలనే దుగ్దనా? మీరు పాటించే సంస్కృతి మీద అవగాహన లేని వారైతే కనీసం వారు హిందూ మతం గురించి తెలుసుకోవాలి. ఇతరులకు తెలియజెప్పాలి. ఎవరైనా ఊరికినే నోరు పారేసుకుంటే వెంటనే అడ్డుపడాలి. హిందువుల పండగా నాడువంటాలు చేసుకొని తినడం కాదు. పండగా అంటె బ్లాగు వనభోజనాలని ఒక కార్యక్రమం చేపట్టటం తో సరి పోదు. పోలో మని అందరు నేను అది చేసా ఇది చేసా అని వారి బ్లాగులో రాసుకోవటమా హిందూ మతం అవలంబించటమంటే? ఇక్కడ తమ అభిప్రాయలు చెప్పె వారంతా ఎంతో చిన్న వారు, ఉద్యోగాలు చేస్తూ రాస్తూన్న వారు. వారు పని తో పాటుగా ఎక్కడేక్కడి చరిత్ర పుస్తకాలు చదివి చర్చిస్తూ ఉంటే తీరిక గా ఇంట్లొ కుచొని బ్లాగులు రాసే వారు కొంతమంది హిందూ మతం మీద తప్పుడు ప్రచారాన్ని కనీసం బ్లాగుల వరకు అడ్డుకోలేరా? రాస్తే తాడేపల్లి, దుర్గేశ్వర, చదువరి, వేళ్ళ మీద లెక్కించదగిన అజ్ణాతలు అంతే మిగతావారు హిందువులు కారా?
RAAMU

Sreekanth Chowdary said...

@రాజేష్ జి

పైన అజ్ఞాత రూపంలో వ్యాఖ్య చేసింది నేనే. మీ దగ్గిరనుంచి రిప్లయ్ రాలేదు. బహుశా ఏదో పనీ పాట లేక అజ్ఞాతగా వీడెవడో అడుగుతున్నాడు అని అనుకున్నారేమోనని నా పేరుతో ఈ వ్యాఖ్య పెడుతున్నా. మీ బ్లాగ్ నా మెయిల్ కి స్నేహితుడు ఒకరు మొన్న పంపారు. అప్పటినుంచి ఫాలో అవుతున్నా. పైన నా ప్రశ్న వెనక ఏవిధమైనటువంటి వ్యంగం లేదు.నాకు తెలిసి మనది ఒకే వయసు, యువకులం . కాబట్టి ప్రస్తుత పరిస్తితుల్ని బట్టి చెప్పి నా తికమకల్ని నివారించగలరు :(. మీరు చెప్పేది వాస్తవమని నమ్మగలను.

@కృష్ణ, Snkr

మీ రిప్లయ్లకి ధన్యవాదాలు
Snkr:
సత్యప్రసాద్ అరిపిరాల గారు చెప్పింది అవి రెండూ వేరు అని, బ్రాహ్మనిసం పేరున తిట్టవచ్చని. అది తిడితే బ్రాహ్మల్ని కాదని. దానికి రాజేష్ దాని చేసిన పైన వ్యాఖ్య సరిపోద్ది. ప్రస్తుతం ఇవి రెండూ వేరు కాదన్న రాజేష్ భావనతో నేనూ అంగీకరిస్తా! మీ మిగిలిన వ్యాఖ్యలతో అంగీకరిస్తా.

కృష్ణ: మీరు ఇలా అన్నారు
"కాకపోతే, బ్రాహ్మణ ద్వేషానికి ఎక్కువగా కారణం, ఆ కులం వారు, ప్రస్తుతానికి ఆయా ప్రాంతాలలో, రంగాలలో domination చేస్తున్నారు అనేకంటే, indirect గా హిందూ ద్వేషాన్ని తెలివిగా బ్రాహ్మణ ద్వేషం గా మలిచే (అతి)తెలివితేటలు ఎక్కువ
"
ఏమనుకోవద్దు. మీరు రాసింది ఇలా నాకు అర్థమయింది. బ్రాహ్మలు హిందూ ద్వేషాన్ని బ్రాహ్మణ ద్వేషంగా మలుస్తున్నారని. అంతేనా లేక కేవలం టైపో నా ? ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటే దిద్దగలరు.

Anonymous said...

@Sreekanth

I too with you. Infact, this post just exhibits the other side of the coin about persecution of brahmins in a very balanced way with factuals. I did double check and confirm myslef whatever said was true. We should all, as a human being, condemn those barbaric attrocities faced by brahmins and should support them atleast from this century. But honestly, They can only solve problems by uniting themselves and no one could help.

My grandpaa used to say "braahmnaanam anekam" That mean brahamnulu anekam(different) and they never get united. I could say that is true after seeing many incidents and the response to this post is one of them. There are many brahmins, whom I personally knew, hanging around blogs, but only very few's response I could see. That was pathetic.

My hunch is They might feel/fear of If they could come and respond here could brand them "castest". That is sheer shameful and NO one in the earth could help out. This post is not spewing venom on other castes/creed but rather shared valuable facts/facets of brahmins plight which turns tears up in my eyes. And responding to this post should never feel any sensible one that post belongs to single caste. It is just supporting cause happend to a team of people suffering from thousands of years and still!

Somebody may say problems were faced by every caste but that argument is sheer useless atleast with respect to this post. It is like when a seminar talking about cancer and severity of it to life, interrupting and triggering a question that all the deceases are dangerous and threat to life which won't lead to any fruitful discussion and that could even bury the main topic about "cancer".

Rajesh G, I am with you.

P.S: Got a question? There Should be one If my hunch is correct :). okay!. I am not a brahmin and belongs to reddy community. I was already commented a few in this post and this my fourth one just for enlightening others.

Thanks!

Malakpet Rowdy said...

Wow, nice to see people fighting back.

Rajesh! Way to go!!

Anonymous said...

*ఆధిపత్యవర్గానికి అలోచననూ అండనూ వారి దమనకాండలకు ఊతమిచ్చే థియరీలనూ ఇచ్చింది బ్రాహ్మణకులమే. దానికి చరిత్ర సాక్ష్యం. *

కత్తి గారు, మీరు ఇలా పచ్చి అబద్దాలు రాయటం ఎమీ బాగ లేదు. కొంతమంది జవహర్లాల్ నెహ్రు,ఉస్మానియా ఆచార్యులకు ఇటువంటి థీరీలు రాసి పొట్ట మింపుకోవటం పరి పాటి. కమ్యునిస్ట్టు పార్టి వారు ఉంటారు. వారికి తెలుసు జీవితంలో ఎప్పటికి అధికారం లోకి రాలేమని. కనుక వారు తమని తాము నిజాయితికి నిలువుటద్దం లా భావించుకొంట్టు ప్రభుత్వన్ని చీల్చి చెండాడుతూ ఉంటారు. మీరు కూడా ఇక్కడ అదే పద్దతి పాటిస్తున్నారు. చరిత్ర సాక్షం అన్నారు కనుక ఉదాహరణలు ఎమైనా ఇవ్వగలరా?
----------------------------------
ఇక పోతే మరి దళిత వర్గం వారికి సహాయం అందించిన వారిలో కూడా ఎంతో మంది బ్రహ్మణులు ఉన్నారు. మీరు ఎప్పుడూ వారి గురించి మీ బ్లాగులో ఎక్కడా ఒక్కటంటే ఒక్క టపా రాయలేదు. దీనికి ఎమైనా ప్రత్యేక కారణం ఉందా?

సాపాటు సమగతులు said...

I found some comments were laid in spam folder.I am not sure what could be reason, However published them now. Sorry for the inconvenience caused to the one commented. Hereafter, I will be more cautious.

సాపాటు సమగతులు said...

Below are the threats spew by Kathi Mahesh Kumar and later deleted by himself. Threats are one for me and another to Anon who is working as solder. I believe it is good to keep them, That help everybody knows what went on without missing the firing guns. If somebody feel bad and objected with valid reason, I am ready to delete this comment.

Also time for the one, who support him blindly, has to introspect over the barbaric threats issued by him!

*******************
Kathi Mahesh Kumar has left a new comment on your post "బ్రాహ్మణులు ఎందుకు ద్వేషింపబడుతున్నారు?":

@Anonymous: If you are a soldier and doing such illegal thing I am sure you will be ripped off all your badges (if any) and will be decommissioned immediately. Don't brag here about your guts that you don't have. నిజంగానే నువ్వు సైనికుడివైతే ధ్జైర్యగా పేరుచెప్పి వ్యాఖ్యానించు. ఏబెటాలియనో, ఏ కేడరో చెప్పు. I will take your pants down in front of entire Indian army for what you said.



Posted by Kathi Mahesh Kumar to సాపాటు సమగతులు at 30 January 2011 08:04

***********************************

Kathi Mahesh Kumar has left a new comment on your post "బ్రాహ్మణులు ఎందుకు ద్వేషింపబడుతున్నారు?":

చిన్నచిన్న గొడవా!!...dear fellow ! talking like that is against the law of this nation.

నేను గౌరవప్రదంగానే చర్చ మొదలెట్టాను. కానీ నన్ను కించపరిచేపదజాలం వాడినా శాంతంగా కూర్చునేందుకు నేను చవటను కాను. see the line of discussion, who is trying to trivialize the issue. If you still keep those comments as trophies so be it. But it is not only my responsibility but duty to remind you that its against the law.

All the aggregation that are having ur blog will also be in trouble soon. Be ready...



Posted by Kathi Mahesh Kumar to సాపాటు సమగతులు at 30 January 2011 09:41
***********************************

Anonymous said...

%that its against the law%
నిస్సహాయులైన పేద నిమ్నకులాల కార్మిక కర్షకులు ధనిక భూస్వాముల దౌష్ట్యానికి గురికాకుండా కొంత ఆసరాకల్పించాలన్న మహోన్నత ఉద్దేశ్యాలతో చేసిన చట్టాలను, కులమత దేషాలను కక్కుతూ, బేవార్సుగా ఇంటర్నెట్ బురదలో దొర్లుతూ,(ఒళ్ళు)కొవ్వెక్కినపొరలుగలవాళ్ళు (క్రీమీ లేయర్), నీచ రాజకీయనాయకులూ తమ అసాంఘిక స్వార్థప్రయోజనాలకు దుర్వినీయోగం చేయడం ద్వారా నిజమైన అర్హులకు ద్రోహం చేయడం, శోచనీయము, క్షమించరాని నేరం.

Anonymous said...

ఇలాంటి చీడ, పేడపురుగులు వున్నంతకాలం బలహీన వర్గాలు బలహీనంగా నే మిగిలిపోతారు, 60ఏళ్ళుగా మిగిలిపోయారు. ఈ ఒక్కవిషయంలో,ఎంగిలికూటికి ఆశించనని ధైర్యంగా చెప్పిన ప్రవీణ్ మందగి అభినందనీయుడు.ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని ఆశిస్తున్నా.

రాజేష్ జి said...

$Sreekanth ji,
Thank your for commenting and sheer interest to understand current affairs. Hmm... I never had any bias towards Anons, See my comments to Anon's above. Actually, Your pervious single question (as Ajnaata) triggered
multiple questions to me. And It is impossible for me to answer your question wiht plausible arguments and without solid groundwork. Having said that, I am on the way to reach you. Apology for the delay.

$Ajnaata(Reddy) gaaru
I been truely elated with your comment and support. That is the spirit of being human.

#..could brand them..sheer shameful..
Ofcourse you are true! But what my expectation from this post would be They need not to comment and solace but rather dicussing and sharing the facts to their generation and enlightening them out that we have done more good than harm and our forefathers too! And I never want to see a day of tommorow where my ganrdson/someone write/publish such article again! But I understood the sad part you mentioned about no-unity.

#..seminar talking about cancer..
Aptly said. I bestow my heart and affection to you!.

Just want to alert you both that the post was the hardwork and written in english by Mr.Uday Pai(Find the link at the end of the post). I was just invested my time to translate that into telugu by expecting telugu
people would get enlighten with the factual! Thus, If there is any honor of such work that must goes to Mr.Uday Pai with no hesitation.

Please keep commenting and share your views!

Bhardwaj Velamakanni said...

Lol that idiot issued the same kind of threat to Bhaskar too.

Against laq? My foot!

Bhardwaj Velamakanni said...

All the aggregation that are having ur blog will also be in trouble soon. Be ready...
----------------------------

I m shivering with fear, baby!

Anonymous said...

ఆర్యా కత్తిగారి ఒక వ్యక్తిగాదు. అతను సమకాలిన దళిత మేధావుల తరుపున బ్లాగులోకం లో తన గళం వినిపించే సాముహిక శక్తి. ఎవరి వలన మనకు ప్రస్తుత తరం మేధావుల ఆలోచనా స్రవంతి తెలుస్తుందో ఆయనే కత్తి. ఆయన పైనా ఇలా విరుచుకుపడటం ఎమీ బాగ లేదు. అతను లేక పోతే ఈ బ్లాగులోకం లో ఇంత చర్చ జరిగేదా? అందరు ఎవరి టపాలు వారు రాసుకొంట్టు, ఒకరిని ఒకరు బలే రాశారండి అని పొగడుకొంట్టూ, మూఠాలు కట్టుకొంటూ ఉండేవారు. నంబర్ 5 వర్గాన్ని( మధ్య తరగతి మేధావివర్గం) ఏకం చేయటం లో కత్తి గారి పాత్ర ఎంతో ఉందని మీరంతా గుర్తించాలి.

yogirk said...

Oh the sucker was here! And the threat was issued. Deja vu!

Who else is wetting their pants? ;)

tankman said...

@blogowner..... vaadana lo avesham ekkuvayinapudu boledu antuntaaru prajalu, katti is no different. But he came to senses and deleted those comments. I think you should not disclosed those comments. Now it appears that even you are trying to win the argument using character assassination. Dont stoop to that level.

Do you think the discussion would have gone in the same way if u did not give permission for anonymous posts?

Bhãskar Rãmarãju said...

నా పాయింటు లాగలేరు ఎవ్వరూ
ఎందుకో అడక్కపోయినా నేనే సెప్తా

నేను పాయింటు ఏస్కోను
లుంగీ కట్టుకుంటానబ్బా.

The Joker said...

"నిజంగానే నువ్వు సైనికుడివైతే ధ్జైర్యగా పేరుచెప్పి వ్యాఖ్యానించు. ఏబెటాలియనో, ఏ కేడరో చెప్పు. I will take your pants down in front of entire Indian army for what you said."

పాంట్ యిప్పిన తర్వాత ఏం చేస్తారూ చెప్పడం మర్చిపోయారు కత్తిగారు. ఇప్పి, ఇంగిలీషు సినిమాల్లో లాగా రుచి చూసి ఇది బ్రాహ్మణదా, దళితదా అని నిర్ణయిస్తాడన్నమాట. ఆ తర్వాత దానిమీద బ్లాగులో థీసి రాస్తాడు

Bhãskar Rãmarãju said...

భరద్వాజ అన్నాయ్
ఏందీ మాటిమాటికీ నా పేరు లాగుతా ఉన్యా?
ఈడా పాయింట్లు లాగేటోళ్ళతో బాటు పేర్లు లాగేటోళ్ళూ ఉన్యారబ్బా!! ఓహోహో....బయ్యంబుట్టి సస్చాఉంటే

మంచు said...

రాజేష్ గారు ముందుగా మీకు అభినందనలు ... చాలా చక్కగా రాసారు. మీ పొస్ట్ కి శంకర్ గారి కామెంట్స్ అదనపు ఆకర్షణ.

పైన కృష్ణ గారు, శంకర్ గారు చెప్పిన్నట్టు, ఇప్పుడు "attack on 'Brahminism' is attack on Hindus/castes" అనేది నిజం. పైన రాసిన కొన్ని కామెంట్లు చూస్తే అది ప్రస్ఫుటం గా కనిపిస్తుంది....

పిల్లకాకి , ఇంక మిగతావారికి.... ఎవరి కులం , ఎవరి మతం గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకొవచ్చు... కానీ ఎదుటి మతాన్ని, కులాన్ని కించపరుస్తూ చేసే వ్యాఖ్యలే అభ్యంతరకరం. అది ఎవరు చెస్తారొ మీకు తెలీనది కాదు.... :-)

కులరహిత సమాజం కావాలని కూసే ఎవడయినా తన కులం సర్టిఫికేట్స్ లొ రాయించకుండా ఉండమనండి చూద్దాం.... అసలు హిందూ మతమే లేదని వాదించేవాళ్ళు కూడా కక్కుర్తితొ అదే హిందు మతం అడ్డుపెట్టుకుని ఫ్రీ లక్షల కొసం ఎగబడిపొతూ ఉంటారు. ఇదీ ఎవరొ మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు.


రాజేష్ గారు: బిల్గేట్స్ లాంటి బ్రాహ్మణవాది (పొనీ బ్రాహ్మనిజం వంటపట్టించుకున్న వ్యక్తి) మైక్రొసాఫ్ట్ లొ బడుగు దళిత అణగారిన వర్గాలకి రిజర్వేషన్ కల్పించకపొవడం నిజంగా దురదృష్టకరం ...కనీసం దాంట్లొ క్రిమీలేయర్ ని కూడా పట్టించుకొకపొవడం అతని భూస్వామ్య దమననీతి కి అద్దం పడుతుంది ..దీన్ని నేను ఖండిస్తున్నా... :D :D

Anonymous said...

నాకు ఒక విషయం అర్థం కాదు, బ్లాగులో ఎంతో మంది పదవి విరమణ చేసిన వారు బాతాకాని కబుర్లు అని, telugu raaDikal అని కొందరు, ఆ వంట ఈ వంటా అని రాసుకొనే వారు , బ్లాగు కనిపిస్తే కామెంట్ ఎట్టే కొంతమంది ఇలా రాస్తూ పోతే చాలా రకాల వారు ఉన్నారు. ఇటువంటి చర్చలు జరిగినపుడు ఎక్కడా వీరు కనబడరు. అంటె వీరేవరు ఇతరుల తో వివాదాలకు పోకుండా తమ ఇమేజ్ఞి కాపడుకొంట్టు గొప్ప వారిగా (సెక్యులర్)చలామణి అయిపోదామని అనుకొంట్టున్నారా? వీళ్ళంతా హిందువులు కారా? అన్ని తెలిసి మొద్దు నిద్ర పోతున్నట్లు నటిస్తారా? ఇంత మేధా పరమైన చర్చ జరుగుతుంటె వీరికి వాటి మీద అవగాహన లేక చర్చాలో పాల్గొనారా ? లేక చాచా నేహ్రూ లాగా గొప్ప వారనిపించుకోవాలనే దుగ్దనా? పోని మీరు పాటించే సంస్కృతి మీద అవగాహన లేని వారైతే కనీసం వారు హిందూ మతం గురించి తెలుసుకోవాలి. ఇతరులకు తెలియజెప్పాలి. ఎవరైనా ఊరికినే నోరు పారేసుకుంటే వెంటనే అడ్డుపడాలి. హిందువుల పండగా నాడువంటాలు చేసుకొని తినడం కాదు. పండగా అంటె బ్లాగు వనభోజనాలని ఒక కార్యక్రమం చేపట్టటం తో సరి పోదు. పోలో మని అందరు నేను అది చేసా ఇది చేసా అని వారి బ్లాగులో రాసుకోవటమా హిందూ మతం అవలంబించటమంటే? ఇక్కడ తమ అభిప్రాయలు చెప్పె వారంతా వయసులో ఎంతో చిన్న వారు, ఉద్యోగాలు చేస్తూ రాస్తూన్న వారు. వారు పని తో పాటుగా ఎక్కడేక్కడి చరిత్ర పుస్తకాలు చదివి చర్చిస్తూ ఉంటే తీరిక గా ఇంట్లొ కుచొని బ్లాగులు రాసే వారు కొంతమంది హిందూ మతం మీద తప్పుడు ప్రచారాన్ని కనీసం బ్లాగుల వరకు అడ్డుకోలేరా? రాస్తే తాడేపల్లి, దుర్గేశ్వర, చదువరి, వేళ్ళ మీద లెక్కించదగిన అజ్ణాతలు అంతే మిగతావారు హిందువులు కారా?

RAAMU

Anonymous said...

నేను పైన రాసిన దానిని క్లుప్తంగా చెప్పాలంటె. పాత తరం వారు కొంచెం కూడా భాద్యత తీసుకోకుండా. వారి ఇళ్ళలో ఉన్న రోజువారి పనులను బ్లాగులు నింపుకుంట్టూ కొడుకు,కోడలు, అథిదుల రాక పోకలు, మనవళ్ళ సంగతులు, టి వి లో పాటల కచేరిలు, పాడుతా తీయగా లాంటి పోగ్రాంలు, బాపు, వేటురి, బాల సుబ్రమణ్యం ల మీద అభిప్రాయాలు రాయటం, వంటకాల తయారి, వారి చిన్న నాటి వీరగాధలు మొదలైన వాటి గురించి రాసెవారు. లేక పోతే పుస్తకాల రివ్యులు రాసే వారు, పద్యం గురించి రాసి దాని భావం మీద టపాలు రాసి ఆహా ఓహో అంకుకొనే వారు. సీరియల్స్ రాసుకొనే వారు ఎందుకు ఇటువంటి చర్చలలో పాల్గోనరు? అసలికి బ్లాగులోకం లో ఇటువంటి వారే ఎక్కువ. సీరియస్ విషయాల మీద రాసే వారు ఒకరో ఇద్దరో అంతే. ఈ బ్లాగర్ల లో అధిక భాగం బ్రహ్మణులు ఉన్నారను కొంట్టాను. కాని వారు వారి అభిప్రాయలు చెప్పటానికి ఎందుకు ముందుకు రావటం లేదు? వారి వ్యవహారం ఎదో మా జీవితం ఇలా జరిగి పోయింది, మీ ఖర్మ మీరనూభవించండి అనేవిధం గా ఉంది. పదవి విరమణ చేసిన వారు ఊరకనే జీవితానుభవాలు రాసుకొంట్టు కూర్చోక పోతే చరిత్ర పుస్తకాలు తిరగేసి చర్చలలో పాల్గొంట్టూ వారి అభిప్రాయాలు చెప్పవచ్చు కదా.

RAAMU

Bhãskar Rãmarãju said...

RAAMU
ఇదేవిటయ్యా? అహా! ఇదేవిటీ?
ఇష్టం ఉన్నవాళ్ళు వచ్చి పాల్గొంటారు, ఇష్టం లేని వాళ్ళు రారు. అందులో వేలెత్తి చూపాల్సిన పని ఏవుందీ?
వాళ్ళొచ్చి పాల్గొంటేనే ఈ చర్చకు అర్థం వస్తుందా లేక వాళ్ళు రాకపోతే అర్థం రాదా? లేక వారి విషయ పరిజ్ఞానం ఇక్కడి విషయాలను విడమరిచి చెప్తాయా?

మీ ఆలోచన తప్పు. బ్లాగు రీడింగు, బ్లాగుల్లో వ్యాఖ్యలు ఇత్యాదివి ఒకరి ఇష్టాఇష్టాలమీద, మరియూ ఆసక్తి మీదా ఆధారపడి ఉంటాయని గమనించండి.

Krishna K said...

@శ్రీకాంత్,
నేనన్నది reverse లో.
ఇంకొంచం ఉదాహరణలతో చెప్పాలంటే,
"అంటున్నారు, తప్పకుండా బ్రాహ్మణ ద్వేషం ఉంది, అలాగే మిగతా కులాల మీద కూడా ద్వేషం వేరే కులాల వారికి ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు." అన్న నా కామెంట్ లో ఉద్దేశ్యం, మిగతా కులాల మీద కూడా ద్వేషం ఉంది ఆయా ప్రాంతాలలో వెర్వేరు కారణాలతో. అలా ద్వేషించబడని కులం అంటూ నా అనుభవములో నాకు కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే, నెల్లోరు ప్రాంతం లో, రెడ్లు అంటే మిగతా కులాలవారికి, వారికి దగ్గరా ఉండే కులాల వారికి కొంచం ఎక్కువ ద్వేషం చూచాను. అలాగే గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో కమ్మ వారంటే మిగతా వార్కి ఉన్న ద్వేషాన్ని చూచాను. అలాగే ప్రకాశం లో ముఖ్యంగా ఒంగోలు ప్రాంతం లో మాలలు అంటే మాదిగలకు ఉన్న ద్వేషాన్ని కూడా చూసాను. అలాగే, వృత్తి ఒకటే అయినప్పటికీ, బాధలు ఒకటే అయినప్పటికీ నేత కులాలలో (దేవాంగ, పద్మశాలి గట్రా) ఒకరంటే ఒకరకు ద్వేషాన్ని చూచాను. చీరాల ప్రాంతం లో ప్రస్తుతానికి మాదిగలంటే, ఎరుకల కులస్తులకున్న ద్వేషాన్ని చూచాను. అందుకనే, ఈ ద్వేషభావాన్ని అనుభవించని కులమంటూ ఏమీ లేదు అనేది.

కాకపోతే, బ్రాహ్మణల విషయంలో uniqueness ఏమిటి అంటే, ప్రతి కులం ద్వేషించబడటానికి ఉండే standard reasons వలన ద్వేషించబడతానికి తోడు, ఎగస్ట్రాగా వారు హిందూ ద్వేషం వలన కలిగే ద్వేషభావాన్ని కూడా భరించాల్సి రావటం. ప్రతి హిందూ ద్వేషి ప్రస్తుత కాలంలో ప్రత్యక్ష్మగానో, పరోక్షంగానో ఆడిపోసుకొనేది బ్రాహ్మలను అని నా ఉద్దేశ్యం.

Krishna K said...

ఇక ఇక్కడ రాజెష్ చెప్పిన వాటి కొన్నిటిలో ఎకీభవించే వారందరూ బ్రహ్మణులూ, ప్రశ్నించేవారందరూ బ్రాహ్మణ ద్వేషులు అని నేననుకోను, ఒకరో ఇద్దరో కేతి గాళ్ల గొడవ ఎప్పుడూ ఉండెదే :)

శ్రీకాంత్, మీరు అడిగిన విధానం మాత్రం నాకు నచ్చింది. hidden agenda లంటూ ఏమీ లేకుండా, ఏ కులమూ ఎక్కువ కాదు, తక్కువ కాదు అనే పరస్పర గౌరవం తో మన అనుభవాలు, అభిప్రాయాలు చర్చించుకోవటం వలన లాభమే తప్ప నష్టం లేదు.

అలాగే పైన అజ్ఞాత "Somebody may say problems were faced by every caste but that argument is sheer useless atleast with respect to this post" అన్న మాటతో కూడా ఎకీభవిస్తాను, అందుకే నా ఇంతకముందు కామెంట్ లో "ముందస్తు క్షమాపణలు" అంటూ రాజెష్ ను ఉద్దేశించి అన్నది.

Krishna K said...

ఇక "నంబర్ 5 వర్గాన్ని( మధ్య తరగతి మేధావివర్గం) ఏకం చేయటం లో కత్తి గారి పాత్ర ఎంతో ఉందని మీరంతా గుర్తించాలి." అన్న అజ్ఞాత, వెటకారమా, సీరియస్సా?

రాజెష్, మీ టపాకంటే, గమనిక ఎక్కువ నచ్చింది, కొంచం పెద్ద ఫాంట్ లో పెడితే మంచిదేమో :)

Malakpet Rowdy said...

But he came to senses and deleted those comments. I think you should not disclosed those comments
_____________________________________________________

I AGREE, ONLY IF THE SAME LOGIC HAS BEEN APPLIED TO THE CASE WHEREIN THAT GUY FORCED THE PUSTAKAM.NET ADMINS TO RESTORE THE DELETED COMMENTS.

BUT YOU DONT FIND ANYTHING WRONG WITH THE CASE I HAVE MENTIONED - DO YOU?

Malakpet Rowdy said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...

Now it appears that even you are trying to win the argument using character assassination
_____________________________________________________

You can assassinate the character ONLY if it exists :)

Sreekanth Chowdary said...

@Rajesh G
Happy seeing your response. Well I am looking forward for your response. But I had a request for you. Since I am not a constant blogger, requesting you to send a mail when you respond to my question. Sent a test mail to your id and please use that to give a update.

Have a great weekend.

By the way observed the threats issued. Kewl, Is he a joker or blogger? Dirty prick :)

@Ajnaata
Thank you for supporting. Good to see your possitive voice.

@krishna
Thank you for clarification on your intention.

సాపాటు సమగతులు said...

Thank you for everyone who commented and shared their thoughts!
After a week release ragada, Got plenty-free time to respond you back. But before that, let me share you couple of quotes which would back why this article being written and up.

A person should not be too honest. Straight trees are cut first and honest people are screwed first. -- Chanakya

I decided it is better to scream. . . . Silence is the real crime against humanity.
-- Nadezhda Mandelstam

In the end, we will remember not the words of our enemies, but the silence of our friends. -- Martin Luther King Jr.

The greatest tragedy is not the brutality of the evil people, but rather the silence of the good people. -- Dr. Martin Luther King, Jr.



And a small note: The article is not written in such a manner to rejoice the share that derives its deserve from its popularity or from the amount of attention it receives. Just observe its integrity before hastening to accept or diluting it. To sum it up, From this article anticipating a daily nourishment and not a fleeting attraction. Hope everyone agrees with me here!

సాపాటు సమగతులు said...

$Kathi Mahesh Kumar
#..ఆధిపత్యవర్గానికి అలోచననూ..దమనకాండలకు ఊతమిచ్చే థియరీలనూ ఇచ్చింది... దానికి చరిత్ర సాక్ష్యం.

Isn't it? Give me some solid instances taken from history and that I could enlighten myself If valid?

#కాబట్టి ఇది కుల సమస్య కాదు
Thanks for recognizing that. Though I don't want to be in your tutelage, But do you mind to agree "that" still been an issue to a caste in question that always deters them to get up and face up with the society?

Anonymous said...

"
greatest tragedy is not the brutality of the evil people, but rather the silence of the good people.
"
Good quotation and can be applied to all where there is a evil! Thank for share.

కానీ ఇది ఈ టపాకి అనుబంధంగా పెట్టడం బాలేదు!. ఎలా అంటారా మీరు ఈ టపా రాసిన తర్వాత ఎవరూ గమ్మునలేరు. ఒకరు ప్చ్..ఇది స్వకుచం అని, ఇంకొకరు ఈ 5% చెడు అందరిలో చూడమని, మరొకాయన ఈ బాధలు అన్ని కులాల్లో ఉన్నాయని, కొంతమంది ఇంకా ముందుకెళ్ళి ఇది హిందూ ద్వేషమని చిన్నగీత పక్కన పెద్దగీతగీయడమే పరిష్కారమని, ఇంకో పెద్దమనిషి ఎవరికులాన్ని వారు పోగుడుకోవచ్చు, ఇక్కడా అదే జరిగిందన్నట్లు తన కులాభిష్టిని చాటుకోవడం.. ఆహా ఇంతకన్నా సౌండ్ కావాలా?

మరి ఇంతగా అరిచిన ఈ ఆదర్శగొంతుకలన్నీ ఆ మురుగుడు వరసపెట్టి టపాలెట్టి బ్రాహ్మణులమీద విద్వేషాన్ని కక్కుతున్నప్పుడు ఏమయ్యాయి అనా?
భలేవారే,మీ కొటేషన్ ప్రకారం మీ టపాలో ఈవిల్ ఉంది అందుకే సౌండ్, అక్కడ మురుగుడు టపాల్లో మంచి కనిపించిఉంటుంది నో సౌండ్. బావుంది!

ఈ టపా గమనిక చెప్పినట్లు ఇది మురుగు లేదా మహిషికి సమాధానం కాదు కానీ ఆ నీచపురాతల బాధలో తన్నుకు౦టూ ఆవేశంలో వచ్చిన ఇంతకు ముందు టపా, ఈ టపా దానికి ఆత్మ అని నా అభిప్రాయం. మరలాంటప్పుడు అసలుకారణం మీద ఎవరయినా చర్చించారా, తమతమ పెద్దతనం చూపించడం తప్ప. ఈ విషయంలో కత్తి మహేష్కుమార్ గారు నయం ఓ టపా యెట్టి తనకు దేనిమీద ద్వేషమో నిక్కచ్చిగా చెప్పారు. అది ఈ బ్లాగ్ఓనర్ తెలుసుకుంటే మంచిది.

హహ.. ఇలాంటి టపాలు ఎన్నివచ్చినా మార్టిన్లు, చాణక్యలు బతికి రాలేరు.. అంతే!

సాపాటు సమగతులు said...

$Snkr ji

#ప్రైవేట్ రంగంలో కూడా కులచీడ రిజర్వేషన్లు అమలుపరచాలన్నది అవివేకం.
Truly! But still should see pros and cons of that, though tough, before say NO-GO.

#కులాధారిత రిజర్వేషన్ల ద్వారా కులవివక్షను బ్రతికించుకుంటున్నాం

Yeah, It is very unfortunate turn that reservations become vital to nourish casteism where they actually meant to provide nourishment and to curb forged side of casteism.

Reservations should be there for needy one irrespective of by caste, creed and religion.

#..ఫెయిల్ అయినా నాకు కలెక్టర్/డాక్టర్/ఇంజనీర్ వుద్యోగం ఇవ్వాల( మా ముత్తాతలను మీ ముత్తాతలను అవమానించారు గాబట్టి!! :) )

You nailed the truth hardly though later point is half-true:)

#ఏది కావాలో తెల్చుకోలేని అజ్ఞానంలో 6దశకాలు 50% కోటాతో గడిపేశాం, ఇకనైనా... ప్చ్.
Well said.. no comment..ప్చ్. :))

#..attack on 'Brahminism' is attack on Hindus/castes...

May be it was true sometime back, But not after the independence. Now brahminism always refers to the caste in question.
Do you object that with solid argument? I had plenty! Take the case of Murugu, Do you back yourself that his angst is on hindusim and castes but not against particular caste(brahmin)? And dont underestimate like such pricks can spew venom ALA no one could object.
okay! for god sake let us assume what you said is true. But would that solace the issue atleast to small extent rather get buried?

Hope you comprehend on my POV :)

సాపాటు సమగతులు said...

$Anonymous Ji
#ఇక పోతే .. వారికి సహాయం..వారిలో కూడా ఎంతో ..ఉన్నారు. మీరు ఎప్పుడూ ..బ్లాగులో ఎక్కడా ..ఒక్క టపా రాయలేదు. ...త్యేక కారణం ఉందా?

Well phrased question But unanswered as expected. There are many vilified things that lying around and causing not to exhibit such aide did. Ofcourse, Do we really need to pull his leg to write such? :)

సాపాటు సమగతులు said...

$Anonymous Ji
#
"
....తమ అసాంఘిక స్వార్థప్రయోజనాలకు దుర్వినీయోగం చేయడం ద్వారా నిజమైన అర్హులకు ద్రోహం చేయడం, శోచనీయము, క్షమించరాని నేరం
"

An astute saying! i.e. against law of everyone's inner space :).

#ఒక్కవిషయంలో..ప్రవీణ్ ...ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలని..ఆశిస్తున్నా..

Truly, Applauds to Preveen. Jai ho:). Letz hope so He would be pioneer to others in same line.

సాపాటు సమగతులు said...

$Anonymous Ji

#ఆర్యా కత్తిగారి ఒక వ్యక్తిగాదు
Truly!
#సమకాలిన దళిత మేధావుల తరుపున..గళం వినిపించే సాముహిక శక్తి...
Sadly and badly, this is a deception. Say Praveen, I do agree.
#ఎవరి వలన..తరం మేధావుల..స్రవంతి తెలుస్తుందో..
Understand witty part :).

#..టపాలు..రాసుకొంట్టు..ఒకరిని ఒకరు బలే..
I am afraid, You are incorrect that this post is not such a riposte at any level. If you say in general, agreed everyone loves Joker:)

#..నంబర్ 5 వర్గాన్ని..పాత్ర..గుర్తించాలి
:)) Started recognizing But getting laugh what to do? :(

సాపాటు సమగతులు said...

$sanju -The king!!!
Welcome :).
#vaadana..avesham..katti is no.. But..senses..deleted

Come on Mr. King. Where you were all the time? Can you show where was the hot discussion flowing on which leads such barbaric threat? If at all required, such threat must be at the last line of defense But still exploiting the law is a crime. Don't you mind?

#..think..you..disclosed..
You committed a blunder(iterated one) Then I showed you up it was(filling gap). If I keep quite, How did you know that a blunder happened?Revoke/deletion of such wouldn't be symbol of repentance but rather fooling others. There must be an apology to the concerned before revoking. Make "sense"?

#..appears..you..win..argument..

hehehe.. I wonder how it would be a way to win any and what is the argument over here? Come on grow up dude!

#char..ass..
Hope Malak ji answer sufficed to your "char...ass.."!

#..discussion..permission..anonymous posts?

Nothing went wrong here from Anon comments and couple of them I even backed up. Do you challenge? Time for introspection :)).

$The Joker
#ఆ తర్వాత దానిమీద బ్లాగులో థీసి రాస్తాడు
:)) Then who are the approvers for that thesis?

Anonymous said...

మరుగు నోరు మూసిన ఒక అజ్ఞాత కామెంటు.. ఇదీ సామాజికస్పృహ

దళిత సోదరుల మీద మీ ప్రేమను చూసి చాలా ఆశ్చర్య మేసింది. అంత ప్రేమే ఉంటె మీరు తమిళ నాడులో జరిగే వాటి మీద ఎక్కడైనా నోరు మెదిపారా? దళితుల పై వెనుకబడిన తరగతులు (తమీళ నాడులో బ్రహ్మణులు తప్ప అంతా వెనకబడిన వారే కదా) ఎంత ప్రేమ కురిపిస్తాయొ అది బ్రహ్మణులకు, అంటరాని తనానికి వ్యతిరేకం తీవ్ర పోరాటం చేసిన తమీళనాడులో! ఇన్నీ రోజుల ద్రవిడపార్టి పాలనలో ఇంకా రెండు గ్లాసుల పద్దవి ఉంది. మరి దేవర్లు, మొదలియార్లు, వన్నియార్లు దళితులను నేత్తిన పేట్టుకొని చూసుకొంట్టున్నారా? ఆ వర్గాల సంగతి తెలియాలి అంటే కింద లింక్లు కత్తి గారి బ్లగులొ నుంచి చదువుకో. పాపం పెరియార్ గారు బతికి ఉన్నప్పుడే ఈ మూక ఆయనని కూరలో కరివేపాకులా తీసి పారేశారు.
http://parnashaala.blogspot.com/2008/11/blog-post_16.html
తమిళజాతీయవాద స్ఫూర్తితో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మొదలైన ద్రవిడ/తమిళ ఉద్యమం అగ్రకుల ఆధిపత్యానికి సవాలుగా జరిగినా, బ్రాహ్మణేతర కులాలు దళిత అజెండాని ఈ పోరాటంలో భాగం చెయ్యక దళిత ఉనికిని మరుగుపరిచారని దళితమేధావుల వాదన. దీంతో సామాజిక, ఆర్థిక,రాజకీయ పరంగా దళితులు వెనక్కునెట్టబడి, ఇప్పటికీ (కనీస) మానవహక్కులకోసం నిత్యజీవన పోరాడటం సాగిస్తున్నారు.తమిళ అస్థిత్వసాధనలో, హిందీ hegemony కి వ్యతిరేకంగా తమిళసంస్కృతి పునర్జీవనం జరిగినా, అందులోనూ దళితులకు సముచిత స్థానం లభించలేదు. ఇదే నియో-అగ్రకులభావజాలం ఒకవైపు రాజకీయ వ్యవస్థలో ప్రతిఫలిస్తే, మరోవైపు అధికారవ్యవస్థ నిర్మాణానికి ఇదే మూలంకావడంతో పరిస్థితి విషమించింది. ఒకవైపు సమాజం, మరో వైపు ప్రభుత దళితవ్యతిరేక భావజాలానికి ఆధిపత్యం వహిస్తే, ఒకమూలకు త్రోయబడ్డ దళితులు ప్రతిఘటించడంతప్ప మరేమీ చెయ్యలేని నిస్సహాయులయ్యారు. ఈ నిస్సహాయతలోని ఉక్రోషం ఒకవైపు అడుగడుగునా తక్కువచెస్తున్న అగ్రకులాలపై కోపం మరోవైపు, ఇవన్నీ చూస్తూకూడా నిమ్మకునీరెత్తినట్లుండే ప్రభుత్వం,రాజకీయవ్యవస్థపై తిరుగుబాటు ధోరణి ఒకవైపూ ఏకమై ఈ ఘర్షణలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం జరిగిన ఘటనకు మూలం కాలేజి పేరులోని ‘అంబేద్కర్’ పేరుతొలగించి దేవర్ కులస్థులు ఒక కరపత్రాన్ని పంచడం. దళిత ఆత్మగౌరవానికీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుకీ విడదీయరాని సంబంధం ఉందని తెలిసీ ఈ పని చెయ్యడం దేవర్ కులస్థుల అహంకారానికి ప్రతీకైతే, హింసకుపూనుకోవడం పల్లవర్ కులస్తుల పోరాటస్ఫూర్తిలోని లోపాలను ఎత్తిచూపుతుంది. ఈ రెండు సామాజిక పార్శ్వాలకూ వారికారణాలు వారికుంటే, ఉద్రిక్త పరిస్థితి తెలిసీ ముందస్తుజాగ్రత్తలు తీసుకోని కాలేజీ యాజమాన్యం(ప్రిన్సిపాల్), ఘర్షణ సమయంలో అక్కడుండీ చోద్యం చూసిన పోలీసుల పాత్రమాత్రం సిగ్గుపడేలాగా ఉంది. ఇలాంటి ఘర్షణలకు ఊతమచ్చి తమ రాజకీయ పబ్బంగడుపుకునే రాజకీయ పార్టీల తీరు అత్యంతహేయం.

Anonymous said...

సాంబార్ సాధం నేను రాసిన ఒక కామెంట్ ప్రచూరించ లేదు. వారికి తెలుగు నాట హేతువాద ఉద్యమం దాని ప్రభావం, వైఫల్యాలను గురించి రాశాను. తమిళనాడు లో లాగా ఇక్కడ ఆ ఉద్యమాలను ప్రజలు తిరస్కరించారని. ఆ ఉద్యమం ఇపూడు కొన ఊపిరితో బ్లాగులో కొనసాగుతున్నాదని. కావాలంటే నా లోకం blog గన్నయ్య గారె వారి బ్లాగులో ఈ ఉద్యమానికి ఇప్పుడు ప్రజలనుంచి తగిన మద్దతు లభించటం లేదని రాసుకొన్నారనిచెప్పాను. ఈ ఉద్యమం లో నాకు తెలిసి ఒక సభ్యుడు ఉన్నారు అది గన్నయ్య గారి అనుంగు మిత్రుడు చిలకల బి. రావు. మిగతా ఒకరో ఇద్దరో టి.వి. కేంద్రాలలో నిలయ విద్వాంసుల్లా పని చేస్తున్నారు. అదే కాక ఆ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వారి అబ్బాయే త్రిపురనేని గోపిచంద్ హిందూ పీలాసఫి వైపు ( అరభిందో ) వైపు మొగ్గు చూపాడు అని చెప్పటం జరిగింది.

Anonymous said...

/Take the case of Murugu,/

No! yaak..thoo murugu. What a nasty name for a blog! Who is that, anyway?

/Do you back yourself that his angst is on hindusim and castes but not against particular caste(brahmin)?/

murugu(stink) X fragrance(of wisdom) - What is wrong in that? That is quite natural! So, I agree with the murugu's opinions. :P :))

There are few murugu-blogs here, craving for some comments.

Anonymous said...

మురుగు Titan Arumలా వుండక, పారిజాతపుష్పంలా గుభాళించాలా?! ఏమిటో మీ ఆరాటం! :)) అందరూ పారిజాతాలైతే మరి తెట్టుకట్టిన మురుగులేం కావాలి? ప్రకృతిలో 'తమదైన ప్రత్యేక స్థానం' గుర్తింపు పోగొట్టుకోవాలా?

Enjoy... :) http://en.wikipedia.org/wiki/Titan_arum

Anonymous said...

*ఇదేవిటయ్యా? అహా! ఇదేవిటీ? ఇష్టం ఉన్నవాళ్ళు వచ్చి పాల్గొంటారు, ఇష్టం లేని వాళ్ళు రారు. అందులో వేలెత్తి చూపాల్సిన పని ఏవుందీ?*
ఆర్యా! మీరు ఒకసారి బ్లాగులలో చర్చను గమనిస్తె చర్చలలో పాల్గొన్న వారే పాల్గొంట్టుంటారు. కొన్ని రోజులకది వ్యక్తిగత వాదన గా మారుతున్నట్లు అనిపిస్తుంది. ఇక నేను చెప్పిన వివిధ రకాల వ్యక్తులలో సమయం వచ్చినప్పుడు ప్రతి వొక్కరు సమాజం లో మార్పులను చూసి ఇలా అయిపోతున్నాది అలా అయిపోతున్నాది అని వ్యాసాలు రాసేవారే. కనీసం ఇటువంటివారు వారి అభిప్రాయాలు పంచుకోవలసిన బాధ్యత ఉంట్టుందని నేను అనుకోంటాను. ఇక్కడ రాసే వారందరికి అంతో ఇంతో పఠనాసక్తి ఉన్నవారు కనుక ఇటువంటి సబ్జేక్ట్స్ పైన ఆసక్తి పెంచుకోవాలి కదా!

Anonymous said...

పై అజ్ఞాత "తెలుగు నాట హేతువాద ఉద్యమం, త్రిపురనేని" అంటే నాకు కొన్ని మరుగునపడి, తొక్కిపెట్టబడిన వాస్తవాలు గుర్తుకువచ్చి ఇక్కడ రాస్తున్నా.

కత్తిగారు హిందూద్వేషి అని తెగచించుకుంటా౦ కానీ ఆయన చెప్పిన "తెలుగు బ్రాహ్మల అణచివేతకు కమ్మల కుతంత్రాన్ని( అదే కమ్మ మోడల్)" కాదంటే ఎలా?

అది పెరియార్ కాలం, తమిళనాట బ్రాహ్మణుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ, వారిని అణచివేస్తున్న కాలం. బ్రాహ్మలు యూదుల వలె తమ ఆచారవ్యవహారాలు బహిర్గతం కాకుండా అనగా బ్రాహ్మడని తెలియకుండా బిక్కుబిక్కుమని బతుకుతున్న రోజులవి. ఇక్కడ బ్రాహ్మల అణచివేత అనే పథకం సఫలీకృతం కావడంతో దాన్ని తెలుగునాట అమలుచేయడానికి రంగం సిద్దంచేశారు ఓ కుల పెద్దమనుషులు. అయితే ఇక్కడతేడా ఏంటంటే తమిళనాట అన్నికులాలు ఏకమై అణచివేతకు బాధ్యులు కాగా, తెలుగునాట కేవలం తమ కులం అందలం ఎక్కడానికి, కారణం లేకుండా సమిష్టికృషి ద్వారా బ్రాహ్మల్ని అణిచేసారు..ఇది చాలా దురదృష్టకరం. తమిళనాట మొదలియార్నె ఇక్కడి కమ్మగా భావిస్తారు.

మరో దరిద్రం ఏమిటంటే ఈ కులగజ్జికి హేతువాదం అనే పేరు పెట్టి మరీ అణగదొక్కడం.
అక్కడి పెరియారు స్పూర్తి(?)తో అదే కుతంత్రాన్ని ఇక్కడ అమలుచేయడంలో ప్రధానపాత్ర పోషించింది హేతువాది "త్రిపురనేని రామస్వామిచౌదరి".

ఒక్కసారి ఈయన హైందవపురాణాలకి వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు "సూతపురాణం, శంబూకవధ. మో||" చదవండి. కత్తిగారు రాసే ద్వేషం దీనికన్నా ఎన్నోరెట్లు తక్కువ. అప్పట్లో "శంబూకవధ" ఒక సంచలనం. రామాయణంలో లేని కథని సృష్టించి బ్రాహ్మలకి, దళితులకి మద్య చిచ్చు రేపి తమ కుల పబ్బం గడుపుకునేవైనం. దీన్ని అప్పటి పెద్దలెవరు గర్హించలేదు ఎందుకంటే ఇది హేతువాదం మాటున సాగింది. కానీ దానికి మూల౦ ఒక కులం ఉంది అని ఎవరూ తెలుసుకోలేకపోయారు. "మతం, మతాచారాల్ని వదిలేయ్, కులాన్ని మటుకు కలిసికట్టుగా ఉండేదానికి ఉపయోగించుకుందాం" అనే నానుడి త్రిపురనేని తో మొదలయి, అది నిరాటంకముగా సాగింది. అప్పుడు వచ్చిందే కత్తి గారు ఉదహరించిన "కమ్మ మోడల్". ఈ మోడల్లో ఉన్న నిజం దాని మాటున ఉన్న కుతంత్రం తెలియని బ్రాహ్మణులు దాని దెబ్బకి కకావికలైపోయారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ భౌతికదాడులు లేవు, కానీ కులపు కలిసికట్టుతనం ఉంది పక్క కులాల్ని తమ స్వార్థం కోసం ఎగదోసే నైజం ఉంది. ఇది చాపకింది నీరులా ప్రవిహించింది. ఫలితంగా, బ్రాహ్మలు భూములు కోల్పోయారు(NTR భూసంస్కరణ), ఆస్తుల్ని పోగొట్టుకున్నారు మరియు పనిని కూడా(NTR కరణీక ఉద్వాసన). పుట్టినూరిని వదిలి బతుకుతెరువు కోసం పట్టణాలకి తరలిపోయారు. నిజానికి అంతకుముందు కులగజ్జి అనేది లేకుండా ఏంతోమంది పెద్దలు మరియు రెడ్డి గార్ల సమక్షంలో సుఖంగా ఉన్న ఆంధ్రాలో కులగజ్జి అంటూ అంకురార్పణ చేసిన ఈ "కుల" ఉద్యమమే! దీన్ని ఎవరైనా కాదనగలరా? ఇప్పటికి అదే పంధా, ఆ కులగజ్జి రేపిన త్రిపురనేని సంఘసంస్కర్త ఎలాఅయ్యాడో, ట్యాంక్బండ్ మీద విగ్రహం ఎలా పెట్టారో కొంచెం తర్కముగా ఆలోచిస్తే నిజం తన్నుకుంటూ వస్తుంది. అలాగే లోపాయికారీగా కొనసాగిన ఈ మానసికదాడులు బహిర్గతం కాకుండా అదే కులకట్టు తమ వర్గాల ద్వారా కట్టుదిట్టం చేసింది.
విజయంసాధించి అందలం ఎక్కింది.

కాబట్టి బ్రాహ్మణ బంధువులారా, ఒక్కసారి చరిత్ర తిరగేయండి వాస్తవాల్ని తెలుసుకొండి. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కాక, దీర్ఘకాలిక౦ కోసం యోచన చేయండి. ఇక్కడికొచ్చి ఇప్పుడు కులం లేదు అనేవాల్లంతా చిన్నపటినుంచి కులగజ్జి ఉగ్గి తాగారని గుర్తుపెట్టుకోండి.ఇక "లేదు" అనేది కేవల౦ పై మాట.

అలాగే కత్తిగారి కొన్ని మాటల్లో ఉన్న వాస్తవాన్ని గుర్తించండి. ఎవరు హిందూద్వేశులో ఇప్పడు చెప్పండి?

మీ రెడ్డి బంధువు.
మీకు ఈ త్రిపురనేని వాదంపై మరిన్ని వివరాలు కావాలంటే నన్ను అడగొచ్చు. అలాగే నిజానిజాలు అందరికి తెలియాలని ఈ వాఖ్య పెట్టానేగాని ఇక్కడేదో కులచిచ్చు రేపడానికిమాత్రం కాదు.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Bhãskar Rãmarãju said...

RAAMU
రావణుడు సీతని ఎన్ని సార్లు చెరిచాడూ అని ఓ మహా ప-తీవ్రత రంకె వేసింది.
ఇప్పుడు - మీరేం చేస్తారో చూడాలని ఉంది.

Anonymous said...

భాస్కర్ రామరాజు ,
మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకొంట్టున్నారు. నేను ఇక్కడ రాసింది ఇటువంటి అంశాలపై చర్చించటానికే. అంతే కాని ఆమేకి పిచ్చి వుంటే చికిత్స చేయించికోమని నేను ఇంతక్రితమే వేరొక బ్లాగులో కోరటం జరిగింది. ఆమేకి ఇతర బ్లాగుల వాళ్ళు క్షమార్పణలు చెప్పాలను కోవటం అంత వరకు వదలను అని రాయటం ఈ పిచ్చికి పరాకాష్ట్ట. బహుశా ఎవరైనా ఆమే భర్తకు,తల్లిదండృలకు తెలియ జేస్తే వారైనా చికిత్స చేయించగలరేమో. కాని పిచ్చి బాగా ఉన్న వాళ్ళ మొదటి లక్షణం తామకి పిచ్చి లేదు అని వాదించటం. ఆసుపత్రి లోని డాక్టర్ దగ్గరకి పోకుండా మోండికేస్తారు. చికిత్స చేయించుకోవ టానికి నిరాకరిస్తారు. ఇటువంటి క్లిష్ట్టమైన సమస్యలను బ్లాగులో చర్చల ద్వారా పరిష్కరించ గలమని మీరు అనుకొంట్టున్నారా?

RAAMU

Anonymous said...

పై అజ్ఞాత ఇలా పెట్టాడు.
"
ఓ కులగజ్జి రాబంధువా...
"

అజ్ఞాతా మీకు ఎక్కడో కాలినట్లుంది. బతికున్నప్పుడే పీక్కుతిన్న మీలాంటి త్రిపురనేని వారసులకన్నా
చచ్చినపీనుగునితి౦టూ వాతావరణకాలుష్యాన్ని నివారించే రాబందులు ఎంతోమిన్న. అయినా మీ కుత్సితకామెంటుకి అదే రీతిలో బదులివ్వడానికి నేను నీలా దిగజారినవాడిని కాను.

నే చెప్పినదాంట్లో అబద్దముందని నిరూపి౦చమని సవాల్ విసురుతున్నా. అలాగే అవిధంగా దూషిస్తూ రాస్తే పొయ్యేది ఏమైనా ఉంటే నీ పరువు వచ్చేది నీక్కావాల్సిన గజ్జి :)

@blog owner
పై అజ్ఞాత మాటలు ఎంతమాత్రం చర్చకి దారి తీసేవిగా లేవు. దయచేసి వాటిని డిలీట్ చేయమని మనవి.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
సాపాటు సమగతులు said...

$Ajnaata(reddy)
Thank you for sharing. Lemme go-thru. deleted the other comment!

$Other 2/1 Ajnaata(s)
Please don't try too hard to put your trash over here. If you have something to object, stick to point and give your say else please leave!. Infact, There is no use of such angst. Hope you understood!

Anonymous said...

:)

Krishna K said...
This comment has been removed by the author.
Anonymous said...

@Rajesh_G

You have not used your wisdom in blindly doing whatever that Reddybadhuvu asked. You disappointed me, I may not write in blog. That guy is promoting a person here. He need not have identified his own caste tag while talking the rubbish. He is acting Sakuni betwn the castes, I tried to nip him in bud. Anyway, may good sense prevail to you, I'll try to avoid commenting in your blog.You disappointed me, okay you may continue learn from the great comment of the Reddybandhu.

Well said Krishnaji, i am with you.

Krishna K said...

Here I am putting complete comment.
ఇక ఎటూ కులాల కుమ్ములాట మొదలెట్టారు కాబట్టి, బ్రాహ్మణుడు అయిన PV ముక్యమంత్రి అయినప్పుడు తమ కులపోడు కాలేదని, ఆయాన్ను నానా యాగీ చేసిన అతి పెద్దకులం ఏదో చెపుతారా? అంతదాకా ఎందుకు ఈ మధ్యనే ఓ పెద్దాయన్ను దింపే దాకా నిద్రపొని కులం ఎదో చెబుతారా రెడ్డి/మాదిగ బంధువు గారూ?

రాజేష్, నా వరకూ ఈ కామెంట్ కాని, రెడ్డి/మాదిగ/కేతి బంధువు కామెంట్ కాని ఈ టపా స్పూర్థి కి ఎటువంటి ప్రయోజనం కలిగించేవి కావు, ఏ కామెంట్లు ఉంచాలో, తీసివేయాలో మీ బ్లాగు మీ ఇష్టం :)

p.s. ఇంతకముందు కామెంట్ పెట్టింది నేను కాదు (ఒకవేళ మీ మెతావి తెలివితేటలతో అది నెనే అని ఇంకో చేయితిరిగిన కత అల్లుతారేమో నని ముందుగానే చెబుతున్నా, కావాలంటే సాపాటు గారిని చెక్ చేయమని చెప్పండి), నేను ఓ so called B.C. కులాన్ని చెందినవాడిని. so called అని ఎందుకన్నానంటే నా వరకు ఏ కులమూ గొప్ప కాదు, తక్కువ కాదు కాబట్టి. అదీకాక మా కులపోళ్లు తమ కులం చివర బ్రాహ్మణ పెట్టుకొంటారు కూడా కాబట్టి :)

Krishna K said...

@ above annon fyi
మీరు గురువును మించిన ఈ కేతి గాడి శిష్యుడు తో ఆడుకోవాలనుకొంటే, తన ఆ చెత్త/అసంధ్ర్భపు కామెంట్ లో చేపలవలలో నీళ్ళు పోవటన్నికి ఎన్ని కంతలు(holes) ఉండాలో అన్ని కంతలు వదిలిపెట్టాడు :)

ఇప్పటికే టపాకు సంబంధం లేని కామెంట్లు ఎక్కువ అయ్యాయి కాబట్టి వదిలేసా!!

Anonymous said...

@Blog owner
పైఅజ్ఞాత రేపిన అపోహలు మిగిలినవారికి కూడా కలగవచ్చని నేను మీముఖంగా అందరికీ సమాధానం చెబుతున్నా.
వారి అపోహలు

౧)మీ రెడ్డి బంధువేంది? ఒట్టి శ్రేయోభిలాషి కాలేవా?

ఇది బ్రాహ్మలు పడ్డబాధలు, భరిస్తున్న ద్వేషం గురించి చర్చించిన టపా. అలాంటప్పుడు ఇక్కడ వీరి బాధలని పంచుకునేవారంతా బ్రాహ్మలే అనే అపోహ ఉంటుంది. నిజానికి బ్రాహ్మలేవచ్చి చర్చించుకుంటారనేది కూడా ఈ కులంవరకు అపోహే! పైన మరో రెడ్డిఅజ్ఞాత అన్నట్లు "బ్రహ్మణానాం అనేకం" అన్నది జగద్విదితమే, ఆంధ్రలో మరీను. మరొక అపోహ రావచ్చు, ఇక్కడ కలిసికట్టు అనేది పక్కోల్లని తోక్కడానికో, ఇంకో దానికో కాదు. తమపై వస్తున్నా అభియోగాల్లో ఉన్న అవాస్తావాన్ని చీల్చి చెండాడానికి, పేదరికంలో మగ్గుతున్న తమవారిని పైకి తీసుకురావడానికి ఈ కలిసికట్టు అని నా అభిప్రాయం. దానికి మా సాయం ఎల్లప్పుడూ ఉంటుంది.

ఇక ఇంతకు ముందు చెప్పినట్లుగా బ్రాహ్మలే రాస్తారనే అపోహ కాస్తో కూస్తో ఉంటుంది కాబట్టి నేను ఏ వర్గానికి చెందినవాడిని అని చెప్పా. నిజానికి ఇలా చెప్పి బాధని పంచుకోవడంవల్ల "ఇంట్లోవాడు సాయం చేయనప్పుడు బయటివాడు ఎవరో వచ్చి సాయం చేస్తే ఎంతఆనందం కలుగుతుందో" ఆ ఆనందం కోసమే ఇక్కడ నా కులాన్ని ఉదాహరించా. ఒకవేళ అది తప్పైతే పైన కృష్ణ గారు తనేమీటో పి.స్ పెట్టి మరీ చెప్పారు. దాని భావమేమి? అదీ కులగజ్జేనా?

ఇక బంధువు అనడానికి కారణం ఉంది.
నా వాఖ్యలో,జీవితంలో కూడా మేము బ్రాహ్మణ బందువులు అని పిలుస్తాం. అదే బందుత్వంతో రెడ్డిబంధువు అని చెప్పా! ఇందులో తప్పేమైనా ఉందా, మనిషికిమనిషి దగ్గరవడం తప్ప!

౨)పనిలేనపుడు కామెడీ థియరీలు చదవాలనిపిస్తే కబురెడతాము, మీ ఐడి వదలి వెళ్ళండి.

పక్కవారి బాధలు, అణచివేతలు మీకు కామెడీ థియరీలు అనిపిస్తుందంటే జాలేస్తుంది. మీ కులదురహంకారం, ఇతరకులాల మద్య చిచ్చుపెట్టి గోక్కొనే గజ్జితనం మరోసారి రుజువుచేస్తున్నారు. మంచిది. తెలియనివాల్లు తెలుసుకుంటారు. కచ్చితంగా ఆ గజ్జితగ్గాలంటే నన్ను కలవాలి. అందుకు మీరు అడిగినట్లు నా ఐడి ఇస్తున్నా! మీతో కేవలం చర్చకోసమే నాసమయాన్ని వెచ్చించి ఈ కొత్తఐడి తయారు చేసా. మంచిమాటలకి ఉపయోగించుతారని భావిస్తున్నా.

reddyrajeev@yahoo.com

మీకు మంచి కలుగుగాక!

Anonymous said...

@కృష్ణ

మీరు ఈ టపాలో పెట్టిన వాఖ్యలన్నీ చదివా. కొన్నివాఖ్యలు మీ మూర్ఖత్వాన్ని, తెలివితక్కువ ఆలోచనాతనాన్ని తెలియజేస్తున్నాయి. అన్ని కులాల్లో బాధలు, ద్వేషాలు ఉంటాయి అన్నారు కానీ అక్కడ ఉండే ద్వేషానికి, తరతరాలుగా అకారణంగా అనుభవిస్తున్న ద్వేషాన్ని, దాని కారణాలు వివరించిచెప్పిన ఈటపాలోని "బ్రాహ్మణ ద్వేషానికి" మధ్య తేడాతెలుసుకోలేని మూర్ఖత్వం మీది.
మీ "ఆ" కామెంటుని బ్లాగ్ఓనర్ ఖండించకపోవడం బాధాకరం.(బ్లాగ్ ఓనర్: ఖండించకపోవడంలో ఏమైనా సొంతలాభం ఉంటే చెప్పండి, నే వెంటనే వాఖ్యలు పెట్టడం మానేస్తా!)



౧)ఇక ఎటూ కులాల కుమ్ములాట మొదలెట్టారు

ఇలా అనుకోవడం మీ అవగాహనారాహిత్యం. ఈ టపాలో ఇతరవర్గమతాల అణచివేతలు అలాగే బ్రాహ్మణ ద్వేషం ఎలా ఉత్పన్నమయి, ఇంకా సాగుతూఉందో చెప్పింది. కానీ అందులో అత్యన్తహేయమైన ఘట్టం, ముఖమైనదీ అదీ ఆంధ్రలో జరిగినది టపా మరిచింది. ఆ త్రిపురనేని ఘట్టం తర్వాత ఆంధ్రలో బ్రాహ్మల పరిస్థితి ఎంతగా దిగజారింది అనేది చరిత్ర ఎలామరువగలదు? నేటికీ కొంతమంది దళితులు ఆ శంభూకవధ గాలి కథని నమ్మి బ్రాహ్మణులని ద్వేశిస్తున్నారంటే కారణమెవరు? ఈ కథవెనుక కేవలం నాస్తికం ఉంటే మరో రంగనాయకమ్మ విషవ్రుక్షం అయ్యి ఎవరూ పట్టించుకోపోడురు. కానీ దాని వెనకాల "నా కులం పక్కకులాల్ని తొక్కిపైకి" రావాలి అనే పిడివాద సిద్దాంత౦ఉంది. ఆ సిద్దాంతం ప్రకారం బ్రాహ్మణులని ద్వేశిన్చబడడానికి దళితుల్ని వాడుకోటానికి నాస్తిక మాటున ప్రవేశబెట్టినవే "అవి" కదా!
దాన్ని నేను వివరించి చెప్పాను. మీకు చేవఉంటే అది తప్పని రుజువు చెయ్యండి. పైనటపాలో చెప్పిన అన్ని నిజాలని నమ్మిన మీకు నే చెప్పిన నిజం వికటిన్చిందా?
ఇక మీరు దాన్ని "కులాల కుమ్ములాట" అంటే కేవలం ఆ వర్గాన్ని, వారి దమననీతిని బలపరచడమే. ఇంకెందుకీ చర్చలు, చరిత్రని మూసేద్దాం. ఒకరు చేసిన అక్రుత్యాలకి మరొకరిని బలిచేసే ఆటవికసమాజాన్ని ఇంకా సాగానిద్దాం. రండి!

౨)బ్రాహ్మణుడు అయిన PV ముక్యమంత్రి అయినప్పుడు తమ కులపోడు కాలేదని

మళ్ళీ మీ అవగాహనారాహిత్యాన్ని చూపారు. నా మొదటి వాఖ్య ఈ టపాలో చెప్పిన ద్వేషానికి కారణాల్లో ఒకటిగా, ప్రముఖమైనదిగా చెప్పా. మీ వాఖ్యలో, ఇక్కడ ఉదాహరించిన PV ఉదంత౦ నిజమై అందులో ద్వేషమేదయినా ఉండివుంటే అది కేవలం సహజంగా ఉండే వృత్తి పోటీ అని నే భావిస్తున్నా(బ్లాగ్ ఓనర్:మీరు నాతొ ఇక్కడ ఏకీభవిస్తారని భావిస్తున్నా)
.కాదు "కులం" అని మీరు రుజువుచేయగలిగితే వారు నావారైనా ద్వేశిచ్డానికి వెనుకాడను.
ఇక మీరు చెప్పినటువంటి చెడుఉదాహరణలు ఆ వర్గంచేసినవి నేను వేలల్లో చెబుతా. అట్లే మేం బ్రాహ్మలకి చేసిన మంచి కూడా వేలల్లో చూపిస్తా, మీరు కనీసం పదుల్లో చూపించగలరా? ఎందుకీ అనవసర ఆదుర్దా? నిజాన్ని రూపు మాపడానికా?

౨)రాజేష్, నా వరకూ ఈ కామెంట్ ఈ టపా స్పూర్థి కి ఎటువంటి ప్రయోజనం కలిగించేవి కావు,

నిజానికి మీరీ టపాలో పెట్టిన వాఖ్యలు ఎంతమాత్రం టపాకి స్పూర్తినేచ్చివి కావు, అనవసరచర్చకి దారితీసేవి లేదా చర్చని సమాధి చేసివి మాత్రమే!

అదే రాజేష్ ని నేనూ అడుగుతున్నా, మీ వాఖ్యలు ఇంకా ఉంచడం ఎంతవరకు సబబు అని? చెప్పండి రాజేష్?

కత్తిగారు, మీరు కనీసం ఇప్పటికైనా స్పందించగలరా? ఇక్క్దడకాకపోతే మీరో టపాపెట్టి నిజాలు చెప్పగలరు.

@బ్లాగ్ఓనర్
నేను పైన పెట్టిన వాఖ్యలు కేవల౦ నిజంగా జరిగినవి, ధనమదబలంతో తొక్కిపెట్టిన వాస్తవాలు నలుగురూ తెలుసుకోవాలని పెట్టాను. నిజానికి ఇలా రాయగానే అవతలివర్గంవారి మీదకి ఇటువారు ఏదో కత్తులు, కటార్లు దూస్తారని అనుకునే౦త అపోహలో, ఆటవికసమాజంలో మనం(నేను)లేము అని నా భావాన. ఎవరైనా ఉంటే కొద్దిగా మేల్కొండి. నిజం ఎప్పటికైనా బయటపడకపోదు!

Anonymous said...

(ఎవరైనా ఉంటే కొద్దిగా మేల్కొండి.)

మీరు పడుకోనిస్తేగా మేలుకునేందుకు, ఒకటే జోరీగలా రొద.

బ్లాగ్ ఓనరు బిజీ, పక్క బ్లాగుల్లో వున్నాడు, చూశావుగా. తరవాత రా. ఇప్పటికి ఆళ్ళని ఒగ్గేయ్. నీవు అసలైన నాస్తికరెడ్డిబందువే ఐతే వెళ్ళి ప్రవీన్ అన్యాను ఒప్పించు, ఆయన ఆ తుప్పు కత్తికన్నా చాలా నయం, క్రీమీలేయర్ విషయంలో లాజికల్గా ఆలోచిస్తాడు.

Krishna K said...

@ రెడ్డి/మాదిగ/కేతి శిష్యా బంధువూ,

ముందుగా మీ రెప్లై కి :)
అవగాహనారాహిత్యమా, సరే అదేదో చూద్దము.
1. హేమిటేమిటి, "తమిళనాట మొదలియార్నె ఇక్కడి కమ్మగా భావిస్తారా?" పెరియారు మొదిలియారు కులస్తుడా? మొదిలియారు లు అంటే తమిళనాట కమ్మ వాళ్లా? బలిజ కులస్తుడుని కమ్మ కులంలో కలిపిన మీ సృజనాత్మతకు జేజేలు. గురువును మించిన మేతావి లాగానే ఉన్నారు :)
2. శంబూక వధ చదివేసి "మాత్రమే" దళితులందరూ బ్రాహ్మలను ద్వేషిస్తున్నారా? ద్వేషించాలనుకొంటే సంబూకవధ ఏమి ఖర్మ "కత్తివ్యధో" , "చచ్చిన దేముడి వ్యధో" కూడా చదివో, లేక ఏ "పంచే కయిలయ్య" కంపో, లేక (తోలు)మంద క్రిష్ణ లాంటి వాళ్ల మాటలు వినో కూడా, దిష్టిబొమ్మలకు కులాలు అంటకట్టినట్లు ద్వేషించవచ్చు.

3. ఇంకో జోకాతి జోకు, Ntr భూసంస్కరణలు అమలు చేసాడా? ఏమయినా "పచ్చదేశం" వాళ్ల మీటింగులకు వెళ్ళి వచ్చారా? భూసంస్కరణలు అమలు చేసింది PV తాను ముఖ్యమంత్రి గా ఉన్న కొద్ది కాలంలొ!! దానిని కూడా NTR ఖాతాలో వెసేస్తున్నారా, కాంగీ నీరు బానే వంట పట్టినట్లుంది :) సరే మీ ఊహే నిజమనుకొన్నా, 1983,84 తర్వాత అవి ఏమయినా అమలు చేసినా భారీగా నష్టపోయేది వ్యవసాయాధారిత కులల్లౌ (రెడ్లు, కమ్మ, కాపు, వెలమ గట్ర), బ్రాహ్మలు ఎందుకు అవుతారు? అప్పటికే పెద్ద కమతాలు వారు వదిలేసారు అని తెలియదా? లేక తమ గురువు గారి మేతావి తనమా? కొంపదీసి మీరూ HCU special బ్యాచ్చు కాదు కదూ !!

4. NTR కరణీకాలే కాదు, మునసుబు గిరీలు కూడా రద్దు చేసాడు. ప్యూడలు వ్యవస్తకు కొనసాగింపుగా మిగిలిన వంశపారంపర్యం గా పెత్తనం తద్వారా తమకు నచ్చని వారి పై పెత్తనం చేసే ఆ వ్యవస్తను మీరు సమర్ధిస్తున్నారా అభ్యుదయ మేతావీ? లేక NTR కేవలం కుల ద్వేషం తో అవి రద్దు చేసాడని మీరు భావిస్తే, మునసుబు గిరీలు పోయిన వాళ్లలో ఆయన కులపోళ్లు లేరా? 1989 ఎన్నికలలో దాదాపు అన్ని కులాల మునసుబులూ (ఆయన కులపోళ్లు తో సహా) ntr కు వ్యతిరేకం గా పని చేయలేదా?

Krishna K said...

"ధనమద బలమా" అది ఈ మద్య కాలం లో లేనిది ఎవరికి? గట్టి గా చెప్పలంటే ప్రత్యక్షంగా ప్రస్తుత కాలంలో చూస్తున్నది ఎవరికి? PV ముక్య మంత్రి గా ఉన్నప్పుడు, పెద్దాయన మీద కేవలం వృత్తి ద్వేషమా? అంటే రాజకీయాలు అనే వృత్తి కేవలం ఓ కులాని కి మాత్రమే చెందాలా? లేక కాసు దగ్గరనుండి చెన్నా వరకు ఉన్న కామనాలిటీ ఎదో చెబుతారా? చూసుకొంటే ప్రతి వాడి ము--- క్రింద ఉండేది నలుపే, కాకపోతే అది వాళ్ళ వాళ్లకు తెలియదు అంతే :)

మీరు మీ కులం చెబితే (అవసరం) లేకపోయినా అది కులగజ్జి కాదా? వేరే వాళ్లు ఎటూ అలవాటయిన మేతావి తెలివితేటలతో బురద జల్లుతారు కాబట్టి చెబితే అది తమరే మొదలెట్టినా, అది కులగజ్జా? నిజమేనండి, మీరు మాత్రం కేతి గారికి ప్రధం శిష్యులుగా ఉండాల్సినవారే!!

ఇక రాజేష్ ను కామెంట్ తీసేయమని బతిమాలుకోవటం మొదలెట్టవచ్చు, షురూ చేయండి మేతావి గారి శిష్యుడు గారు :)

Anonymous said...

@కృష్ణ

౧)అవగాహనారాహిత్యమా, సరే అదేదో చూద్దము.

బాగా చూపించారు మీరే౦టో :). అవగాహనారాహిత్యమే కాదు, ఆలోచనాశూన్యత, అసంధర్భోచితం కూడా మిమ్మల్ని ఆవరించినట్లుంది. మీకేదో కొద్దిగా అన్నా సామాజిక అవగాహన ఉంటుంది అనుకుని రిప్లయ్ ఇచ్చా. కానీ మీవిషయంలో నాఅంచనా తప్పుకాదని మళ్ళీ నిరూపించారు.

1)హేమిటేమిటి, "తమిళనాట మొదలియార్నె...

పెరియారు మొదలియారని నే చెప్పలేదు. మరి చెప్పానని అంటున్నారంటే అది తమరి అద్భుతమైన అవగాహనాశక్తికి నిదర్సనం. నే చెప్పింది పెరియారు మొదలుపెట్టిన బ్రాహ్మణవిద్వేషాన్ని అక్కడి మొదలియార్లు తమ స్వార్థానికి దళితులని వాడుకుని బ్రాహ్మల్ని ఎలా అణగదొక్కారో అదేవిధంగా ఇక్కడ ఆంధ్రాలో కమ్మలు చేసారు అని చెప్పడం నా ఉద్దేశ్యం. అంటే బలమైన సామాజికవర్గం వారిగా వారిరువురు ఒక్కరే అని! "తెలుగుని ఇటాలియన్ అఫ్ ద ఈస్ట్" అంటే తెలుగు ఇటాలియన్లో కలిసిపోద్దా అనే అంతవెర్రివాళ్ళున్నారని మీరు నిరూపించారు. అలా కలిపిన "మీ సృజనాత్మతకు జేజేలు "
2.శంబూక వధ చదివేసి "మాత్రమే"....
మీ తోలుమందం బుర్ర గట్టిగా దున్నపోతు ముట్టెకేసి రుద్దండి. ఇక్కడ నే చెప్పింది
"
ఆరోజుల్లో దళితుల్ని,ఇతరనిమ్న వర్గాలని రెచ్చగొట్టడానికి ఈ శంభూకవధ అనే వృత్తాంతాన్ని చొప్పించి బ్రాహ్మణ విద్వేషాన్ని ఎగదోసారు. తాము మాత్రం చక్కగా అందలం ఎక్కారు. అప్పుడు పెట్టిన అగ్గి ఇంకా రగులుతూనే ఉంది. మీకు ఉన్నవిషయాన్ని సందర్భోచితంగా మాట్లాడే జ్ఞానం ఉన్నట్లులేదు.
"
3. Ntr భూసంస్కరణలు అమలు చేసాడా?..
అది పచ్చినిజం. అప్పటి బ్రాహ్మలకి జీవనాధారభూతమైన వాటిలో కొద్దిగా ఘనమైనవి రెండు. ఒకటి భూమి కలిగిఉండటం. రెండు కరణీకం చేయడం. బ్రాహ్మల్ని ఆర్థికంగా అణచివేయాలంటే ఇవి రెండూ వారికున్దకూడదు అనే కుతంత్రపు దూరాలోచన వచ్చింది. అప్పుడు వచ్చిందే ఈ కుసంస్కరణలు. ఆ సమయంలో తమకున్న భూముల్లో తాము చేసుకోగా మిగిలినవి కౌలుకి ఇచ్చ్చి వాటిమీద ఆధారపడి జీవిస్తున్న బ్రాహ్ననులకి ఇది నిజంగా దుర్వార్తలాంటిది. కానీ వారు ఇది కుసంస్కరణ అని తెలియక నిజాయితీ పరుల్లాగా తమకున్నఎక్కువ భూములని అప్పగించారు. నిజానికి సంస్కరణల ప్రకారమైతే ఆ భూములు కొద్ది భూమి కూడాలేని నిరుపెదలకేల్లాలి. అయితే "రాజు మనవాడవ్వాలేగానీ.." అన్నచందాన ఆ భూములన్నీ తమకులానికి వందల లేక్కన అంటకట్టిన వైనం ఎవరికీతెలియనిది. నే చెప్పే ఈ ముక్కలన్నీ కృష్ణాజిల్లాకి(ముఖ్యంగా)వెళ్లి ఆ బాధలో మునిగితేలిన ఏ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి అడిగినా సవివరాలతో సహా చెప్తారు. మనం కన్నీరుమున్నీరు అవాల్సిందే!

4. NTR కరణీకాలే..
రెండు కళ్ళు ఉన్నవాడికి ఒక కన్నుపోయినా ఏదోరకంగా బతకగలదు. కానీ ఒకకన్ను మాత్రమే ఉండి అది కూడా పోయినోడి పరిస్తితి ఏంటి? అదే వచ్చింది ఇక్కడ. ముందు చెప్పినట్లు బ్రాహ్మలకి ఆధారంగా జీవనానికి ఉండేవి కొన్ని మాత్రమే. మిగ్లినవి వారు చేయలేరు. అప్పటికే భూమిపోయి అసలు కుతంత్రం తెలుసుకుని బాధల్లో ఉన్న బ్రహ్మ్మలమీద కరణీక ఉద్వాసన ప్రకటించాడు, మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు అల్లల్లాడిపోయారు. కానీ వారు తమ కర్మ ఇది అని పట్టణాలకేసిసాగారు. ఇదే అదనుకోసం ఎదురుచూస్తున్న వర్గం వారి ఆస్తుల్ని, భూముల్ని ఆక్రమిన్చింది. అయితే అప్పుడే బ్రాహ్మలు ఎదురుతిరిగి ఉంటే? కనీసం ఇప్పుడయినా తమకు జరుగుతున్న/ఎదురవుతున్న అన్యాయాలకి కలిసికట్టుగా అడ్డుకట్టవేయాలని వారి బంధువుగా నేను కోరుతున్నా. పైన రాజేష్ చెప్పినట్లు అతిమంచితాన౦ కచ్చితంగా చేతకానితనమే, అదే మూర్ఖత్వం కూడా!

౪)..మిగిలిన వంశపారంపర్యం గా పెత్తనం తద్వారా తమకు నచ్చని వారి పై పెత్తనం చేసే ఆ..

అంటే పెత్తందారీ వ్యవస్తని నిర్మూలించడానికి అలా చేస్సారా? వాహ్వా! మరి ఏమొచ్చింది? పెత్తందారీ వ్యవస్థ పోయిందా? పోనీ వంశపారంపర్యం అన్నా పోయిందా?
ఎందుకండీ మసిపూస్తారు. ఆ మసిమీద పెట్రోలు పోసి మరీ తుడిచేసే సమయం వచ్చింది. జాగ్రత్త.. మీమోహ౦ మ౦డొచ్చు.. అదే ఆ మంటకి.

Anonymous said...

@కృష్ణ

౧)"ధనమద బలమా" అది ఈ మద్య కాలం లో లేనిది ఎవరికి?...

లేదు అని ఎవరూ అనలేదు. అవి ఉపయోగించి నిజాలు బయటికిరాకుండా అనగా అందరికి తెలీకుండా తోక్కేసారు. ఇవి జరిగిన రోజుల్లో వార్తలు తెలియడానికి ఒకే ఒక్క పేపర్, అదే ఏ కులానికి అనుకూలంగా రాసేదో జగద్వితం.

౨) పెద్దాయన మీద కేవలం వృత్తి ద్వేషమా?..
అవును అని చెప్పా! మీరు కాదు అని నిరూపిస్తే వారు నావరైనా వారిని క్షమించను అని చెప్పా.

౩)ప్రతి వాడి ము--- క్రింద ఉండేది నలుపే, కాకపోతే అది వాళ్ళ వాళ్లకు తెలియదు అంతే :)

మీలాటి కబోదులు అది కూడా చూడలేరు :).

౪)మీరు మీ కులం చెబితే (అవసరం) లేకపోయినా అది కులగజ్జి..
నేను మీది కులగజ్జి అనలేదు. ఆ అజ్ఞాత అడిగినదాన్నిబట్టి మీ వ్యాఖని ఉదాహరించి మీకూ అదేనా అని ప్రస్ని౦చా? అంతే!

ఇక నా కులాన్ని ఎందుకు ఉదహరించానో, దాని అవసరమేమిటో ముందు వాఖ్యలో వివరించా. అది చాలు అనుకుంటా!

౩)ఇక రాజేష్ ను కామెంట్ తీసేయమని..

కచ్చితంగా చెబుతా..

@బ్లాగ్ ఓనర్
Please shrug off the imbalanced and unfitting comments. But If you inclined and keen to comment count, Please let me know, I do leave.

I had already quested for that twice, see no action taken.
This is my last request and would see what happen then decide what I should do.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
సాపాటు సమగతులు said...

@అజ్ఞాత గారు

Sorry for delay reply. I been mucked up with other provocative issues. Okay, let me clear what my stand!

First of all, I been elated that someone, you, sharing the information in very appropriate way. Please go on.

#(బ్లాగ్ ఓనర్: ఖండించకపోవడంలో ఏమైనా సొంతలాభం ఉంటే చెప్పండి, నే వెంటనే వాఖ్యలు పెట్టడం మానేస్తా!)

Please never take wrong hunch :).
I had already taken your request into account and deleted other insane comment. Hope you see in that way!
I observed Krishna's comment(s) and kept them undeleted as no offence found but agreed couple of them were inappropriate then which been agreed by himself. so no worries :).

Hope I had given you sufficed answer. Dont hesitate to shoot question out to me If you have any.

From my point of view and perspective, I endorsed to all your points, except requests to Katti, and been oblige to you. If I am not incorrect, Katti just tried to exploit the things occurred in the past. However, will put an eye on your say.

#ఇలా రాయగానే అవతలివర్గంవారి మీదకి ఇటువారు ఏదో కత్తులు, కటార్లు దూస్తారని అనుకునే౦త అపోహలో..

Well said. That gives clear sight of your intention behind commenting. Appreciated.

Anonymous said...

ద్రావిడా రెడ్డిబంధూ, కత్తి భావవైశాల్యమును, అభిజాత్య ఘనపరిమాణము సాపాటుకు వివరింపుము - 5మార్కులు.

Krishna K said...

రెడ్డి/మాదిగ/కేతి శిష్య బంధువు గారూ,
రాజేష్ intentions మీద బురద జల్లారు కాబట్టి తాను clarify చేసే వరకు ఆగాను. atleast I hope you are happy on that front
"నే చెప్పే ఈ ముక్కలన్నీ కృష్ణాజిల్లాకి(ముఖ్యంగా)వెళ్లి ఆ బాధలో మునిగితేలిన ఏ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి అడిగినా సవివరాలతో సహా చెప్తారు. మనం కన్నీరుమున్నీరు అవాల్సిందే!" లోల

ఇక మీరన్నట్లు NTR సమయములో 1984-1989 మద్దెన ఏటిమొగ దగ్గరనుండి జగ్గయ్యపేట వరకూ క్రిష్ణ జిల్లాలో ఒక్కరు అంటే ఒక్కరు బ్రహ్మణుల పొలాన్ని (ఓ పది సెంటులయినా) భూసంస్కరణ చట్టం క్రింద తీసుకొని కమ్మ వాల్లకు ఇచ్చాడు అని చూపించండి, మీకు క్షమాపణ చెప్పుతాను.
అసలు భూసంస్కరణ ceiling act పరిమితులు మీకు తెలుసా? 18+ ఎకరాల మాగాణి, 50+ ఎకరాల మెట్ట, అంత కంటే ఎక్కువ ఒక్కరి పేరు మీద పొలం ఉన్న బ్రాహ్మణులు అదీ క్రిష్ణా జిల్లాలో 1985 ప్రాంతాలలో ఉన్నారు అనుకొంటున్నారా? అసలు సీలింగ్ చట్టం వచ్చిన ఏడాది అయినా మీకు తెలుసా? ఎవరికయినా ఉన్నా అక్కడక్కడ ఒకరిద్దరికి ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేని వారు అనుకొంటున్నారా!!!

ఉంటే అవి occupy చేస్తుంటే ఆ రోజులలో ఒక్క పేపరూ అదీ 'పచ్చ" పేపరే ఉందా? దాని అండతో అణచారా? :)

ఒక్క నిజం చెప్పండి అసలు మీకు 1985 ప్రాంతాలలో వయసు ఎంత? క్రిష్నా జిల్లాలో ఏ రోజయినా ఏ గ్రామములో నయినా ఒక్కసారి అయినా మీరు ఉన్నారా?
అందుకే అన్నది HCU Back bench theory లు అని :)
ఇంతకంటే నేను చెప్పటానికి ఎమీలేదు :( బాబూ కృష్ణా జిల్లా వాళ్ళు ఇంకెవరయినా ఉంటె చెప్పండి NTR కు అంత దృశ్యం లేదని :)

Krishna K said...

ఇంకో మాట, 1984-1989 మద్దెన NTR తొండి చేసి బ్రాహ్మల పోలాలను లాక్కొని క్రిష్ణా జిల్లాలో కమ్మ వాళ్లకు ఇచ్చాడు అనుకొందాము :) మరి రాయలసీమలో ఒకప్పటి బ్రాహమల పొలాలు, తెలంగానా లో వారి పొలాలను కమ్మ వాళ్లే లాక్కొన్నరా? లెక ఆ రెండు, మూడు జిల్లాలలో మాత్రమే బలవంతం గా లాక్కొంటే, మిగతా జిల్లాలలో మిగతా వ్యవసాయ కులాలు వారు "చాలా" సామరస్యం గా "చచ్చిన దేముడి తరహాలో" తీసుకొన్నారా? లేక అసలు ఆ జిల్లాలో బ్రాహ్మణ అగ్రహారాలే లేవా? ఉంతే మిగతా అన్ని జిల్లాలలో ఇంకా పొలాలు బ్రాహణుల ఆధిపత్యం లో ఉన్నాయా?

అందుకే అన్నది మీ గురువు కు తగ్గ మాంచి శిష్యులు అన్నది!!

Anonymous said...

*ఆధిపత్యవర్గానికి అలోచననూ అండనూ వారి దమనకాండలకు ఊతమిచ్చే థియరీలనూ ఇచ్చింది బ్రాహ్మణకులమే. దానికి చరిత్ర సాక్ష్యం.*

ఆర్యా, మీరు పై వ్యాఖ్య కి అనుగుణం గా నాలుగైదు ఉదాహరణలు ఇచ్చి ఉంటే బాగుండేది. సాధ్యమైనంత వరకు బ్రహ్మణులు వారి వారి శక్తిని బట్టి తమ పరిధిలో తాము పని చేస్తూ తద్వారా సంఘానికి చేతనైనంత సేవ చేయాలని చూస్తారు. మంచి తెలివి తేటలు ఉన్నవారు రాజుకు మంత్రులుగా సలహాలిచ్చే వారు. అంతే కాని ఆ రోజులలో ఉన్న థియరీలు ఎమీటి? ఈ థియరీలు అన్ని బ్రీటీష్ వారి కాలం నుంచి ప్రరంభమైనాయి. ఊరకనే ఎర్ర పార్టిలు వారిలాగా పెద్ద పెద్ద పదాలు ఆధిపత్యవర్గం, దమన కాండ అని వాడకు. మరి బ్రహ్మణులు ఆధిపత్య వర్గానికి వత్తసు పలికే వారైతే నేపాలు లో ప్రచండ ఎవర్గానికి వత్తసు పలుకుతున్నాడు? ఇక రాష్ట్రానికి వస్తే కీ.శే. శంకరన్,కీ.శే. కన్నాభిరాన్,వరవర రావు,కీ.శే. బాలగోపాల్ లాంటి వారు ఎవర్గానికి వత్తాసు పలుకుతున్నారు? రామన్ మేగసేసే అవార్డ్ వచ్చిన దీప్ జోషి లాంటి వారు యం.ఐ.టి. లో చదివినా పల్లేల అభివృద్దికి పని చేశారు. పల్లేలో పుట్టిన ఆచార్య పంచే కొయ్యలయ్య పల్లేలకి ఎమి చేశాడు?
http://en.wikipedia.org/wiki/Deep_Joshi

SRI

సాపాటు సమగతులు said...
This comment has been removed by the author.
సాపాటు సమగతులు said...

I was deleted three crummy comments. Requesting to stop wafting of such stink and warning those commy will never get entertained here.

సాపాటు సమగతులు said...
This comment has been removed by the author.
సాపాటు సమగతులు said...

@SRI Ji

Well-phrased and thought-provoking question.

But as usual these questions always gets overlooked conveniently as per their need and even gets tagged those people doesn't belongs to that caste in question. And even raged on others who questioned that and may start abusing.

What all this menace means?
simple logic. Such clowns are habituated to see and hear only perpetrated and perpetuated myths that obviously exhibits ONLY bad side and fearing of attributing good even in dream.

Infact, Who says NO If there is something that would gives wealth just by abusing and yet no objections from the abused side?

Thus, It is the obligation of the one's, who gets abused, raising hand as a mob and thrashing retorts to such retard's who is exploiting the situations.

Make sense?

సాపాటు సమగతులు said...

$RAAMU gaaru

:)) Well said. You are absolutely correct. I agreed with your points.

$Ajnaata Ji
#కానీ ఇది ఈ టపాకి అనుబంధంగా పెట్టడం బాలేదు!...

Hmm.. Understood the witty part. You are too good :)

Anonymous said...

*ఆధిపత్యవర్గానికి అలోచననూ అండనూ ..... దానికి చరిత్ర సాక్ష్యం. ఆ స్థానం మీద పట్టును ప్రస్తుతం చాలావరకూ కోల్పోయినా*

మహేష్ గారు మీరు గమనించారో లేదో, మేము స్థానం కోల్పోయినా ప్రతి వ్యవస్థా దాని హంగును (పూర్వ వైభవం/గ్లామర్ కోల్పోయింది. విద్యనే తీసుకోండి ఒకప్పుడు బ్రాహ్మణులు ఉపాధ్యా వృత్తి లో ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది పని చేశేవారు. వారికి వచ్చేది తక్కువ జీతమైన ఎంతో క్రమశిక్షణ తో, వోపికగా తమ 58 ఏట(పదవి విరమణ సవత్సరం లో కూడా) ప్రైవేట్ క్లాసులు తీసుకొని సిలబస్ పూర్తి చేసేవారు. ఇటువంటి ఉపాధ్యాయుల వలన మిగతా వర్గాల ఉపాధ్యాలు కూడా అంకిత భావం తో పని చేయటానికి ప్రేరణ నిచ్చేవారు. వీరి సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో గణనీయం గా తగ్గింది. అదే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పనితీరు మీకు చెప్పవలసిన పని లేదు. మేజారిటి టిచర్లు సైడ్ బిజినెస్ చేసుకొనేవారే, చదువు చేప్పేవారు ఎవ్వరు లేరు.
--------------------------------------------------------------------------------------------
అదే విధంగా రాజకీయాలనే చూడు. బ్రాహ్మణ నాయకులు ఉన్నని రోజులు వారి పాలన సగటు మధ్య తరగతి మనుషులను దృష్టిలో ఉంచుకొని పాలించారు. అదే ఇప్పుడు సామాన్య ప్రజలను నిర్లక్ష్యం చేసి పాలించటమే కాకుండా, దేశ ఐక్యతను దెబ్బతీసేవిధం గా పాలించటానికి వేనుకడుగు వేయటం లేదు. ఎప్పుడు చూసినా మీరు ఆరోజులలో మమ్మల్ని అలా చేశారు ఇలా చేశారు అని మాట్లడటం కాదు. ఈ రోజులలో మీ వర్గాల నుంచి ఇంత మంది చదువుకొన్న వారువుండి కూడా ఎంత వరకు అసమానలతను, హింసను, అన్యాయాలను అరికట్ట గలిగారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. వాటి మీద మీలాటి వారు వ్యాసాలు రాయాలి . అంతే కాని దళిత వాదం, హేతువాదం, స్రీ వాదం పుస్తకాలు చదివి గతం లో జరిగిన వాటిని చదివి మీరు గతం లో జీవిచటం కాదు వర్తమానం గతం కన్నా ఘోరం గా ఉందని తెలుసు కోవాలి. మరి బ్రహ్మణులు ఆధిపత్యవర్గానికి అలోచననూ అండనూ ఇప్పుడు అందించక పోయినా, మీ వర్గాల లో ఇంతమంది చదువుకున్న వారు ఉన్న ఇన్ని ఘొరాలు జరుగుతూనే ఉన్నాయి కదా! అలాంటప్పుడు బ్రాహ్మణుల వలన మీకు అన్యాయం జరిగింది అని మాట్లాడటం చాలా పొరపాటు.
మేము స్థానం కోల్పోవటం వలన వివిధ వర్గాలలో ఉన్న మధ్య తరగతి ప్రజల కలలు కల్లలైనాయి అని మాత్రం చెప్పగలను. మిగతా వర్గాలలో ధనాని కి ఉన్న ప్రాముఖ్యత వలన పరువు పోతున్నా, సమాజం లో విలువలు పడిపోతున్నా ఒక్క నిముషం ఐనా అతమ విమర్శ చేసుకోకుండా నువ్వు అంత డబ్బు తిన్నావ్, ఆ పదవి నుంచి దిగు నేను కూర్చుంటాను, అని రోజు తగువులు వేసుకొంట్టూ పేరు ప్రఖ్యాతులు అన్నిటిని పోగొట్టుకొన్నారు. ఇటువంటి వారికి సలహాలు ఇచ్చె జాబితాలో మేము లేక పోవటం ఎంతో మంచిది. తన జీవితాంతం ఎన్నో సలహాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టిని గట్టెకించినా దేశం కొరకు పగలు రాత్రి పని చేసినా పి వి ని గుర్తించని దేశమిది. మేము ఆదర్శంగా తీసుకోవటానికి పదవి, అధికారంలేక పోయినా తనకున్న పరిధిలో నీజాయితితో దేశం కొరకు పనిచేయటానికి ఆదర్శం గా ఒక్క మగాడు సుబ్రమణ్య స్వామి చాలు మాకు. ఎవ్వరు ఎవ్వరికి సలహాలు ఇచ్చే రోజులు కావివి. అలా ఇవ్వటానికి కన్సేల్టెన్సిలు ఉన్నాయి, నిస్వార్థంగా సలహాలు ఇస్తే అలా ఇచ్చే వారి మీద అందరికన్నా ఎక్కువ అనుమానాలు వచ్చే రోజులివి.
----------------------------------
Rajesh read this article
Sri P V Narasimha Rao, Mauna Muni And Deng Tsiao Ping of India by Tripuraneni Hanuman chowdari
http://www.drthchowdary.net/index.php?option=com_content&task=view&id=579&Itemid=57

Srinivas

Anonymous said...

*ఆధిపత్యవర్గానికి అలోచననూ అండనూ ..... దానికి చరిత్ర సాక్ష్యం. ఆ స్థానం మీద పట్టును ప్రస్తుతం చాలావరకూ కోల్పోయినా*

మహేష్ గారు మీరు గమనించారో లేదో, మేము స్థానం కోల్పోయినా ప్రతి వ్యవస్థా దాని హంగును (పూర్వ వైభవం/గ్లామర్ కోల్పోయింది. విద్యనే తీసుకోండి ఒకప్పుడు బ్రాహ్మణులు ఉపాధ్యా వృత్తి లో ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది పని చేశేవారు. వారికి వచ్చేది తక్కువ జీతమైన ఎంతో క్రమశిక్షణ తో, వోపికగా తమ 58 ఏట(పదవి విరమణ సవత్సరం లో కూడా) ప్రైవేట్ క్లాసులు తీసుకొని సిలబస్ పూర్తి చేసేవారు. ఇటువంటి ఉపాధ్యాయుల వలన మిగతా వర్గాల ఉపాధ్యాలు కూడా అంకిత భావం తో పని చేయటానికి ప్రేరణ నిచ్చేవారు. వీరి సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో గణనీయం గా తగ్గింది. అదే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పనితీరు మీకు చెప్పవలసిన పని లేదు. మేజారిటి టిచర్లు సైడ్ బిజినెస్ చేసుకొనేవారే, చదువు చేప్పేవారు ఎవ్వరు లేరు.
--------------------------------------------------------------------------------------------
అదే విధంగా రాజకీయాలనే చూడు. బ్రాహ్మణ నాయకులు ఉన్నని రోజులు వారి పాలన సగటు మధ్య తరగతి మనుషులను దృష్టిలో ఉంచుకొని పాలించారు. అదే ఇప్పుడు సామాన్య ప్రజలను నిర్లక్ష్యం చేసి పాలించటమే కాకుండా, దేశ ఐక్యతను దెబ్బతీసేవిధం గా పాలించటానికి వేనుకడుగు వేయటం లేదు. ఎప్పుడు చూసినా మీరు ఆరోజులలో మమ్మల్ని అలా చేశారు ఇలా చేశారు అని మాట్లడటం కాదు. ఈ రోజులలో మీ వర్గాల నుంచి ఇంత మంది చదువుకొన్న వారువుండి కూడా ఎంత వరకు అసమానలతను, హింసను, అన్యాయాలను అరికట్ట గలిగారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. వాటి మీద మీలాటి వారు వ్యాసాలు రాయాలి . అంతే కాని దళిత వాదం, హేతువాదం, స్రీ వాదం పుస్తకాలు చదివి గతం లో జరిగిన వాటిని చదివి మీరు గతం లో జీవిచటం కాదు వర్తమానం గతం కన్నా ఘోరం గా ఉందని తెలుసు కోవాలి. మరి బ్రహ్మణులు ఆధిపత్యవర్గానికి అలోచననూ అండనూ ఇప్పుడు అందించక పోయినా, మీ వర్గాల లో ఇంతమంది చదువుకున్న వారు ఉన్న ఇన్ని ఘొరాలు జరుగుతూనే ఉన్నాయి కదా! అలాంటప్పుడు బ్రాహ్మణుల వలన మీకు అన్యాయం జరిగింది అని మాట్లాడటం చాలా పొరపాటు.
మేము స్థానం కోల్పోవటం వలన వివిధ వర్గాలలో ఉన్న మధ్య తరగతి ప్రజల కలలు కల్లలైనాయి అని మాత్రం చెప్పగలను. మిగతా వర్గాలలో ధనాని కి ఉన్న ప్రాముఖ్యత వలన పరువు పోతున్నా, సమాజం లో విలువలు పడిపోతున్నా ఒక్క నిముషం ఐనా అతమ విమర్శ చేసుకోకుండా నువ్వు అంత డబ్బు తిన్నావ్, ఆ పదవి నుంచి దిగు నేను కూర్చుంటాను, అని రోజు తగువులు వేసుకొంట్టూ పేరు ప్రఖ్యాతులు అన్నిటిని పోగొట్టుకొన్నారు. ఇటువంటి వారికి సలహాలు ఇచ్చె జాబితాలో మేము లేక పోవటం ఎంతో మంచిది. తన జీవితాంతం ఎన్నో సలహాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టిని గట్టెకించినా దేశం కొరకు పగలు రాత్రి పని చేసినా పి వి ని గుర్తించని దేశమిది. మేము ఆదర్శంగా తీసుకోవటానికి పదవి, అధికారంలేక పోయినా తనకున్న పరిధిలో నీజాయితితో దేశం కొరకు పనిచేయటానికి ఆదర్శం గా ఒక్క మగాడు సుబ్రమణ్య స్వామి చాలు మాకు. ఎవ్వరు ఎవ్వరికి సలహాలు ఇచ్చే రోజులు కావివి. అలా ఇవ్వటానికి కన్సేల్టెన్సిలు ఉన్నాయి, నిస్వార్థంగా సలహాలు ఇస్తే అలా ఇచ్చే వారి మీద అందరికన్నా ఎక్కువ అనుమానాలు వచ్చే రోజులివి.
----------------------------------
Rajesh read this article
Sri P V Narasimha Rao, Mauna Muni And Deng Tsiao Ping of India by Tripuraneni Hanuman chowdari
http://www.drthchowdary.net/index.php?option=com_content&task=view&id=579&Itemid=57

Srinivas

Anonymous said...

ఆఖరుగా ఒక మాట చరిత్రను వక్రికరించిన పుస్తకాలు చదివి బ్రహ్మణుల మీద అకారణ ద్వేషం పెంచుకొంట్టూ పగలు రాత్రి వారిని విమర్శించటమే ఒక పర్తిశ్రమగా తయారయ్యింది. ఇటువంటి పుస్తకాలు రాసే వారికి ధన సహాయం అందచేయటం ప్రభుత్వాలు చెస్తున్న తప్పు కాగా వారికి ఆచార్య పదవులిచ్చి వారిని మచ్చిక చేసుకొవటం ఇంకొక తప్పు. ఆ పుస్తకాలు వారి ఇంట్లొ వారు కూడా చదువుతారని నేను అనుకోను. సమాజంలో చదువుకొని ఉద్యోగం లేని వారు ఈ పుస్తకాలను చదివి చిన్న మార్థాండలు తయారవుతున్నారు. వీరు వారికున్న ఇటువంటి జ్ఞానికి వారిని వారు మేధావులు గా ఊహించుకొంట్టూ ఆనందిస్తూంటారని అనుకొంట్టున్నాను. నిజం గా ఆపుస్తకాలే చదివిన వారిలో మార్పు తెచ్చి ఉంటే కనీసం బి.సి. లైనా అధికారం లో కి రాష్ట్రం లో వచ్చి ఉండాలి. అది జరుగక పోగా రాజకీయాలో విఫలమైన నాయకుడు చిరంజీవి లాంటి వారు ఫూలే పోటోలు సింబాలిక్ గా ప్రతివేదిక మీద పెట్టుకొని చివరికి కాంగ్రెస్ పంచన చేరి ఫూలే లాంటి వారి పరువును తీశారు.
-----------------------------------సాహిత్యం చదవటం ద్వారా నాయకులు పుట్టరు . నాయకుడి వలన సాహిత్య సృష్టి జరుగుతుంది (ఫూలే). నాయకత్వాన్ని కేరీర్ గా చేసుకోవలను కునే వాళ్ళు పుస్తకాలు చదివి మీటీంగ్ లో పంచ్ డైలాగులు చెబుతారు.

SRINIVAS

సాపాటు సమగతులు said...

$Srinivas Ji

Going thru the link provided. Thanks for share!
I knew Sri Tripuraneni Hanuman chowdari and and him personally number of times and He is very good gentlemen and exceptional human being.

Seeing your response to Katti's comments, I have a slightly tangential question w.r.to that.
One thing what I observed, Mr.Katti always been very persistent and stands for what he studied/believed and never willing to change his opinion though truth is out based on present day-to-day situations. That is so unfortunate(to whom?)!

Should we really bother about him and to pass sensible arguments?

Aftermath of observing lot of discussions with him, I just started shrugging off his words by recollecting below Telugu proverbs :).

"
నిద్రపోతున్న వాడిని లేపోచ్చుగాని, నిద్రనటించేవాడిని ఎవరు లేపగలరు?

అలాగే

గుడ్డివాడికి చీకటిలో దీపం చూపించాలి అనుకోవడం!
"

Krishna K said...

@Srinivas, Thanks for bringing the topic back to right place.
(Hanuman Choudary ref. is really a good one. If I remember right, there is a guy with same name, he was one of the mastermind behind Maitrivanam (first IT park in Hyd) in Ameerpet whom I have met in early stages of that project. I am not sure he is the same one though)

సాపాటు సమగతులు said...

$Krishna

#mastermind behind Maitrivanam (first IT park in Hyd)...

You are absolutely correct. He is the same genious, modesty and pure religious. But he never look like that he is pioneer to Hyd IT Devolopment, hijacked by chandrabaabu though, when you see him.

Anonymous said...

@శ్రీనివాస్/రాజేష్

మీరు చెప్పింది నిజమే!

కానీ కత్తిగారు అలా అనుకోవడానికి,(లేదా మీ దృష్టిలో వాడుకోవడానికి) కారణం ఎవరు?

మీరు కారణం కాదంటారా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.
మీ మీద మీవాళ్ళే గొప్పకోసమో లేక ఇక్కడేదో సమాజం మునిగిపోతున్నట్టు ఉద్దరించాడానికో చెత్తచెత్త గ్రంధాలు రాసుకున్నారు. తమ ఇంటిగుట్టుకి కావలసినంత మాసాలాలు పూసి సమాజంలో ఉన్న అన్ని అనాచారాలకి "మావాళ్ళే ఆద్యులు, బాధ్యులు" అని నొక్కివోక్కాణిచుకున్నారు. అదిప్పుడు కావలసినవాళ్ళు అవసరమైనవిధంగా వాడుకుంటున్నారు, దండుకుంటున్నారు. చరిత్రలో ఏ సమాజవర్గం ఇంతవిహీనంగా తమనితాము వర్ణి౦చుకున్నతీరు ఎక్కడాలేదు. మరి మీరే మీగురించి అంత చక్కగా రాసుకున్నప్పుడు పక్కన మిమ్మల్ని తొక్కిపైకి రావాలనుకున కులానికి ఆ "గ్రంధాలు" అయాచితం అయ్యాయి. వాటిమీద మరింతగా పోపెట్టి, మీకు దళితులమద్య చిచ్చుపెట్టారు. ఆనాడే మీవర్గం ఏమిటీ అన్యాయం అని ఎదురుతిరిగి అవాస్తవాల్ని చీల్చిచెండాడి ఉంటే నేడు ఈ దుస్తితి వచ్చేదా? మీరే మెదలకుండా ఉంటే మీరంటే అభిమానం ఉన్నకుల౦ ఎలా వచ్చి వెన్నంటి పోరాడుతుంది?
కనీసం ఇప్పుడే౦ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోండి! మాటిమాటికి కర్మసిద్దాంతం చెప్పడం కూడా చేతకానితనమే. అసలీ కర్మసిద్దాంతం మొదలైందే చేతకానితనం వదిలిన్చుకోమని అర్జునుడికి హితవు చెప్పినపుడు.
అర్థం చేసుకోండి.

ఇంకా మీరు కత్తిది తప్పు అంటారా? మీరు ఆయన్ని మార్చనవసరంలేదు. ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి, తదనంతరం పరిస్తితులదృష్ట్యా ఆయనే మారతాడు. కాదంటారా?

రాజేష్,
"గుడ్డివాడికి చీకటిలో దీపం చూపించాలి .."

ఆ గుడ్డివాడికి గుడ్డి ఎలా వచ్చింది అన్నది తెలుసుకోండి ముందు :)

Rajeev Reddy

Bhãskar Rãmarãju said...

I was deleted ???
బాబూ చిట్టీ :(:(
ఏమైపోతావో అని భయంగా ఉంది బాబూ! చిట్టీ!!
నిన్న హార్డ్లీ అన్నావు
ఇప్పుడిది.
కండ్లనీళ్ళు కుక్కుకుంటూ
-బాసుకరు :(:(
[కండ్లు సరింగ కనిపిస్తల్లేవు]

సాపాటు సమగతులు said...

$భాస్కర్ రామరాజు gaaru

#I was deleted..

Ah.. Too much leg pulling:). If at all you feel it is wrong, then that could be grammatical mistake and can be given excuse under general usage/typo. But usage of "Hardly" at that context was a blunder and hardly excusable. I wonder how Malak ji caught that whilst mucking up with Mouli. Brilliant and Sharp :)

After all, That part of sentence pulled you here again. I am happy for that. Cheer up:)

$Rajeev Reddy Ji
Happy to see your comment and that shown your consent to my words. I am glad!

Rao S Lakkaraju said...

@శ్రీనివాస్ గారూ, రాజీవ్ రెడ్డి గారూ
చక్కటి, intellectual విశ్లేషణ. వ్రాసినందుకు థాంక్స్.

Unknown said...

vyasagartha garu chala kastapadi (sry bhadapadi) ee vyasam rasarani ardham avutundi, kani naku ardham kanidemitante,

Ipdu mana samgajam lo evaru kuda brahmanulani chinna chupu chudatamo, leda pani kattukoni dveshinchadamo, akaranamuga vedinchadamo cheyatledu kada? mari mimmalni inthaga prerepinchina anubhavalemito naku telidam ledu!

na snehitullo endaro brahmanulu, kondaru manchi vallu mari kondaru cheddavallu, idi sahajam, manchitanam kulam meeda depend avadani na uddesam.

Ikapothe brahmanulu epdu kuda rajya palana cheyakapotaniki karanam, varidi 'Bhudhi Bhalame kani Bhuja Bhalam kadu', anduke varu epdu kuda salaha darulugane satkarincha baddaru.

Anonymous said...

నేరెళ్ళ గారు

మీ కామెంటు రెడ్డొచ్చె మళ్ళే మొదలెట్టండి అన్నట్టుంది :). తప్పుగా అనుకువద్దు.
మీ ప్రశ్నలకి సమాధాన౦ కోసం దీని ముందు టపా ఒకసారి చదవండి, తర్వాత ఈ టపాని కామెంట్లతో సహా మరోసారి వివరంగా చదవండి. అప్పుడు కూడా మీకు సందేహాలు ఉంటే నేను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తా.

Rao S Lakkaraju గారు
థాంక్స్.


Rajeev Reddy

Ravitheja said...

వద్దు వద్దు అంటూనే కులాధారిత రిజర్వేషన్ల ద్వారా కులవివక్షను బ్రతికించుకుంటున్నాం అన్నది నా అభిప్రాయం. అవ్వ కావాల- బువ్వా కావాల, కేకు వుండాల-నా కడుపూ నిండాల, ఫెయిల్ అయినా నాకు కలెక్టర్/డాక్టర్/ఇంజనీర్ వుద్యోగం ఇవ్వాల( మా ముత్తాతలను మీ ముత్తాతలను అవమానించారు గాబట్టి!! :) ) దేశం ప్రపంచదేశాల్లో టాప్10లో వుండాల అన్నది జరగని పని.
-----------------------------

Well Said .

Jagadish Reddy said...

రాజేసా

Very comprehensive and amazing but painful post. The way you narrated was brilliant and touched my sensible-heart deeply.

తీరికచేసుకుని పోస్టుని, పోస్టులో జరిగిన చర్చని ఒకటికి రెండుసార్లు ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా చదివాను. నాకు తెలీని విషయాలు చాలా తెలుసుకున్నాను. తమ స్వార్ధం కోసం ఎన్ని అవాస్తవాలని అమానుషంగా బ్రాహ్మణులపైన రుద్దారో అన్నదాన్ని తెలుసుకుంటుంటే చరిత్ర కొందరి చుట్టం అన్న నానుడి వీరి వల్లనే వచ్చిందేమో అనిపించింది.

మరొక ముఖ్యవిషయం. పోస్టులో రాసింది చదివి ఫస్ట్ అవి మీ కులం ఫేస్ చేస్తున్న సమస్యలు & బాధలు అనుకున్నా. అయితే అందరి కామెంట్సుకీ రెస్పాన్స్ ఇస్తూ నువ్వు ఒక్కడివే ఒంటరిపోరాటం చేసిన తీరు చూస్తుంటే పోస్టులో రాసింది నీ సొంత సమస్య లేదా బాధగా అనిపించింది. ఫన్నీగా ఉంది. అయితే ఇది చాలా సీరియస్గా ఎంతో పెయిన్తో చెబుతున్నా. సమస్యలపై అందరూ కలిసికట్టుగా పోరాడితేనే విజయం సాధిస్తారు. ఈ సమిష్టి పోరాటతత్వం మీకులంలో లేకపొతే మీ మంచి కోరుకునే ఇతర కులబంధువులు ఎంతవరకు మద్దతు ఇవ్వగలరు?

శ్రీనివాస్,రాజీవురెడ్డి గార్ల intellectual కామెంట్స్ ఆంధ్రాలోని ప్రస్తుత సామాజికపరిస్థితులకి అర్ధం పట్టాయి. వారిద్దరికీ హాట్సాఫ్. నీ కామెంట్సు కూడా మీనింగుఫుల్ గానే ఉన్నా కొన్ని ప్లీజింగ్ మోడ్లో ఉన్నాయి. ముఖ్యంగా అప్పి-బొప్పి అనే ఆయనకు నువ్వు ఇచ్చిన రెస్పాన్స్ టూ మచ్ ప్లీజింగ్. వారి కామెంట్సు, వారికి మీరిచ్చిన రెస్పాన్స్ తీసేస్తే పోస్టు నీటుగా, రీడర్-ఎఫ్ఫెక్టివ్గా ఉంటుందని నా స్ట్రాంగ్ ఒపీనియన్.

Jagadish Reddy said...

రాజీవ్ రెడ్డి గారు

మీరు చెప్పినమీదట పోస్ట్ చదివాను. ఒక మంచి పోస్ట్ చదవమని లింక్ ఇచ్చినందుకు థాంక్స్. మీ కామెంట్స్ అన్నీ చదివా. మీరు చెప్పాలనుకుంది ఎక్ష్హిబిట్ చేయడానికి ఒక మూర్ఖుడితో వాదన పెట్టుకున్న తీరు స్ట్రాటజీ ఆద్భుతం. కత్తి విషయానికి వస్తే మీరు అన్నది కొంతవరకు నిజమే కావచ్చు. అతనిలాంటి వాళ్ళలో నాటుకుపోయిన ద్వేషభావాలు త్రిపురనేని లాంటి వాళ్ళు తమ స్వార్ధం కోసం ఇన్సర్ట్ చేసినవనే అనుకుందాం. కానీ కత్తి ఉన్నత విద్యావంతుడైన నాగరికుడే కదా?. ట్రూత్ ఏంటి ఫాల్స్ ఏంటి తెలీదా? బ్రాహ్మణుల నేటి ఆర్ధిక, సామాజిక స్థితిగతులు బలహీనంగా ఉండడంతో కత్తి వాటిని తన స్వార్ధానికి వాడుకుంటున్నాడు. ఇది క్లియర్ కట్. కత్తికి నిజం తెలిసినా తెలియనట్లే నటిస్తూ బ్రాహ్మణులని అవమానిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడు. ఒకసారి వారి పేస్బుక్ ఎకౌంటు చూడండి. అంతా అగ్రవర్ణాలు, వారి స్నేహాలు, మోడర్న్ లైఫ్ స్టైల్. ఇతడు బ్రాహ్మల్ని తిట్టడానికి మాత్రమే దళితముసుగు వేసుకునే దరిద్రుడు అని నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఇతడో సూడో-దళిత్. అందువల్ల ఇతనిని దళితుల రిప్రజెంటేటివ్గా అస్సలు గుర్తించకూడదని నా స్ట్రాంగ్ ఒపీనియన్.

Anonymous said...

జగదీశ్

మీ రెస్పాన్స్ కామెంట్లని పరిశీలిస్తుంటే టపాని, జరిగిన సుధీర్ఘ చర్చని మీరు లోతుగా విశ్లేషించినట్లుందని తెలుస్తుంది. మీ అభిప్రాయంతో చాలావరకు ఏకీభావిస్తున్నాను ముఖ్యంగా కత్తి గారి గురించి. వారి ఫేస్బుక్ లింకు ఇక్కడ ఇచ్చిఉండాల్సింది.

రాజేష్, జగదీశ్ చెప్పింది వాస్తవం. అప్పి-బొప్పి కామెంట్లతో పాటు నాతో మూర్ఖంగా వాదించినవాడి కామెంట్లు కూడా తీసివేస్తే టపా ఆత్మశుద్ధిగా ఉంటుంది. ఇది నా రిక్వెస్ట్.

Rajeev Reddy

Anonymous said...

రమణ గారు

కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..

ఇక్కడ చర్చ జరుపుతున్న సామాజికవర్గాల మీద దాడి చేయడానికి కులగజ్జి వర్గం రంగం సిద్దంచేస్తుంది. "నందమూరి" కులసంఘం వెబ్సైట్లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కింద లింకు చూడండి.

https://lh6.googleusercontent.com/-AeBwgjvuy3M/TfoXyNoPQsI/AAAAAAAAABs/1tmmYJ2R1SU/s912/38741912.jpg

బ్రాహ్మణ, రెడ్ల కులాలని ఉద్దేశించి తిట్టిన పచ్చిబూతులని సభ్యసమాజం చదవకూడదని ఆ నీచనగ్నత్వానికి ఎర్రచీర కప్పా. బ్రాహ్మణులని "ఎలాగైనా" కట్టడి చేయాలని అక్కడ రచ్చ. ఆ కులగజ్జిగాళ్ళని సప్పోర్ట్ చేస్తున్న మిగిలిన కులాలవాళ్ళు ఇప్పటికైనా సిగ్గుతో తలదించుకోవాలి.

రాజేసా, ప్రైమరీగా నీకే ఎసరు పెట్టేది. నీ వెల్విషర్గా చెపుతున్నా. కులగజ్జి గాళ్ళు నీ మెయిల్ ఎకౌంట్లు, బ్లాగ్స్పాట్ ఎకౌంట్లని హాక్ చేస్తారు. అలాగే నీ ఫామిలీ సభ్యుల మీద బురద చల్లుతారు. జాగ్తత్తగా ఎదుర్కో. సాయానికి కేకెయ్యి.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers