నిజం..నిర్భయం

Thursday 30 June 2011

గొర్రెలు..గొర్రెలివి.. తరతరాలుగా మోసపోతున్న గొర్రెలు..

గొర్రెదాటు ధోరణి, గురివింద నైజం నేటి లోకం పోకడ


సమాజ కుతర్కమెరుగని గొర్రె తనని మహాగొప్పగా మేపుతుంటే అదంతా తన మీద ఉండే అభిమానం అనుకుంటుంది. ఆయితే తనకిచ్చిన కండబలుపు మరొకరి శరీరబలుపుతత్వం నింపడం కొరకే అన్నది గ్రహించేలోపే బలిపశువయ్యు౦టుంది. మరి దీన్ని గమనించిన మిగిలిన గొర్రెలు ఏవైనా సామాజిక పాఠాలు నేర్చుకుంటాయా అంటే అది శూన్యం. ఎందుకంటే అలా బలిపశువవ్వడం తమకు తరతరాలనుంచి వచ్చిన గొప్పవారసత్వంగా భావించడమే. భావించడమే కాదు ప్రతిఘటించలేని తమ జడత్వానికి మంచితనమనే మందమైనబొచ్చు కప్పి మురిసిపోతూ తమ వారసులకు అదే జడత్వాన్ని అందించడానికి సిద్దమవుతుంటాయి. ఆవిధంగా గొర్రెలు తరతరాలుగా మోసపోతూ ముందుకుపోతూ ఉంటాయని మరి నేను మనవి చేసుకుంటున్నా. నిజవే.. పాపం బుర్రలేని గొర్రెలు మోసపోవడం బలిపశువులవ్వడం సహజమే. మరి బుర్ర ఉండి ఉన్నత చదువులతో ఊరేగే మడిసి మాటేమిటి?

"గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి. గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి" అని అన్నారు సమాజాన్ని క్షుణ్ణంగా చదివిన ఓ సినీరచయిత. ఇక్కడ జ్ఞానం అంటే పట్టాలు,పచ్చళ్ళు(PhD) కాదు. వాదాలు,వర్గాలు, వైరాగ్యాల మీద పట్టు అంతకన్నా కాదు. సమకాలీన సామాజిక పరిస్థితుల మీద అవగాహన పెంచుకొని ఆచరణలో తర్వాతి తరాలకు ఆదర్శమవ్వమని అర్ధం. ఆయితే ముందుగా చెప్పుకునట్లు గొర్రెగా బతకడం అలవాటు చేసుకున్న తరాలని ఎత్తిచూపుతూ "వారు గొర్రెదాటు మందే.. ఇక మీ సమాజబోధ దేనికని" అని మొహంమీద కొట్టినట్లు అడిగి కడిగి వదిలిపెట్టారా సామాజిక రచయిత. గొర్రెదాటు ధోరణి, గురివింద నైజం నేటి లోకం పోకడని చెప్పకనే చెప్పారు.

ఇంతకీ "గొర్రెదాటు" అంటే? జీవితాన్ని కొనసాగించడానికి గొర్రెలకు పెద్దగా తెలివి'తేట'లు,పట్టాలు, పచ్చళ్ళు ఉండాల్సినవసరం లేదు. ఉదాహరణకి, ఒక గొర్రెలగుంపు వ్యాహాళికి వెళుతుంటే వాటికో అడ్డు(కంప/ఏదైనా) వచ్చింది. అప్పుడు గుంపుమొదట్లో ఉన్న గొర్రె అడ్డుమీదనుంచి ముందుకు గెంతుతుంది. ఇంతలో అది గమని౦చిన గొర్రెలకాపరి అడ్డు తొలగిస్తాడు. ఆయితే అప్పటికే ముందున్నగొర్రె అడ్డును ఎలా దాటిందో గమనించిన మిగిలిన గొర్రెలు తరువాత ఒకదాని వెంట మరొకటి అదే విధంగా గెంతుతూ దాటుతాయి అక్కడ అడ్డేమీ లేకపోయినా కూడా. ఇదీ "గొర్రెదాటు వైనం". మరైతే ఏందయ్యా నీ గొర్రెగోల అంటారా? అక్కడికే వస్తున్నా... సదరు సామాజిక సినీరచయితగారు చెప్పినట్లు గొర్రెదాటుగా అనుసరించడం, గుడ్డిగా జీవితాన్ని గడపడంలో తెలివిగల మడిసికి, తెలివిలేని గొర్రెలకూ ఆట్టే పేద్ద తేడా కనిపించదు. రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి ఇక్కడ. మొదటిది "అక్కడొక అడ్డు ఉంది" అన్నమాట వాస్తవం అని తెలుసుకోవడమైతే రెండవది తాము తొలుత కొంత కష్టపడైనా ఆ "అడ్డు" తొలగిస్తే తర్వాత వచ్చే తరాలు అనవసరంగా శ్రమించాల్సిన(కష్టపడి గెంతాల్సిన) అవసరం ఉండదనీ..గొర్రెలుగా బతకాల్సిన అవసరం అసలే ఉండదనీ..గుర్తించడం. ఇహ ఒకవేళ ఎవరైనా సామాజికమంటూ సలహా ఇస్తే తమ గొర్రెదాటుకి భుజాలు తడుముకోవడమేకాక పైపెచ్చు మా ముందుతరం కూడా ఇలానే మోసపోతూ గొర్రెదాటు జీవితం బతికింది. మేం కూడా అలా బతకడంలో రెండాకులు ఎక్కువే తిన్నాం అంటారు. అలా అనడమే కాదు ఆ రెండాకులతో ఓ ముళ్ళకిరీటం తయారుచేసి తమ తర్వాతితరాల నెత్తిన పెట్టడానికి సిద్దమవుతుంది. ఇహ "ఇదేలే..తరతరాల గొర్రెదాటు చరిత్ర.. మూలిగే జీవితాల మథనం" అంటూ పాడుకోవాలి. ఇదీ సంగతి.


ఉన్నతచదువులు చదివి నవనాగరికం మాసొత్త౦టూ డొప్పాలు కొట్టుకుంటూ గొర్రెదాటు జీవితాన్ని, తాత్కాలిక లాభాల కోసం బలిపశువలయ్యేవిధానం మీద ఒక ప్రత్యక్ష్య ఉదాహరణ ఇచ్చి ఈ "గొర్రెదాటు" తనానికి స్వస్థి చెప్పే ప్రయత్నం చేస్తా :)  

లండన్ మహానగరం. ఈ శతాబ్డపు ప్రపంచీరణకు(golbalization) సరికొత్త నమూనాగా భాసిల్లుతూ, యూరప్లోనే అత్యంత విలాసవంతమైన నగరంగా, రోజుకు కోట్లకొద్దీ వర్తకమారకం జరిగే పేరున్న లండన్లో ఒక సంవత్సరకాలం పైగా జరుతున్న మోసం..కాదు వ్యాపారం..బలిపశువలయ్యే విద్యావంతుల గొర్రెదాటు గొప్పతనం.

"ఆక్స్ఫర్డ్ సర్కస్" ఇది లండన్లోని ప్రముఖవీధి. అన్ని ప్రముఖ సంస్థల దుకాణాలతో నిత్యం యాత్రికులు,వ్యాపారరద్దీతో ఉంటుంది. ఇదే వీధిలో సుగంధపరిమళాలు అమ్మే అంగడి ఒకటి.. ఎప్పుడూ ఆడో/మగో ఎవరోఒకరు మైక్ పట్టుకుని పెద్దగా అరుస్తూ దారినపోయే జనాలను తమ కొట్టు(డు)కి ఆహ్వానిస్తూ ఉంటారు. నేను ఉద్యోగశాలకి పోవడం, రావడం ఇదే దారిలో కనుక నిత్యం గమనిస్తుండేవాడిని. మామూలుగా అరిస్తే ఎవరొస్తారు..అందుకని ఆకర్షణ కింద "ఐపాడ్లు,ఐఫోన్లు,కెమెరాలు ఉచితం..ఉచితం" అంటూ కేకేస్తారు. ఇక ఉచితం అనగానే చేరిపోయే గొర్రెదాటు మందకి ఓ పది ఐఫోన్లు,కెమెరాలు పడేసేవారు. ఆగండాగండి..అవి చైనావారి తయారీ మార్కు బొమ్మలు మాత్రమే ;). వీళ్ళు నిజంగానే ఏవో ఇస్తారని వచ్చిన మందకి తాము మోసపోయామని అర్ధం అవుతుంది. ఆయితే ఇది అర్ధమయ్యేలోపే ఆ అరిచేవాడు "150 పౌండ్ల విలువచేసె అయిదు సుగంధపరిమళాలు కేవలం 20 పౌండ్లు మాత్రమే, ఈ సువర్ణావకాశం ఈరోజు మాత్రమే" అంటూ మోసపోయిన మందని మరింతగా ఆకర్షించి బలిపశువులని చెయ్యడానికి ప్రయత్నిస్తాడు తన మాటల గారడీతో. ఒకవేళ తన గారడీ పనిచెయ్యటం లేదని గ్రహించగానీ కొనేవాళ్ళ గుంపులో ఉన్న తన తైనాతీలకి సైగ చేస్తాడు. ఈ తైనాతీలు అమ్మేవాడితో తమకే సంబంధలేదన్నట్లుగా నటిస్తూ వాడిచ్చిన సువర్ణావకాశం మళ్ళీ రాదనట్లు ఎగబడి కొనుక్కుంటారు. ఇహ అప్పుడు మొదలవుతుంది..గొర్రెదాటు మందలో చలనం. ఒకరి తర్వాత ఒకరు "ఆలసించిన ఆశాభంగం" అనుకుంటూ 20 పౌండ్ల సుగంధపరిమళాల సువర్ణావకాశాన్ని కొనేసుకుంటారు. ఆయితే అమ్మేవాడు అక్కడితో ఆగుతాడా.. ఇవి ఆడవారికి..అవి మగవారికి..అంటూ కొనేవాళ్ళని మరింత రెచ్చగొడుతూ ఎంతలేదన్నా ప్రతిగొర్రె నుంచి 40 పౌండ్లు రాబట్టుకుంటాడు. ఇక ఈ గొర్రెదాటుమంద పోయిన తర్వాత మరో మంద సిద్దంగా ఉంటుంది. ఈ విధంగా వ్యాపారాన్ని గొర్రెదాటు మందలున్నంతసేపూ నిరాటంకంగా సాగించే వారి వ్యాపారాన్ని కింద ఛాయాచిత్రంలో చూసి గొర్రెదాటుకి ఉన్నతచదువుకి తెలివికి సంబంధం అస్సలు ఏమీ ఉండదని తెలుసుకొనగలరు ;).      

గొర్రెలవరో చేతులెత్తండి? ;)

నాన్దాడ నల్లగొర్రె! రొంబ ఉచితమాయే ;)

మరీ ఇన్ని చదువుకున్న గొర్రెలా ? పర్లేదు నా యాపారానికి ! ;)
 ఇందుమూలంగా మీకు అర్ధమైన సామాజికనీతిని వివరించగలరు :) 

Wednesday 8 June 2011

బ్రాహ్మణులు-దళితులు మీద చర్చ పేరుతో రచ్చ చేయడంలోని దురుద్దేశ్యం?

గతటపాలోని వ్యాఖ్యల బలం మూలాన టపా ఆలస్యంగా కనబడుతుందని బ్లాగు అభిమానులు హెచ్చరించి చర్చకి కొనసాగింపుగా కొత్తటపా వేయమని సలహా ఇచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు.

ఆ సలహా మీదకి గతటపాలోని చర్చకి కొనసాగింపుగా ఇక్కడ:

నేను బ్లాగుల్లోకి వచ్చిన తొలినాళ్ళలో మురుగు ఒకడు మొరుగుతూ బ్రాహ్మల మీద విషం కక్కాడు. ఇతనూ ఓ సంఘసంస్కర్తే. హిందూ దేవుళ్ళు వద్దు, ఎందుకంటే వాళ్ళని బ్రాహ్మణులు తయారుచేశారు కాబట్టి అని ఒకటో తరగతి పిల్లాడి తర్కంతో మాట్లాడుతూ నాస్తికురాలిని అని చెప్పుకుంటూనే మరోవైపు బుద్ధుడిని చూసారా అని అడిగే ఒకావిడ సమాజాన్ని ఉద్దరి౦చే సేవిక.  రెండువారాల క్రితం తన బ్లాగులో చర్చ అనే ముసుగున ఇటు బ్రాహ్మణులని అటు దళితులని రచ్చ చేసినాయన ఒక మేధావి. అయితే ఇలా రచ్చచేసి తమ పబ్బం గడుకోవడం మొదలూ కాదు. తుది అంతకన్నా కాదు. వీరు తెర పైకి కనిపించే స్వయంప్రకటిత మేధావుల్లో కొందరు మాత్రమే. తెరచాటున ఉంటూ బ్రాహ్మణ-దళితుల మధ్య చిచ్చు రాజేస్తూ కుత్సిత ఆనందాన్ని పొందేవారి గురించి చెప్పబల్లేదు. సునిశితంగా గమనించండి ఈ స్వయంప్రకటిత మేధావుల్లో దళితులు లేరు.

మరి వీరు తమ స్వార్ధానికి రచ్చకి ఈడ్చినప్పుడల్లా బ్రాహ్మణులు తరతరాలుగా సంజాయిషీలు ఇస్తూ ఉండాల్సిందేనా? పోనీ ఇక్కడ ఎవరికి ఇవ్వాలి? దళితులకా లేక కులగజ్జితో కొట్టుకుంటూ రెండుకులాల మధ్య రచ్చ చిచ్చు పెట్టే ఆశుద్ద దళారీలకా? అసలు చర్చ పేరుతో రచ్చచేయడం వెనక ఈ దళారీల దురుద్దేశ్యం ఏమిటి? రేపు నా మునిమనవడు కూడా ఈ కులదళారీల దౌర్జన్యానికి, అంతులేని అవమానాలకి తలూపుతూ ఉండాల్సిందేనా?  

ఈ చర్చారచ్చలు కేవలం బ్లాగుల్లోనే అనుకుంటారేమో. రాజీవ్ రెడ్డి గారు చెప్పిన్నట్లు చాపకింద నీరుగా ప్రచారమాధ్యమాల్లో ఎప్పుడో చేరిపోయాయి. ఎవడుపడితే వాడు తన స్వార్ధానికి బ్రాహ్మణులని ఏకుతూ వారి తరానికి మనఃశ్శాంతి లేకుండా చేస్తూ తాము మాత్రం అవార్డుల రివార్డులతో భుజకీర్తులు తొడిగించుకుంటూ కులమద్దతు సత్కారాలు అందుకుంటున్నారు. మరి వీరంతా నిజంగానే దళితులకోసం పోరాడుతూ బ్రాహ్మణుల మీద విరుచుకుపడుతున్నారా? నాటి త్రిపురనేని నుంచి నేటివరకూ జరిగిన, జరుగుతున్న సామాజిక సంఘటనలని అవలోకనం చేసుకుంటే బ్రాహ్మణులని ఏకడం వల్ల సత్సంబంధిత కులగజ్జిగాళ్ళకి తప్ప దళితులకి ఒరిగిందేమీ లేదన్నది సుస్ప్రుష్టం. ఈ కు.గ తిమ్మిని బమ్మిని చేసే అవాస్తవ రాతల రుద్దుళ్ళ  వల్ల దళితులకి బ్రాహ్మణులు చేసిన మంచికన్నా చెడు భూతద్దమై మరీ కనిపిస్తుంది.  నిజానికి దళితదశదిశోద్దారకులు అంబేద్కర్ గారు కూడా బ్రాహ్మణులపై ఆ విధంగా విరుచుకుపడిన సందర్భాలే లేవు.

ఇక
నాడు మురుగు తన మొరుగుడు ఆపింది.. తన తమిళ రాష్ట్రంలో తన కులపువాళ్ళు దళితుల మీద చేసిన అకృత్యాలు బయటపెట్టినప్పుడు.

నేడు సదరు స్వ.ప్ర మేధావి రచ్చను ఆపగలిగింది.. ఆ రచ్చ వెనుక బలిసిన కులకుత్సిత కుటిల పధకం ఉందనీ, వారు దళితుల మీద చేసిన దారుణమారణకాండకి బదులేది అని బహిరంగ౦గా అభిమానులు, బ్రాహ్మణ బంధువులు ప్రశ్ని౦చినపుడు.      

అంటే వీళ్ళ చర్చ రచ్చ వెనుక దురుద్దేశ్యం  కేవలం కుత్సిత కులగజ్జి అన్నది ఖచ్చితంగా స్పృష్టం అవుతుంది.

మరలాంటిది ఈ కులగజ్జిగాళ్ళని మేమెందుకు ఖాతరు చేయాలని నా తరం ప్రశ్నిస్తుంది? ఆయితే ఖాతరు చేయకపోతే ఈ కులదళారీలు చెప్పిన అవాస్తవాలనే దళిత సోదరులు నిజాలని అనుకునే ఘోరప్రమాదం కూడా మరోవైపున ఉంది. కులగజ్జిగాళ్ళతో బహిరంగపోరాటం చేస్తూ దళితులతో చెలిమిచెయ్యడమే దీనికి పరిష్కారం. రెండవది అంత సులువు కాకపోయినా కనీసం మొదటి దాని మీద విజయం సాధిస్తే రెండోది కొద్దిగా అయినా సర్దుకుంటుంది అని నా ప్రగాఢ విశ్వాసం. దళితసోదరుల మీద నాకా నమ్మకం ఉంది. మొదటిదాని మీద పోరాడ్డానికి నా తరానికి బ్రాహ్మణ బంధువుల అండకూడా ఉంటుందని నా విశ్వాసం. ఈ పోరాటంలో నాతరం తాత్కాలిక సుఖసంతోషాలు నష్టపోయినా తర్వాతి తరాలు సుఖంగా ఉంటాయనే సదుద్దేశంతో ముందడుగు వేద్దామంటు౦ది.      

అయితే ఈ తరానికి పాతతరంలోని "యువరక్తం" అండకూడా కావాలి. నేటి సమకాలీన పరిస్ధితులకి తగ్గట్లుగా ఉండే వారి అనుభవపూర్వకమైన సలహాలు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇతోధికంగా ఉపయోగపడతాయని నా నమ్మకం. అందుకే ఈ ఉపయోగకరమైన చర్చ. ఇది ఒక్క బ్రాహ్మణులు మాత్రమే పాల్గొనే చర్చ కాదు అని మీకు గతటపా ద్వారా తెలిసిందే.అందువల్ల  బ్రాహ్మణుల క్షేమాన్ని, హితాన్ని కోరే బ్రాహ్మణ బంధువులందరికీ  తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ఇదే ఆహ్వానం.

గత టపాలో శ్రీనివాస్ గారు, జయహో గారు రాసిన వ్యాఖ్యల నుంచి ముఖ్యాంశాలని ఇక్కడ చర్చకు అనువుగా పెడుతున్నా. మిగిలిన వ్యాఖ్యాతల వ్యాఖ్యల నుంచి కూడా చర్చార్హమైనవి ఇక్కడ ఉదాహరిస్తా.


# ఎప్పుడు బ్లాగుల్లో బ్రహ్మణ, దళిత వర్గాల మీదేనా చర్చ/రచ్చ. మరి ఈ వర్గాల వారేవ్వరు వారిపై ఎందుకు చర్చ జరుపుకోరు?


#బ్రాహ్మనిజం పేరుతో బ్రాహ్మణుల మీద విమర్శలకు దిగటం. ఇదొక కళ గా అభివృద్దిచేశారు. ఆ రోజుల్లో ఈ వాదాల మీద కెరీర్ మొదలు పెట్టిన వారు సాధ్య మైనంతవరకు లాభపడ్డారు. వారిని అనుసరించినవారికి మారిన కాలం లో పెద్దగా ఉపయొగ పడలేదు. ఎంతో యనర్జిని ఇన్వేస్ట్ చేసి పుస్తకాలు చదివి మేధావిగా కేరిర్ మొదలు పెడతామనుకొంటే ఒక్క సారిగా దానికి గ్లోబలైసేషన్ దెబ్బతో డిమాండ్ లేకుండా పోయింది. ఎమీ చేయాలో దిక్కు తోచక బ్లాగులలో విషాన్ని వెదజల్లు తున్నారు.


#కేంద్ర మంత్రిగా ఉన్నపుడు అణ్బు మణి రాందాసు గారు తనకన్నా వయసులో,అనుభవంలో సుమారు 35సం పెద్ద అయిన డాక్టర్ వేణుగోపాల్ గారిని రాచిరంపాన పెట్టాడు.


#పని పాటా లేని వారంతా యునివర్సిటిలలో ప్రమోషన్ ల కొరకో లేక తనవర్గం వారికి రాజగురువు అవుదామని రాజ్యాధికారం కొరకు రాసే థీరిలు దానిలో ఉన్న బ్రాహ్మణిజం పేరుతో బ్రహ్మణులను తిట్టిపొట్ట పోసుకొనే వారికి అణ్బుమణి రాందాసు ఒక మంచి ఉదాహరణ


#రోజుకొక కొత్త బ్లాగరు వచ్చేది బ్రహ్మణిజం అనే పెరుతో బ్రహ్మణుల మీద చర్చ పెడతారు. పోని అర్థమయ్యేట్టు చెప్పబోతే బ్రహ్మణుల చరిత్ర అంటే హిందూ చరిత్రా అని ఒక చచ్చు ప్రశ్న వేసి చర్చను తప్పు దోవ పట్టిస్తారు.


#అసలికి రోజుకొకడు బ్లాగిలో కొచ్చి తన గురించి ఎమీ చెప్పుకోకుండా రాస్తుంటే, అటువంటి వారికి అర్థమ్య్యే లా ఎక్కడ చరిత్రను చెప్పటం మొదలు పెట్టి ఎక్కడ చెప్పటం ఆపాలి.


# ఆధునిక చదువులు చదివి తామేదో అభ్యుదయవాదులమైనట్లు ఎన్నో తోడుగులు వేసుకొని,రూపు మార్చుకొని ఉన్న ఈఆధునిక మానవుడిలో భూస్వామ్య లక్షణాలు బయటపడ్డాయి.


# చర్చజరిపేవారికి నిజం గా చర్చ జరపాలంటే, నిజాయితి వుంటె మొదట అతని వర్గం మీద చర్చ మొదలు పెట్టుకోవాలి, ఆ తరువాత ఇతనిలా సంఘాన్ని ఊదరిస్తున్నాం అని గతకాలంలో ఉద్యమాలు చేసిన వర్గాల వారి లో, ఇప్పుడు ఆడవారు కూడా ఎప్పుడు లేని విధంగా కులం పేరు తగిలించు కోవటం ఫాషన్ ఐంది. మొదట ఈ రేంటి మీదా చర్చ జరిపి తరువాత ఆ తరువాత మిగతా వర్గాల వారి పైన చర్చ పెట్టుకునేది.


# చర్చజరిపేవారికి నిజాయితి ఉంటె,అభ్యుదయ వాదిని అనుకొంటే, ఈ వారాంతం లో ఆయన తన వర్గం వారి గురించి మొదట ఒక వ్యాసం రాసి, వారిలో ఉన్న పాసిటివ్, నెగటివ్ పాయింట్స్ మీద చర్చ జరపాలి.


#ఇంతటి కులగజ్జిని ఖండించకుండా ఒకవైపు ఆ కులగజ్జి దరిద్రులకి మద్దతుగా ఉంటూ మరోవైపు పుంఖాను పుంఖానులుగా ఎన్ని రాసినా బ్రాహ్మణులకి ఒరిగేదేమీ లేదు. దళితులకి, బ్రాహ్మణులకి మధ్య మరింత స్పర్థ పెరగడం తప్ప. విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం. సదరు కులగజ్జి గాళ్ళతో తమ స్వార్థపూరిత స౦బంధ బాంధవ్యాలు పక్కనబెట్టి పోరాడాతారో లేక భావితరాల బ్రాహ్మణ యువతని తమ రాతలతో కబోదులని చేస్తారో పునరాలోచించుకోవాల్సిన సమయం.
 

చివరిగా ఒక హృదయపూర్వక మనవి: మనకు సమస్యలు చాలా ఉన్నవి. ముఖ్యంగా హిందూధర్మానికి సంభ౦దించినవి పెక్కు. మన చర్చ వీటి మీదకి వెళ్ళకుండా కేవలం టపాలో చర్చించిన దాని మీద భావితరానికి ఉపయోగపడేవిధంగా, మార్గదర్శకం అయ్యేవిధంగా వ్యాఖ్యాని౦చమని మనవి. మీరు నా మనవిని మన్నిస్తారని భావిస్తాను.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers