నిజం..నిర్భయం

Monday 17 January 2011

పైత్యంతో పేట్రేగిపోతున్న మురుగు మొరుగుడు - 1

మురుగు మొరుగుతున్నాడు, సరే పైత్యం చేసిన్దిలే అనుకున్నా! కొందరు అది పిచ్చి కుక్క, మొరుగుతుంది వదిలేయండి అన్నారు. కానీ, సరేలే నిజమే కదా అని నోర్మూసుకు కూర్చుంటే పిచ్చి కుక్క ఊరుకుంటుందా మన పిచ్చి గాని.  ఒక కులం పై నరనరాన జీర్ణించుకున్న విద్వేషాన్ని  మురుగుకాలవ మల్లే కక్కుతున్నాడు. అయినా కూడా ఈ పిచ్చి కుక్కని అలా వదిలేస్తే, అది మరి నలగురిని కరిచి తన పిచ్చి మాటలే నిజమని భ్రమింపజేస్తుంది, మరింత విద్వేషాన్ని రెచ్చగొడుతుంది. ఈ అకారణ విద్వేషం, దాని మాటున దాగిన స్వార్థం  తర్వాతి తరాలకి ఎంత మాత్రమూ మంచిది కాదు. మరి దీనికి   పరిష్కార౦?  అది ఊర కుక్క కాదు పిచ్చి కుక్క అని, అలాగే ఆ మురుగు మాటల్లో ఉన్న అవాస్తవాన్ని ఆ నలుగురికి తెలియజేయడ౦!  పిచ్చి కుక్క సంగతి వాళ్ళే చూసుకుంటారు.

అసలేం జరిగింది:
తమిళ బ్లాగుల్లో తనే రేరాజు అని పదే పదే  డబ్బా కొట్టుకునే  ఈ మురుగుకాలువ వీలు దొరికినప్పుడల్లా బ్రాహ్మణ విద్వేషాన్ని తన టపాల్లో విషస్తూ ఉంటాడు, అదీ అకారణంగా. సరే మురుగుకాలువ కదా, కంపు ఉండకుండా ఉండదు కదా.  మొన్న ఈ మురుగు జయేంద్ర సరస్వతి గారి మీద ఓ టపా రాసారు. మామూలుగా రాస్తే నొప్పేవరికి? కానీ మురుగు నవరంద్రాల్లో మరుగుతున్నద్వేష౦ ఆగుతుందా? ఆ పెద్దాయనకి  శర్మలంటూ బ్రాహ్మలకి  లంకె పెట్టి సొంత డబ్బా కొట్టే ప్రయత్నం చేసాడు. ఈ మురుగు ఇంకా రాస్తే బ్లాగు నిషేదిస్తారట, ఎందుకంటే గూగుల్ బ్రాహ్మలది కదా అని మురుగు అభిప్రాయం :)


ఆ తర్వాత వచ్చిన మురుగు మురికి మాటలు, ఈ టపా వెనక వున్న అసలు వుద్దేశ్యం బ్రాహ్మణ విద్వేషం  తప్ప ఏమీలేదు అని అర్థం అయింది. దానికి ఒక ఉదాహరణ
     
రాజేష్ జి మాట: /అంతే కాదు, ఆనాడు భయంతో ఆ పెద్దాయనకి వ్యతిరేకముగా సాక్ష్యం ఇచ్చిన వాల్లందరూ ఇప్పుడు కోర్టులో నిజం కక్కుతున్నారు, సాంబారు పొగలల్లే. అయినా మీకు తెలియదు, వాసన రావట్లేదు? ఎందుకు? ఫోబియా నా?//

మురుగు మాట: ఇది మీ మాట. నా మాట ఏమో చెప్పనా? ఆ రోజు ముఖ్యమంత్రి జయలలితా ఫుల్ మెజారిటితో ఎవరి దయా భిక్షంతోను అవసరం లేకుండా పవర్ ఫుల్ గా ఉన్నారు. కాబట్టి బాధితులు కరా కంఠంగా నిజం చెప్పేరు.  నేడు కరుణానిధి పరిస్థితి నిత్య గండం పూర్ణాయుష్షుగా ఉంది. అందుకే భయపడి ప్లేట్ ఫిరాయించేరు.

అదీ "మురుగు" మాట. నాస్తిక ప్రభుత్వం  హయంలో అస్తికులకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి భయపడుతున్నారట! ఇలా అర్థం పర్థం లేకుండా అన్నిటికీ మూర్ఖ౦ గా వాదించే మురుగు తెలిసింది ఒక్కటే, అది బ్రాహణ విద్వేషాన్ని కక్కడమే. ఇక ఇప్పడు ఆ విద్వేషం కట్టలు తెంచుకుంది, అన్ని అనర్దాలకి బ్రాహ్మలే కారణమని తేల్చేసాడు. ఈ విద్వేషాన్ని ఇలాగే కొనసాగిస్తే ముందు ఈ మురుగు అనుసరికులు రెండు ప్రపంచ యుద్దాలకి కారణం కూడా  బ్రాహ్మలే అని జెప్తే,  అవల వైపు ఉన్న బ్రాహ్మణ వర్గం షరా మాములుగా "మమ్మల్ల్ని క్షమించండి మేము కారణమయినందుకు" అని అకారణంగా నింద భరించాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. తప్పదు మరి, ఇప్పటి తరం దుస్తితి అది. తమ తర్వాతి తరానికి  మంచి భవిష్యత్తు ఇద్దామనే ఆలోచనలోతోనో లేక నలుగురిలో మంచిగా ఉండాలనే ఆలోచనతోనో ఈ విద్వేషాన్ని ఆపకుండా, రగిలుతూ ఉండే ఆవకాశం కలిగిస్తున్నారు. ఇది ఎవరి మంచి కోసం? చేతకానితనం కాకపోతే! ఎవరో అన్నట్టు పోరాడితే పోయేదేముంది.


ఈ మురికి మురుగు పక్కన ఉన్న తమిళనాట నుంచి కొట్టుకువస్తుంది. మరి అక్కడి సంగతేంటి?
తమిళనాట బ్రాహ్మణ దుస్తితి:    
పెరియార్ హాయంలో సాగిన హేయమైన భౌతిక దాడులకి తమిళ బ్రాహ్మణులు చాలా వరకు ప్రాణాలు  అరచేత బట్టుకొని, ఒంటి బట్టలతో  పక్క రాష్ట్రాలకి  పారిపోయారు. ఆనాటి అమానుష దాడుల్ని తమ స్వార్థానికి ఉపయోగించుకున్న కులాల్లో మొదటిది మొదలియార్. నాడు బ్రాహ్మణ ఆస్తుల్ని ఆక్రమించుకోవడానికి మొదలియార్లు వేసిన పథకం, దళితుల్ని మరియు వన్నియార్లని వారి మీదకి రెచ్చగొట్టడం. నాటి పరిస్తితి, కొంతమంది భ్రాహ్మనుల మూర్ఖపు భావాల దృష్ట్యా ఈ మొదలియార్ల పథకం ఫలించింది. తర్వాత ఇదే రకమైన దూరాలోచన ఆంధ్రలో కూడా అనుసరిమ్పబడింది. ఇంతకూ నాటి పెరియారు కలలు ఫలిన్చాయా అన్నది సశేష ప్రశ్న? నేటికీ తమిళనాడులో దళితుల/లేదా అణగారిన వర్గాల  మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇక్కడ కూడా బ్రాహ్మలే కారణమా? అవుననే చెబుతాడు అదే మొదలియారు వర్గానికి చెందిన  ఈ మురుగు మూర్ఖ శిఖామణి. 


తమిళ నాట ఘోరంగా, అమానుషంగా అణచివేయబడిన బ్రాహ్మణ కులం ఇంకా అగ్రకులమే! దీనికి మూలకారణమైన దళితులూ ఇంకా వెనుకబడ్డ కులమే! మరి ఎవరు బావుకున్నారు మధ్యలో? పోనీ మమ్మలిని ఇలా కొట్టారు, చంపారు లేక దోచుకున్నారు ఏనాడైనా బ్రాహ్మణ వర్గం ఆక్రోసి౦చిన్దా? వారు కర్మ సిద్దాంత ప్రభావశీలురై  తమ మానాన తామ బతుకుంటే  యాన్టి-బ్రాహ్మనిసం అని వారి మీద స్వార్థ పూరిత విద్వేషాన్ని కక్కుతుంటే  కనీసం ఖండించకపోతే ఎలా? ఇదేనా మన తర్వాతి తరానికి మనమిచ్చే బహుమానం? నిజాలు బయటికి రావాలి నిగ్గు తేలాలి. ఈ విద్వేషాల వెనక ఉన్న స్వార్థ పూరిత ఉద్దేశ్యాలు    వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత ఎవరిదీ?  ఎవరైతే అవమానాల పాలవుతున్నారో వారు బయటకి రావాలి, వీరికి మిగిలిన వారు చేయూతనివ్వాలి.


కానీ అది జరగట్లేదు, రాన్రాను ఒక రకమైన నిర్లిప్తత  బ్రాహ్మణ వర్గాల్లో ఏర్పడింది. నన్ను కాదు కదా అన్నది లేదా నా దగ్గరకు రానీ చూద్దాం లేదా ఆ మాట అన్న మనిషి వర్గం తాలూకూ మనుషులు నాక్కావసిన వారిలో ఉన్నారు అన్న భావాలు అధికమై తమ కొంపని అంటించడానికి  ఈ రోజే తయారవుతున్న అగ్గిని ఆపడం లేదు. ఇంకా ఇదే వర్గంలోని కొందరు మేతావులు ఈ అగ్గి ని పెంచడానికి కావలసిన సామగ్రిని అందజేస్తున్నారు. సిగ్గు..సిగ్గు.  


కొంతమంది మిత్రుల భావాలు:
We Are Like The Jews  : http://www.outlookindia.com/article.aspx?227027

Please stop Brahmin bashing: http://udaypai.in/?p=12


Dalit leader and founder of political party Pudiya Tamizhagam, Dr.Krishnasamy admits that the Anti-Brahmin Movement had not succeeded up to the expectations and that there continues to be as much discrimination of Dalits as had been before.


ఇదే విషయమై మరికొన్ని నా భావాలను మలి టపాలో పంచుకుంటా!







27 comments:

Anonymous said...

సమాజ హితాన్ని కోరేవారు బ్రాహ్మణులు. మీ పోస్ట్ బాగుంది. బ్రాహ్మణ ద్వేషాన్ని ఒంటినిండా నింపుకున్న ఈ మూర్ఖులు వ్రాసే వ్రాతలు నీటిమీద రాతలే.

Malakpet Rowdy said...

"మురుగు మొరుగుడు" - LOLZ :))

Malakpet Rowdy said...

Ravigaru (If you are reading this)

I think this is more relevant one than that Raviteja movie.

mirchbajji said...

nice... good...

సాపాటు సమగతులు said...

@Anon Ji
Thank you MUCH for supporting the cause. We should also recollect the saying “repeat a lie a hundred times and that would become the truth” and that is what murugu alike doing.

@Malak Ji
Thank you, I think both are mutually inclusive though raised at different thresholds!

@Mirchbajji ji
Thanks you :)

Malakpet Rowdy said...

Well,

I feel that making fun of someone is different from insulting that one.

సాపాటు సమగతులు said...

Ofcourse, Your statement would be correct when there is a fine distinction between those two w.r.to telugu cinema which was prevailed in the initial years of Tollywood inception.

But now there is just insulting under the guise of fun. Somebody may say It is just the way of perceiving, but there are plenty of instances exists to prove that perceiving is a valid one.

Long time back, Prominent astrologist Sri Mulugu Ramalingeswara siddanti once painfully shared his experience that He was really irritated to the stretch where he snapped his TV off after watching brahmanandam nasty fun(?) and then requested everyone to condemn such nasty fun and prevent those in future. But no one taken that forward as expected :)

Anonymous said...

అతను రాసేవి అతనికే అర్థం కాదు. సెల్ఫ్ డబ్బా తమీళులకి ఆది నుంచి ఎక్కువే. ఈ దేశానికి తమిళ నాడు ఒక పెద్ద భారం ఐంది. వారు ఈ దేశానికి ఎమీ కంట్రిబ్యుషన్ చేశారొ చేప్పాలి. ఆ కంట్రిబ్యుషన్ చేసిన వారి లో బ్రాహ్మణుల పేర్లను తొలగించి చెప్పాలి. ఎందుకంటే తమీళ నాడు భారత దేశాం లో భాగం అని ఆ వర్గం వారు మాత్రమే 100% అనుకొంటారు. మిగత వారు సమయానుకూలం గా మారుతూ ఉంటారు. ఒకప్పుడు అన్నా దోరై గారు భారత దేశం నుంచి విడి పోతాం అని తీర్మానాలు చేసేవారు. కరుణా నిధి గారు ప్రభకరన్ కి మద్దతు ఇచ్చ్చి రాజీవ్ ని పొట్టన పెట్టుకున్నారు. మొన్నటికి మొన్న రామ సేతు విషయంలో మా సంస్కృతి వేరు అది ఇది అని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. సౌత్ ఇండియా లో అన్ని రాష్ట్రాల నోట్లొ మట్టి కొట్టి నిధులు తరలించుకొని పోవటం లో మాత్రమే సిద్ద హస్తులు. చెప్పు కోవాటానికి ఒక్క పెద్ద నది లేదు, ఉన్న కావేరి నది నీళ్ళ కోసం కర్నాటక ఇస్తే గతి లేదు. చుక్క నీళ్ళు లేని వీరు, మిగతా రాష్ట్రాల నిధులతో బాగా అభివృద్ది చెందారు. సిగ్గు ఎగ్గు లేకుండా 1,70,000 కోట్లు దేశపు సొమ్మును దిగమింగడం లో పెద్ద పాత్ర వహించిన వీరు ఇతర రాష్ట్రాలకు జవాబి వలసిన అవసరం ఉంది. మిగతా రాష్ట్రాల "ఆర్యులు" కూడా ఈ "ద్రవిడుల" ఘరానా దొంగతనాలను అరికట్టటానికి నిరంతరం వారి పై ఒక కన్ను వేయాలి. ఈ సారి వాడు అవాకులు చేవాకులు పేలితే పెంట పూసిన చెప్పుతో వాడిని కొట్టటానికి సిద్దం గా ఉండాలి.
Thanks for your initiative against him.

రాజేష్ జి said...

@అజ్ఞాత గారు
చర్చకు పనికి వచ్చే మంచి అంశాలు పంచుకున్నారు.ధన్యవాదాలు. మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను, ఆ ఒక్క ఆర్య-ద్రవిడ తప్ప. మీరు తమిళులు పదే పదే వల్లే వేసే పసలేని "ద్రవిడ" గోల గురించి చెబుతున్నారనుకుంటా, అల్గైతే వాకే :)!

నాకు జరిగిన స్వానుభవం ఇక్కడ, 2004 మాట!

నేను మొదట సాఫ్టరికం చేసిన కంపెనీ మాతోనే ప్రారభమయింది. మే మొత్తం నలుగురం పనిచేసేవాళ్ళం ఇక్కడ. నాలుగు నెలలు గడిచాక, పని పెరిగి ఇంకొకరిని తీసుకున్నారు. అతను తమిళుడు, పేరు కొంగువేల్. మేము పెట్టిన పేరు "కొంగు" అని :). కొద్దికొద్దిగా తెలుగు వచ్చి, ముద్దు ముద్దుగా మాట్లేడేవాడు. నేను తెలుగు నేర్పిస్తే, తను నాకు తమిళం నేర్పిచేట్లుగా, ఇంకా దగ్గరగా స్నేహితులయ్యాం. కానీ ఈ ముచ్చట కొద్దినాళ్ళే!

అసలు విషయానికొస్తే,

ఏ రంగ౦లో అయినా ఉండే పోటీ ఇక్కడ మా మద్య కూడా ఉంది. అందులోనూ అంతా యువరక్తం. మొదట్లో బానే ఉన్నా తర్వాతర్వాత ఇక్కడే నాకూ, కొంగుకి పొసగలేదు. నిజానికి కొంగు స్వతహాగా మంచివాడు, సహాయకారి కూడా. అయితే ఈ రంగ౦లో పోటీ సహజం కాబట్టి, ఉండేది అయిదుగురం అయినా మేమిద్దరం పనిలో పోటీపడేవాళ్ళం. అయితే ఆ పోటీలో చాలావరకు నాదే పైచేయి ఉండేది, ప్రోగ్రామింగ్లో తండర్ లాజిక్స్ సృష్టిస్తూ ముందుకు పోయీవాడిని.

ఇక కొంగు పోటీ తత్వం రాన్రాను దిగజారి పోయి మేథతొ కాదని చివరకు ఏదో ఒక వంకతో తోక్కేద్దామనే దురాలోచన మొదలెట్టాడు. దానికి కొంగు పెద్దగా కష్టపడనవసరం లేకుండానే నేనే ఉడత సాయం చేశా. ఎలా అంటే నాది ఆహార్యం ఆధునికమైంది కానీ ఆహారం అదే శాకాహారం. దాన్ని గమనించాడు, తర్వాత చాలా రకాలుగా పరిశోధన చేసి మొత్తమ్మీద నేనేమిటన్నది రూడీ చేసుకున్నాడు. ఇలాంటి పరిశోధనల్లో భాగంగా కొంగు అడిగే ముచ్చుప్రశ్నల్లో మచ్చుకు ఒకటి రెండు
" రాజేష్, మా వైపు అందమైన అమ్మాయులు ఉంటారు. నువ్వెంటో చెప్పు, డీటైల్స్ ఇవ్వు సంబందాలు చూస్తా "

"రాజేష్, మీ అన్నకి ఎంత కట్నం తీసుకున్నారు, అక్కకి ఎంతిచ్చారు?"

ఇలా అన్నమాట! అంటే "కట్నం" అన్నది కొంగు ఉద్దేశంలో ఆంధ్రాలో ఒక్క బ్రాహ్మలు మాత్రమే తక్కువ కట్నం తీసుకు౦టారు అని. నేను కనుక ఏ యాబైవేలో చెబితే వాడి అనుమానం కొద్దిగా బలపడుతుంది. ఇంకా నయం, జంద్యం ఉందో లేదో చూడ్డానికి హుస్సేన్ సాగర్లో చొక్కా విప్పి స్త్నానం చేద్దా౦రా అని పిలవలా ఎట్లో!

ఈ విధంగా కొంగు వంద శాతం నేను ఇది అని గట్టిగా మొదలుపెట్టిన తర్వాత ఇక ఆచరణలో భాగంగా అందరిముందు డిస్కషన్ మొదలు
" బ్రాహ్మలు మిగిలిన వారిని అణచివేసారని, చంపార౦టూ, ఇంకా ఏవేవో" కావాల్సిన మసాలా అంతా నూరి మరీ చెప్పేవాడు, పేపర్లో ఎవడో గన్నయ్య రాసిన ఆర్టికల్స్ని బలిమిగా చూపించేవాడు. ఇక మిగిలిన వారు నోరు తెరుచుకుని మరీ వినేవారు. వీళ్ళకీ కొంత ఉంది బుర్రలో, ఇక కొంగు చెప్పేది విని అవునా, నిజమే అన్న వెకిలి రాగాలు!

మరిచా ఈ కొంగు తాను మొదలియర్ నని, ఊర్లో మాంచి సౌండ్ పార్టీ అని కట్నం ఎంతలేదన్నా ఇరవై లక్షల పైన అని తెగ డప్పా కొట్టుకునేవాడు.

నేను ఎవర్ని ఎవరు అణిచారో పెరుమ్మల్ల్లకెరుక అని అనుకునేవాణ్ణి (పెరుమాళ్ళు నాకు ఇప్పుడు చెబుతుండాడులే:)). నేను ఎంతసేపటికి ASP తర్వాత ఏంటి> PHP నా లేక .NET 1.1 నేర్చుకోవాలా అన్న తపన, మరోవైపు పని వత్తిడి.
ఏదో అంటున్నాడులే అనుకున్నా కానీ సీరియస్ గా తీసుకోలా, ఒకవేళ తీసుకున్నా నేను వాడికి గట్టి సమాధానం ఇవ్వడానికి "కూర్చున్న కొమ్మని నరుక్కునే వారు, కీర్తికండూతిలు" ఉన్నారు గానీ ఎవడైనా నాకు సప్పోర్ట్ గా పేపర్లో నిజాలు రాసేవారిరి. ఇక గూగులమ్మే దిక్కు బిక్కుబిక్కుమనే వారికి అన్నట్లు నాకూ అదే!

చివరకు కొంగు గెలిచాడు, అందరినీ తన వైపు తిప్పుకున్నాడు, రాజకీయం
చేశాడు (ఎలా ఏమిటి అనేది ఒక టపాలో చెప్తా!).లీడ్ అయ్యాడు. మేథస్సు ఉండీ సామాజికవిషయాల మీద అవగాహన, లేని నేను కంపనీ నుండి బయటకు వచ్చాను. ".. కష్టం.. రాళ్ళ పాలు" అని ఎవరో అన్నట్లు అంత గొడ్డు చాకిరి చేసినా చివరకు "మేథ" తప్ప "మేత" ఏమీ మిగల్లేదు.

ఇంతకీ నే చెప్పొచ్చేదేమంటే, ముందు చెప్పినట్లు ఇక్కడ కొంగు మంచోడే! కానీ పోటీ పడలేక తొక్కడానికి ఎన్నుకున్న దారి పరమ కిరాతకమైనది. తన స్వార్థం కోసం ఒక సామాజిక రుగ్మతని వాడుకున్నాడు. ఆ రుగ్మతకి బాధ్యులుగా ఒక కులాన్ని బలిచేసిన నీచ ప్రతిపాదనని తుచ్చమైన వాటికోసం ఉపయోగించాడు.
ఇంతకీ ఇది కొంగు తప్పా లేక అలాంటి నీచ ప్రతిపాదనలకి తోలొగ్గుతూ తలంటించుకునే వారిదా? తర్వాతి తరానికి కూడా ఇదే తలంటు అవసరమా?

Anonymous said...

*ఇంతకీ ఇది కొంగు తప్పా లేక అలాంటి నీచ ప్రతిపాదనలకి తోలొగ్గుతూ తలంటించుకునే వారిదా? తర్వాతి తరానికి కూడా ఇదే తలంటు అవసరమా? *
పాత కాలం లో వారు కొంగు లాంటి వారిని ప్రతిఘటించక పోవటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఉదా|| స్వాతంత్ర పోరాట సమయం లో బ్రహ్మణ,వైస్యా,కాయస్థా మొద|| కులాల నుంచి నాయకులు ఎక్కువగా ఉండెవారు. ఇది గమనించిన తెల్లవాడు మెల్లాగా ఆర్య ద్రవిడ సిద్దాంతం తీసుకొచ్చాడు. ఈ నాయకులు తెల్ల వాడితో చర్చించటానికి పోయినపుడు మీరు ఆర్యులు వేరే దేశం నుంచి వచ్చి భారత దేశా పాలించగా లేనిది మేము ఎందుకు పాలించకుండదు అనే ఆర్గ్యుమెంటు లేవనేత్తేవాడు. ఇక తమిళ నాడు విషయానికి వస్తే అక్కడ ప్రజలని వాడు తేలికగా ఈ సిద్దాంతం నమ్మించ గలిగాడు. ముఖ్య కారణం వారి రంగు. ఆర్యులు ఉత్తర హిందుస్థానం నుంచి వచ్చరు. తమిళ బ్రాహ్మణులు మిగతావారితో పోలిస్తే ఎక్కువ శాతం నార్త్ ఇండియావారిలా తెల్లగా ఉంటారు కనుక సామాన్య ప్రజానికం లోకి ఈ వాదన త్వరగా చొచ్చుకొని పోయింది. ఈ పర్సేప్షన్ ఆ సిద్దాంతం తప్పని తెలిసినా వారు తమ అభిప్రాయలను మార్చు కోలేదు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే ఆరోజుల్లో బ్రాహ్మణులు నాయకులు కనుక వారి తెల్ల వాడీపై పోరాడవలసిన బాధ్యత వలన ఈ సిద్దంతాన్ని వారు ఒక స్థాయి వరకే ఖండించారు. ఎందుకంటె సామాన్య ప్రజలే దీనిని అప్పుడు నమ్మ లేదు. జస్టిస్ పార్టి/ద్రవిడ పార్టీ లను పెద్దగా ఆదరించలేదు. దానికి ఉదా|| స్వాతంత్ర అనంతరం తమిళనాడు లో కాంగ్రేసే అధికారం లోకి వచ్చింది. ఇప్పుడు బ్రాహ్మణులు ఎంతో మారారు, వారికి ఈ పిచ్చి సిద్దాంతం ప్రతి పాదించే వారికి తల్లొగ్గ వలసిన పనే లేదు. అసలికి నువ్వు తెలుగు వాడి వైతే వాడి తమిళ పైత్యం మిగతావారు ఎలా విని నమ్మారు.

Anonymous said...

ఇక తమిళుల విషయానికి వస్తే వారికి గురువులు మళయాలీయులే. వ్యాపారం లో రిస్క్ తీసుకొనే స్వభావం తక్కువ కనుక ఇద్దరు ఉద్యోగాలు చేయటానికి చాలా ఆసక్తి చూపుతారు. తమిళులకి ధైర్యం తక్కువ అని నా అభిప్రాయం కనుక చాలా తెర వెనుక రాజకీయాలు చేస్తూ ఉంటారు. మనం అల్లూరి సీతా రామరాజు ఏ విధంగ చెప్పుకొంటామో వారు వీర పాండ్యగట్టబొమ్మన్ చెప్పుకొంటారు. కాని ఆయన కూడాతెలుగు వాడే. ఈ మధ్య కాలం లో ఒక్క ప్రభాకరన్ మాత్రమే ధైర్య వంతుడు. కాని అతను భారతీయుడు కాదు గదా. కరుణ నిధి, ఆర్కాట్ వీరస్వామి, విజయకాంత్, వై.గో. మొదలైన రాజకీయ నాయకులంతా తెలుగు అరిజిన్ కలిగిన వారు. వారంతా ఇళ్ళలో వక్క ముక్క తెలుగు మాట్లాడుతారని గాసిప్ పేపర్లో రాస్తూ ఉంటారు. తమిళులకి ఏమున్నా లేక పోయినా సాయంత్రమైతే ఎదో ఒక గాసిప్ వార్త కావాలి. కనుకనే తమీళ్ ఉన్న చిన్న చిన్న పుస్తకాల నుంచి మన స్వాతి లాంటి విక్లీ వరకు ఎన్నొ దుకాణాం నిండ వేళాడ దిస్తారు. వాటిని కొనుక్కొని ఇంట్ళొ ముసలి వారి నుంచి చిన్న పిల్ల వరకు చదువుతారు.
వారిలో ఉన్న మంచి గుణాలు భాషా అభిమానం, క్రమశిక్షణ,సంగీత సాహిత్యాల పట్ల గౌరవం మొద|| మీకందరికి తెలిసే ఉంటాయి. ఇంకొకటి నేను గమనించింది ఎమిటంటే రైలో టికేట్ కొని ప్రయాణిచే వారి సంఖ్య చాలా ఎక్కువ. వారికి టికేట్ కొనవలసిన అవసరం లేక పోయినా అంటే టి టి రాడు అని తెలిసినా కూడా దాదాపు అందరు నిబ్బదత తో స్వచ్చందం గా టికేట్ కొంటారు. ఈ క్రమశిక్షణ వారికి బ్రిటిష్ వారి కాలం నుంచి కొనసాగుతున్నాదని నాకని పిస్తుంది. ఒకసారి గొల్లపూడి గారు చెప్పినట్లు ఎన్ని ఉద్యమాలు జరిగినా తమిళులు వారి ప్రభుత్వ బస్సుల అద్దాలను ఇప్పటివరకు పగలగొట్టలేదు అని చెప్పారు.
మీకు ఎమైనా నేను రాసిన దానిలో అభ్యంతరం అనిపిస్తే వ్యాఖ్య తొలగించండి.

రాజేష్ జి said...

@అజ్ఞాత గారు
$అసలికి నువ్వు తెలుగు వాడి వైతే వాడి తమిళ పైత్యం మిగతావారు ఎలా విని నమ్మారు.

దీనికి చాల వీజీగా స.ధా చెప్పొచ్చు, అదే తెలుగోల్లకి కలిసికట్టు, కలుపుగోలు తక్కువ అని. ఒకవేళ మరీ ఆ "కట్టు" అవసరమైతే కుల,ప్రాంత ఇంకా పొతే వీధుల వారిగా అయితే ఓకే!

అయితే ఇక్కడ కొంగు వేసిన "కొంగు ముడి" బహు గట్టిది. అ ముడిలో తరతరాలుగా స్వార్థం కోసం పోషిస్తున్న విద్వేషాన్ని తన స్వార్థాన్ని ముడేసి గట్టిగా కట్టి పెట్టాడు.
ఇక పోటీ అన్నప్పుడు మిగిలిన వాళ్ళు చోద్యం చూడరు కదా. వీడు నిప్పెట్టాడు, వాళ్ళు రాజేసారు. ఉపయోగించుకున్నారు. ఇద్దరిలో తెడా ఏమీ లేదు.

ఇక ఒక్కడినై నేను చేయగలిగినది ఏమీ లేదు, గప్.. చుప్.. "సాంబార్" బుడ్డి. అంతే!

$మీకు ఎమైనా నేను రాసిన దానిలో అభ్యంతరం అనిపిస్తే వ్యాఖ్య తొలగించండి.
అయ్యో! ఇంత మంచి విషయాలు రాసి చివరలో ఇదేంటండీ :(. మీరు చెప్పినవన్నీ అక్షరాలా నిజమే. మంచీ, చెడు రెండూ ఉంటాయి మరి నాణానికి రెండు వైపులా అన్నట్లు!.

సాపాటు సమగతులు said...

@సుమలత గారు

Mind your language, Ofcourse you may crack it when necessary!

మీది తెల్లనివన్నీ పాలు,నల్లనివన్నీ నీళ్ళు అన్న బాపతులా ఉంది. ఆయన మనసున్న రౌడీ. మీ పిచ్చి కామెంటు డస్ట్బిన్ కి :)

Anonymous said...

తమీళ స్కాం వీర లేవరా, గాసిపులను ప్రజల మీద వెదజల్లరా
ఆర్యుల సంకీర్ణం ప్రభుత్వంలో చేరరా,అనువైన మంత్రి పదవులు చేపట్టరా,
కుటుంబ సభ్యులందరిని మంత్రి మండలీ లో చేర్పించరా (ఆలిబాబా అరడజను దొంగలు)
1,70,000 కోట్లు దొచుకుపోరా ఏవరైనా అడిగితే వెనక బడిన వారమని వాదించరా
అనువుగా ఈ పనులు దళితుల మనుషులతో చేయించరా
ఎక్కువ మాట్లాడితే మా సంస్కృతి మీ సంస్కృతి వేరని వాదించరా
కేంద్రం లో మంత్రి పదవి అవసరమైనపుడ్డల్లా పార్టీలు మర్చరా
పట్ట పగలు దొంగతనం ఎదేచ్చగా కొనసాగించరా
నల్ల డబ్బును తెల్ల్ డబ్బుగా మార్చటానికి రోబో సినేమా తీయరా
మీడియా మొత్తం ఆక్రమించి ఏ చానల్ పెట్టినా నీ కథలే వినిపించరా
ప్రతి వారం ఎవరినో ఒక సినేమా వారిని సన్మానించరా
ఆ సన్మానంలో కలైంజర్ మీద కవితలు వినిపించరా
వైరముత్తు సెన్ తమీళ్ డబ్బా గట్టిగా మోగించంగా
వేదిక మీద నున్న వారు తప్పేట్ల కొట్టంగా
రాత్రి పూట కళ్ళద్దాలు పెట్టుకొననే ఎకైక మానవుడు
చెవులు రిక్కించి చప్పుడు ఎక్క్డ వస్తున్నాదని అటు ఇటు చూస్తుంటె అదేదో తలైవర్
కవిత్వానికి తన్మయుడైనట్లు చూపించుకొనే ఆయన ఛానల్స్
ఇది మీ ద్రవిడ సంస్కృతి

Anonymous said...

నక్క జిత్తులు చంచాగిరిలు వారి నాయకత్వ లక్షణాలు
ప్రతి నాయకుడికి మినిమం ముగ్గురు సహధర్మ చారిణులు లెక్కించలేనన్ని అక్రమ సంబంధాలు
ప్రజలకీ ఏ మహిళ తో ఎప్పుడు ఎలా ఎంత కాలం కలసి ఉన్నాడు
ఆమేను ఎప్పుడు మొదట కలిశాడు ఆమేకితో పిల్లా పీచు ఉందా
ఏ మంత్రి ఎంత సంపాదించాడు? ఎక్కడ పేట్టాడు? ఎవరితో ప్రస్తుతం కులుకు తున్నాడు ...
అనే సంగతులే విధ్యాధికులైన ఆ రాష్ట్ర ప్రజలకి ప్రధాన వార్తలు
ఈ ద్రవిడ సంస్కృతి ని అని తెగ డబ్బా కొట్టుకొనే ప్రజలు
సిగ్గు ఎగ్గు లేకుండా ఇటువంటి వారిని పదే పదే గెలిస్పిస్తూ
భారత దేశానికి 1,70,000 కోట్ల బొక్క పెట్టిస్తూ
రజనీ కాంత్ సినేమా విడుదలప్పుడు ప్రపంచ వ్యాప్తం గా ఉచితం గా
ద్రవీడ పిచ్చి ప్రదర్సిస్తూ (మాస్ హిస్టిరియా)
మోదటి వారం ఇన్ని కోట్లు కలేక్ట్ చేసిందని దొంగ లేక్కలు చెప్ప్తూ (గాసిపింగ్)
డబ్బా మోగించే గుంపు
మీరు నిజంగా దేనికైనా పనికి వస్తారా అంటే
సొల్లు మాటలు చెప్పు కొవాటానికి,
డప్పాంగుత్తి డాన్స్ కి తప్ప నెత్తిన
చుక్క నీళ్ళు లేని మీరా ఇతరులను విమర్శించేది.
---------------------------------------------------------------
మీరు నిద్దర లేస్తే వాగేది గాసిపు వినేది గాసిపు
చదివేది గాసిపు ఇతరులకు చేప్పేది గాసిప్
ఇవ్వని ఎక్కడ తక్కువ అవుతాయో అని మీరు పత్రికలు, టి.వి. లు పేట్టుకొని
ప్రచారం చేసుకొనేది గాసిప్
మీకు గాసిప్ ఇంత ఇష్టం కనుకనే మీ తలైవర్ గాడు యఫ్.యం మొదలుకొని టి.వి. దాకా మీకు
గాసిపలను నీళ్ళ లాగా సరఫరా చేస్తున్నాడు.
నీ గాసిప్ రాతలను తెలుగు వారు ఎవ్వరు వినరు మురుగుడు వేధవా.

Anonymous said...

అయ్యా రాంగ్ ఎండ్ పోలిటిషన్ గారు,
తమరికి పనీ పాట ఉన్నట్లు లేదు. క్రైస్తవ మూక తో చేరి ఒకే ఇది గా చర్చల పేరుతో గోక్కోవాలను కొంటె మీరు ముందర మీ పేరు, మీ కులం పై చర్చ జరుపుకోండి, తరువాత మిగతా వాటి పై చర్చిద్దురు గాని. 4 సం|| నుంచి ఎన్నో చర్చలు జరిగి వారి జెండా అజెండా తెలుసు కనుక అచ్చేసి వారిని వదిలి పెట్టాం. ఈ మధ్య ఆ బ్లాగుకు తమరు చీఫ్ గెస్ట్ గా పలు చర్చా కార్యమ్రాలు నిర్వహించటం లో ముఖ్యపాత్ర పోషితున్నారు. కోతికి కొబ్బరి చిప్పలా గా లేక ఏడ్స్ వచ్చిన ముసలి చింతామణికి యవ్వనం లో ఉన్న బిల్వ మంగలుడిలా గా మీరు ఆ బ్లాగరుకు దొరికారు. ఆరోగ్యం జాగ్రత్త. సుఖవ్యాదులు తగులు కొని రోగాల బారి పడతరు. కులాల మీద చర్చల పేరుతో ఎంత చర్చ జరిపినా తగ్గక పోగా దాని దురద ఎక్కువ అవుతుంది, ఇది చారిత్రక వాస్తవం.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Anonymous గారూ,

సరైన పద్దతిలో చర్చ చేస్తే కనీసం కొంతమందికైనా ఆలోచించడానికి ఉపయోగపడుతుందనేది నా ఆశ.

కులాల గురించైనా, సమాజాన్ని ప్రాభావితం చేస్తున్న మరే అంశం గురించైనా సభ్యత తో కూడిన చర్చ జరిగితే అపోహలు పోతాయనుకుంటాను నేను. నేను చేసే చర్చలో అభ్యంతరకరమైనవి వుంటే తప్పకుండా తెలియ చెయ్యండి.

ఇంక రాంగ్ ఎండ్ గురించి అంటారా... ఈ కింద లింకులు చూడండి మీకే తెలుస్తుంది ..

http://teluguyogi.blogspot.com/2011/01/blog-post_26.html

http://sambargaadu.blogspot.com/2011/01/blog-post_28.html

Discussion such as the above is the wrong end for me..

Thank you for offerring me wisdom from your experience. But I would prefer to learn on my own..

రాజేష్ జి said...

$వారాంతం గారు,
మా బా.. చెప్పారు! మీది చర్చ.. మాది రచ్చ.. సరే.. ఆత్మానందం కాసేపు!

ఇది పక్కన బెడితే,

అసలు చర్చ జరగాల్సి౦ది, పదే పదే కుల౦ పేరు చెప్పి మరీ కుళ్ల బొడిస్తూ, తనకేదో బ్రాహ్మల వాళ్ళ అన్యాయం జరిగిందని చెప్పే అ మహిషి ని నిజంగా కులం పేరుతొ అవమానించారా? లేక స్వార్థ కోసం వాడుకునే బాపతా?

అందులో మహిషి తప్పేమీ లేదా?

ఒకవేళ జరిగి ఉంటే, వాళ్ళు ఎంత మంది? ఏ కులాలకి చెందినవాళ్ళు? వారిలో అగ్రకులాలు ఎంతమంది, మిగిలిన కులాలు ఎంత మంది. ఇలా అన్నీ భేరీజు వేయండి. ఇంకా మీరు అనుకున్న అదే తెచ్చిపెట్టుకున్న అపోహలు పోవాలంటే
మీరు పూనుకుని వాళ్ళందరినీ ఒక బహిరంగ వేదిక మీదకి తీసుకురండి.అప్పుడు చర్చ పెట్టండి. నిజాలు చెప్పించండి.

ఏదైనా "నిజంగా" సొంతంగా నేర్చుకునే వారి అభ్యాసం ఇలా ఉంటుంది. మీది "ఆశ" నిజ్జంగా నిజమని నా అభిప్రాయం. వమ్ము చేయకండి!

చివరగా ఒకటి, ఇక్కడ మేం రాసింది ఎవరో వచ్చి ఊసుకోలు కబుర్లుతో వచ్చి రచ్చ..సారీ.. చర్చ చేస్తారని కాదు. గత, వర్తమాన సామాజిక విషయాలపై నిజాలు తెలుసుకుని తమ తర్వాతి తరానికి మార్గదర్శకం చేస్తారని!

Anonymous said...

అయ్యా,
మీ సమాధాననికి చాలా సంతోషం. ఇక్కడ వారి తో చర్చిన వారికి ఎప్పుడో బ్రమలు తొలగాయి. మీకు నిజం గా చర్చలవలన తొలగితే ఆనందిస్తాను. నేను ఇంకా రెండు ప్రశ్నలు కూడా అడిగాను. కాని వాటికి జావాబు ఇవ్వకుండా తెలివిగా దాటెసారని పించింది. మీ గురించి తెలుసుకోవచ్చా అని అడిగితే తెలివిగా దాటెసిన మీరు చరిత్రలో బ్రాహ్మణుల పారదర్శకత మీద చర్చిస్తారన్నమాట.
---------------------------------------------
నువ్వు అజ్ణాతవు కదా, నువ్వు చెప్పావా నీపేరు అని నన్ను అడుగుతారేమో. అక్కడ మీరు జరపబోయే చర్చ కులానికి సంబందించింది. ఈ పాటికే నేనే కులమో మీకు తెలుసు కనుక మీ గురించి తెలుసుకోవాలను కున్నాను అంతే. నేను బ్లాగులు రాయను. చదువుతాను అంతే.

Anonymous said...

గత అనుభావల దృష్ట్యా నేను వారంత గారి వివరాలను అడగటం జరిగినది. ఇంత క్రితం చర్చలలో చాలా మంది మారు పేర్లు పెట్టుకొని ఒక్క వర్గాన్ని టార్గెట్ చేసే వారు. ఇటువంటి వారి తో పోలిస్తే అతడే నయం కనీసం ఆ పెరియావర్ గురించి తెలుసు కాబట్టి అతని పాఇంట్ ఒఫ్ఫ్ వ్యూలో సమాధానాలు ఇచ్చారు. కాని ఊరు పేరు చెప్పకుండా 5000సం|| చరిత్ర మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

రాజేష్ జి గారూ,

>>మా బా.. చెప్పారు! మీది చర్చ.. మాది రచ్చ

పైన నేను చూపించిన లింకులు మీవా? ఒకవేళ అయ్యుంటే అక్కడ జరిగేది చర్చ అని నేను అనలేను.

ఇంక మిగతా విషయాలకొస్తే, నావరకు నేను ఎవరిది తప్పో నిర్ధారించడానికి ప్రయత్నించడం లేదు. కేవలం కొన్ని సామాజిక విషయాల మీద చర్చ చేస్తున్నాను. అది కూడా ఎప్పుడో ముగిసిపోయిన కాలంలో తప్పెవరిది అని తేల్చడానికి కాదు. పరిస్థితులు ఎలా పరిణమించాయి అర్థం చేసుకోవడానికి మాత్రమే. అర్థం చేసుకుంటేనే గదా పరిష్కారాలు కనుక్కోగలిగేది!

>> మీది "ఆశ" నిజ్జంగా నిజమని నా అభిప్రాయం. వమ్ము చేయకండి!

ప్రయత్నిస్తాను. ఒకవేళ నెరవేరక పోయినా చర్చ మానేసి రచ్చ చెయ్యను. You can count on me.

>> చివరగా ఒకటి, ఇక్కడ మేం రాసింది ఎవరో వచ్చి ఊసుకోలు కబుర్లుతో వచ్చి రచ్చ..సారీ.. చర్చ చేస్తారని కాదు. గత, వర్తమాన సామాజిక విషయాలపై నిజాలు తెలుసుకుని తమ తర్వాతి తరానికి మార్గదర్శకం చేస్తారని!

Thank you for clarifying your intent. I commented as a response to the anonymous above my comment.

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు
మీరు అడిగినదంట్లో చెప్పినదాంట్లో తప్పేమీ లేదు. మీరు అన్నది అక్షరాల నిజం, అవి ఏంతో అవసరం!

$వారాంతం గారు
అజ్ఞాత గారు చెప్పినట్లు అవి వృధా చర్చలు. నే చెప్పినట్లు చేయండి అర్తవంతమైన చర్చ కోసం, నిజానిజాలు బయటపడడానికి!

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

@Anonymous,

>>ఈ పాటికే నేనే కులమో మీకు తెలుసు కనుక మీ గురించి తెలుసుకోవాలను కున్నాను అంతే. నేను బ్లాగులు రాయను. చదువుతాను అంతే.

I have no problem if you remine anonymous. I will only see the content of your comment. The meaning of your comment will not change based on who you are.

I really don't care which caste you belong. I am not interested. If you think, I have deduced your caste based on your comment, then I am glad to tell you that there are many people who really do not think like you.

ఇంక నా పేరు విషయానికి వస్తే, అదేమంత దాచిపెట్టే విషయం కాదు. ఊర్కే సరదాగా అలా వీకెండ్ పొలిటీషియన్ పేరుతో బ్లాగులు రాస్తున్నా. నా పేరూ నేనూ ఇక్కడ బ్లాగుల్లో చాలా మందికి తెలుసు. కాబట్టి ప్రస్తుతానికి నా పేరు చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నాను.

Anonymous said...

వారంతం గారు, మీరు చూడబోతే బ్లగులు హైదరాబాద్ వారు మాత్రమే చదువుతున్నారు అనుకొంట్టున్నట్లు ఉన్నారు. వారికి మీ గురించి తెలుసేమొ కాని నా లాటి వారికి మీ గురించి ఇతరుల దగ్గర ఆరా తీయవలసిన అవసరం ఎముంది. గీతాచార్య గలబ తెలిసిందే కదా.

Anonymous said...

వారి ఊరిలో ఒక్క చుక్క నీళ్ళు లేకపోయినా భారత దేశంలో గుజరాత్ తరువాత అభివృద్దిచెందిన రాష్ట్రం అని ఒక చోట చదివాను. వారికి ఉన్న వైగై,తామ్రపన్ని నదుల లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అందరికి తెలిసిందే. కావేరీ నది నీటి కొరకు కర్ణాటక తో అనునిత్యం గొడవ పడేవీరు ఒకప్పుడు తన్నీర్ తన్నీర్ అనే సినేమా తీసి వాళ్ళు నీళ్ళ కొరకు పడె కష్టాలను తెరకెక్కించు కొని పదిల పరచుకొన్నారు. ఇటువంటి వారు ఇప్పుడు ఎలా ఇంతాల అభివృద్ది సాదించారు. నీరు ఉన్న చోటే అభివ్రుద్ది, నాగరికతా ఉంట్టుందని చదువుతామే! నీరు పుష్కలం గా లేక పోయినా, వీరు చరిత్రను తిరగ రాస్తూ ఇంతలా అభివృద్ది ఎలా సాధించగలిగారు. వారిది నిజమైన అభివృదేనా? ఇతర రాష్ట్రాలు వారి అభివృద్ది మార్గం లో ప్రయాణినించవచ్చా? లేక ఈ అభివృద్ది వారికి, వారి సంస్కృతికి మాత్రమే స్వంతమా? వారి కోర్ కాంపిటెన్సిలేవి? ఈ కోణాం లో మనం ఒకసారి వారి అభివృద్ది నమూనా పరిశిలించ వలసిన అవసరం ఉంది. తమీళులలో ఉన్నది మిగతావారిలో లేని ప్రత్యేకత ఎమీటి? అనే అంశం మీద మీకు తెలిసిన మీ అనుభావలు పంచు కొంటే బాగుట్టుంది.

Anonymous said...

*నా లక్ష్యం వేరు.సమస్త మానవావనిని ప్రకృతి ఒడిలోకి చేర్చి సంరక్షించడమే నా లక్ష్యం
అధ్యక్ష తరహా పాలన అమలయ్యేలా చూడటం, గ్రామ స్థాయిలో రైతు సంఘాల ఏర్పాటు చేయ్యించడం, ఉన్న వ్యవసాయ పొలాలన్నింటిని లీజు ప్రాతిపదికన ఆ సంఘాలకు అప్పగించడం, సమిష్ఠి వ్యాసాయం సాగేలా చూడటం, సాగు నీటి కొరతకు శాస్వత పరిష్కారార్థం నదుల అనుసందానం చేపట్టడం. అందుకు గాను పది కోట్ల మంది నిరుధ్యోగులతో పత్యేక సైన్యం ఏపాటు చెయ్యడం, ప్రస్తుత కరెన్సి రద్దయ్యేలా, కొత్త కరెన్సి అమలయ్యేలా చేసి నల్లదానాన్ని నామ రూపాల్లేకుండా చెయ్యడం. ఈ నా లక్ష్య సాధనకు అసంభంధమైనవంతా నా కాలి గోటితో సమానం. *

ఎమైనా గోల్ సేట్టింగ్స్ వీడిదగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి. అరవ ప్రజల ఓవర్ యాక్షన్ అంటె తమ్మీ నుచ్చు చిన్న శివాజీ గణేషన్ లా గున్నావే. నీలాంటి ఆల్లోచనలు భారత దేశ ప్రధానికి కూడా లేవు. ఇంతింత భారీ లక్షాలు. బ్లాగు రాసుకొనే వీడీకి ఈ నా లక్ష్య సాధనకు అసంభంధమైనవంతా నా కాలి గోటితో సమానం. ఇవ్వని తమిళ సినేమాలు చూస్తే ఎక్కిన పైత్యం లా గునంది. ఎదో విజయ కాంత్ సినేమా చూసి ఉంటాడు అతని సినేమాలో ఒక సీన్ ఉనంట్టుంది ఒక గ్రామం లో ఎన్ని సార అంగడులు ఉన్నాయి, దాని మీద ఆదయం ఎంత, ఎంత మంది తాగుతున్నారు, ఇలా మొదలై మండలం,జిల్లా, రాష్ట్రం వరకు ఒక ఐదు నిముషాలు గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెపుతాడు. దీనినే వివేక్ ఇంకొక సినేమాలో పేరడి చేస్తాడు. jOker.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

anonymous గారు,

>> "వారంతం గారు, మీరు చూడబోతే బ్లగులు హైదరాబాద్ వారు మాత్రమే చదువుతున్నారు అనుకొంట్టున్నట్లు ఉన్నారు. వారికి మీ గురించి తెలుసేమొ కాని నా లాటి వారికి మీ గురించి ఇతరుల దగ్గర ఆరా తీయవలసిన అవసరం ఎముంది. గీతాచార్య గలబ తెలిసిందే కదా."

మీరు నా గురించి వివరాలు తెలుసుకోవాలనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. నేనెవరో చాలా మందికి ఈపాటికే తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పడం అంత అర్జంటు కాదని నా అభిప్రాయం. వీలయినంత తొందరలో నేనే ఒక పోస్టు రాస్తా లేండి.

నేనెవరు అనేదానికంటే నేను ఏం చెప్తున్నాననేదానికి ప్రాముఖ్యత ఉంటే మంచిదని నా అభిప్రాయమండీ.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers